Rahul ji come to Telangana.youth is calling

రాహుల్ జీ తెలంగాణకు రండి..యువత పిలుస్తోంది..: కేటీఆర్

హైదరాబాద్‌: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ముందు హైదరాబాద్‌లోని అశోక్ నగర్‌లో నిరుద్యోగ యువతను కలిసిన విషయం తెలిసిందే.ఎన్నికల ప్రచారంలో భాగంగా రాహుల్ గాంధీ చేసిన ఓ ట్వీట్‌ను రీ ట్వీట్ చేస్తూ కేటీఆర్ కాంగ్రెస్‌పై విమర్శలు గుప్పించారు.

‘హలో రాహుల్ గాంధీ జీ, తెలంగాణ యువత మీరు చెప్పిన ఏడాదికి 2 లక్షల ఉద్యోగాల హామీని నమ్మి కాంగ్రెస్ పార్టీకి ఓటు వేశారు. 8 నెలల తర్వాత కాంగ్రెస్ విడుదల చేసిన ‘జాబ్ లెస్ క్యాలెండర్, జీరో ఉద్యోగాల కారణంగా యువత ఆందోళన బాట పట్టారు.మీరు ఎందుకు మళ్లీ హైదరాబాద్‌లోని అశోక్‌నగర్‌కు వచ్చి అదే యువతను కలిసి మీరిచ్చిన హామీలను ఎలా నెరవేరుస్తారో చెప్పొచ్చు కదా’.. అని సూచించారు.

గతంలో రాహుల్ చేసిన ట్వీట్‌లో ‘తెలంగాణ యువత దొరల కేసీఆర్ పాలనలో తీవ్ర ఇబ్బందులు పడుతోందని..తన అశోక్ నగర్ పర్యటన తర్వాత ఈ విషయం స్పష్టమైందని.. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే జాబ్ క్యాలెండర్ విడుదల చేసి వారి సమస్యను పరిష్కరిస్తామని రాహుల్ హామీ ఇచ్చారు. ఏడాదికి 2 లక్షల ఉద్యోగాలు, టీజీపీఎస్సీని యూపీఎస్సీలా పునరుద్ధరిస్తామన్నారు. యువవికాసం పథకం కింద 5 లక్షల ఆర్థిక సాయం అందిస్తామన్నారు. యువత ప్రజాపాలన సాగించే కాంగ్రెస్‌కు మద్దతుగా నిలవాలని ఇదే నా గ్యారంటీ’ అని ట్వీట్ చేశారు.

Related Posts
ఈనెల 17న ఏపీ మంత్రి వర్గ సమావేశం

అమరావతి: ఈనెల 17న మరోసారి ఏపీ మంత్రివర్గ సమావేశం జరుగనుంది. ఈ మేరకు ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ ఉత్తర్వులు జారీ చేసారు. ముఖ్యమంత్రి నారా Read more

వడోదరాలో ఘోర ప్రమాదం
vadodara

గుజరాత్ రాష్ట్రంలోని వడోదరాలో మద్యం మత్తులో యువకుడు కారు నడిపి బీభత్సం సృష్టించాడు. 100 కి.మీ.కు పైగా వేగంతో కారు నడిపిన అతను సిటీ రోడ్లపై ప్రమాదకరంగా Read more

