हिन्दी | Epaper
ఘోర విమాన ప్రమాదం..15 దుర్మరణం కొత్త H-1B వీసా దరఖాస్తులను నిలిపివేసిన టెక్సాస్ 16 వేల మంది ఉద్యోగులకు లేఆప్స్ USలో మంచు తుఫాన్.. 29 మంది మృతి పెళ్లి వేడుకలో ఆత్మాహుతి దాడి ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు చంద్రుడిపై హోటల్ ట్రంప్ వార్నింగ్ అగ్ని ప్రమాదం.. 100 మంది మృతి? సునీతా రిటైర్మెంట్ ఘోర విమాన ప్రమాదం..15 దుర్మరణం కొత్త H-1B వీసా దరఖాస్తులను నిలిపివేసిన టెక్సాస్ 16 వేల మంది ఉద్యోగులకు లేఆప్స్ USలో మంచు తుఫాన్.. 29 మంది మృతి పెళ్లి వేడుకలో ఆత్మాహుతి దాడి ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు చంద్రుడిపై హోటల్ ట్రంప్ వార్నింగ్ అగ్ని ప్రమాదం.. 100 మంది మృతి? సునీతా రిటైర్మెంట్ ఘోర విమాన ప్రమాదం..15 దుర్మరణం కొత్త H-1B వీసా దరఖాస్తులను నిలిపివేసిన టెక్సాస్ 16 వేల మంది ఉద్యోగులకు లేఆప్స్ USలో మంచు తుఫాన్.. 29 మంది మృతి పెళ్లి వేడుకలో ఆత్మాహుతి దాడి ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు చంద్రుడిపై హోటల్ ట్రంప్ వార్నింగ్ అగ్ని ప్రమాదం.. 100 మంది మృతి? సునీతా రిటైర్మెంట్ ఘోర విమాన ప్రమాదం..15 దుర్మరణం కొత్త H-1B వీసా దరఖాస్తులను నిలిపివేసిన టెక్సాస్ 16 వేల మంది ఉద్యోగులకు లేఆప్స్ USలో మంచు తుఫాన్.. 29 మంది మృతి పెళ్లి వేడుకలో ఆత్మాహుతి దాడి ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు చంద్రుడిపై హోటల్ ట్రంప్ వార్నింగ్ అగ్ని ప్రమాదం.. 100 మంది మృతి? సునీతా రిటైర్మెంట్

Rahul Gandhi : రాహుల్‌ గాంధీ అమెరికా పర్యటన ఖరారు

sumalatha chinthakayala
Rahul Gandhi : రాహుల్‌ గాంధీ అమెరికా పర్యటన ఖరారు

Rahul Gandhi : కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీ అమెరికా పర్యటనకు సంబంధించిన షెడ్యూల్ ఖరారైంది. ఆయన ఈనెల 21 నుంచి 22 వరకు అగ్రరాజ్యంలో పర్యటించనున్నారు. ఆ పార్టీ నేత పవన్‌ ఖేడా గురువారం ఎక్స్ వేదికగా ఈ విషయాన్ని వెల్లడించారు.

రాహుల్‌ గాంధీ అమెరికా పర్యటన

రోడ్‌ ఐలాండ్‌లోని బ్రౌన్ యూనివర్సిటీ

ఏప్రిల్ 21, 22 తేదీల్లో రాహుల్‌గాంధీ యూఎస్‌ లో పర్యటిస్తారని ఖేడా తెలిపారు. ఈ సందర్భంగా ఆయన రోడ్‌ ఐలాండ్‌లోని బ్రౌన్ యూనివర్సిటీని సందర్శిస్తారన్నారు. ఆ వర్సిటీలోని విద్యార్థులు, అధ్యాపకులతో మాట్లాడతారని తెలిపారు. దీనికి ముందు ఆయన ఎన్నారై సంఘ సభ్యులతో పాటు ఇండియా ఓవర్సీస్ కాంగ్రెస్‌ సభ్యులతోను సమావేశమవుతారని వెల్లడించారు.

గతేడాది సెప్టెంబరులోమూడ్రోజులు యూఎస్‌లో రాహుల్‌ పర్యటన

ఇక, గతేడాది సెప్టెంబరులో రాహుల్‌ మూడ్రోజులు యూఎస్‌లో పర్యటించారు. ఈ పర్యటన సమయంలో ఆయన పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఆయా కార్యక్రమాల్లో రాహుల్‌ రిజర్వేషన్లు, భారత్‌లో మతస్వేచ్ఛ వంటి అంశాలపై మాట్లాడారు. ఈ వ్యాఖ్యలు దేశీయంగా తీవ్ర దుమారం రేపాయి. సిక్కులను ఉద్దేశిస్తూ చేసిన వ్యాఖ్యలు వివాదానికి దారితీశాయి. బీజేపీ ఆయన మాటలను ఖండించింది. విదేశాల్లో భారత్‌ పరువు తీస్తున్నారని మండిపడింది.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870