CM Revanth Reddy : తెలంగాణలో విద్యా రంగం క్షీణించిపోతోంది : సీఎం రేవంత్‌ రెడ్డి
తెలంగాణా రాష్ట్ర శాసనసభా సమావేశాలు కొనసాగుతున్నాయి. శాసన సభలో తెలంగాణా సీఎం రేవంత్ రెడ్డి కీలక తీర్మానం చేశారు. ఈ తీర్మానం ద్వారా తెలంగాణా ప్రభుత్వ స్టాండ్ ను ప్రకటించి, డీ లిమిటేషన్ విషయంలో కేంద్రంతో యుద్ధం ప్రకటించారు. డీ లిమిటేషన్ విషయంలో కేంద్ర వైఖరి మారాలన్నారు. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన నియోజక వర్గాల పునర్విభజన - డీలిమిటేషన్ విధి విధానాలలో మార్పులు చేయాలని సూచించారు. శాసనసభ నియోజక వర్గాలను పెంచాలనీ తీర్మానం శాసన సభలో డీ లిమిటేషన్ పై తీర్మానం ఆంధ్ర ప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం మేరకు రాష్ట్రంలో శాసనసభ నియోజక వర్గాలను పెంచాలనీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సభలో తీర్మానం ప్రవేశపెట్టారు. జనాభాలెక్కలకు అనుగుణంగా SC, ST స్థానాలను పెంచాలనీ కేంద్రాన్ని ఆయన కోరారు. డీలిమిటేషన్ విషయంలో కేంద్రం అనుసరిస్తున్న విధానాలు దక్షిణాది రాష్ట్రాలకు నష్టం వాటిల్లని విధంగా చేయాలని అభిప్రాయ పడ్డారు. నియోజక వర్గాల పెంపు పైన చర్చ దక్షిణాది రాష్ట్రాలకు డీ లిమిటేషన్ తో నష్టం కేంద్ర ప్రభుత్వంతో పార్లమెంట్ నియోజకవర్గాల పునర్విభజన, నియోజక వర్గాల పెంపు పైన చర్చ జరుపుతామని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. జనాభా ప్రాతిపదికన నియోజకవర్గాలను పునర్విభజన చేయాలని కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తుందని దీని కారణంగా దక్షిణాది రాష్ట్రాలు చాలా నష్టపోతాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఇందిరా గాంధీ కూడా డీలిమిటేషన్ కు అంగీకరించలేదు గతంలో ఇందిరాగాంధీ ఆమోదించలేదన్న సీఎం రేవంత్ గతంలో ఇందిరా గాంధీ కూడా డీలిమిటేషన్ కు అంగీకరించలేదని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. ఇక తాజాగా మరోమారు నియోజకవర్గాలు పునర్విభజన అంశం తెర మీదికి రావడంతో దక్షిణాది రాష్ట్రాలలో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయని ఆయన పేర్కొన్నారు. దక్షిణాది రాష్ట్రాలకు నష్టం జరిగేలా కేంద్రం వ్యవహరిస్తే ఖచ్చితంగా అందరితో కలిసి కేంద్రానికి ఎదురుగా నిలబడి పోరాటం చేస్తామని రేవంత్ రెడ్డి తేల్చి చెప్పారు. కడ్బందీగా కుటుంబ నియంత్రణ అమలు దక్షిణాది రాష్ట్రాల ప్రాతినిధ్యంపై రేవంత్ ఆందోళన దక్షిణాది రాష్ట్రాలు కుటుంబ నియంత్రణను పకడ్బందీగా అమలు చేశాయని, ఫలితంగా రాష్ట్రాలకు నష్టం జరిగితే ఊరుకోబోమన్నారు. ప్రభుత్వ విధానాన్ని సమగ్రంగా అమలు చేసినందుకు తమకే బెనిఫిట్ జరిగేలా చూడాలన్నారు. ఒకవేళ ఇదే జరిగితే దక్షిణాది రాష్ట్రాల ప్రాతినిధ్యం చట్టసభలలో 24 శాతం నుంచి 19 శాతానికి పడిపోయే ప్రమాదం ఉందని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. డీ లిమిటేషన్ విషయంలో రేవంత్ డిమాండ్ ఇదే డీలిమిటేషన్‌పై రాష్ట్రాల అభిప్రాయాలను తీసుకోకపోవడాన్ని శాసన సభ తీవ్రంగా ఖండిస్తోందని అన్నారు. ప్రస్తుతం ఉన్న నియోజకవర్గాలను మాత్రమే కొనసాగించాలని ఆయన తెలంగాణ అసెంబ్లీ సాక్షిగా తాము డిమాండ్ చేస్తున్నామన్నారు. రాష్ట్రంలో అసెంబ్లీ నియోజకవర్గాలను 153కు పెంచాలని డిమాండ్ చేశారు.

CM Revanth Reddy : తెలంగాణలో విద్యాశాఖపై సీఎం రేవంత్‌ రెడ్డి మాట్లాడుతూ.. ప్రతిస్థాయిలో విద్యా రంగం రోజు రోజుకూ క్షీణించిపోతోందని ఆవేదన వ్యక్తం చేశారు. 2021లో Read more

Future City: ఫ్యూచర్ సిటీ వచ్చేదెక్కడ? హైదరాబాద్‌కి ఎంత దూరం?
ఫ్యూచర్ సిటీ వచ్చేదెక్కడ? హైదరాబాద్‌కి ఎంత దూరం?

హైదరాబాద్.. సికింద్రాబాద్.. సైబరాబాద్.. ఇప్పుడు నాలుగో నగరంగా ఫ్యూచర్ సిటీని నిర్మిస్తామని చెబుతోంది తెలంగాణ ప్రభుత్వం. హైదరాబాద్ కోర్ సిటీకి సుమారు 60 కిలోమీటర్ల దూరంలో ఈ Read more