हिन्दी | Epaper
గ్రూప్-1 అభ్యర్థులకు హైకోర్టులో ఊరట ఉద్యోగాలపై త్వరలో సిఎం రేవంత్ రెడ్డి భారీ ప్రకటన మేడారం జాతరతో ఆర్టీసీకి రూ.3.28 కోట్ల ఆదాయం రాష్ట్రానికి నిధులపై ప్రత్యేక కార్యాచరణ ఎన్నికలు సాఫిగా జరిగేలా చర్యలు నేటితో ముగియనున్న ఉపసంహరణ గడువు రాజ్యాంగాన్ని తొలగించడమే BJP లక్ష్యం రాష్ట్రవ్యాప్తంగా బార్ కౌన్సిల్ ఎన్నికల సందడి కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు గ్రూప్-1 అభ్యర్థులకు హైకోర్టులో ఊరట ఉద్యోగాలపై త్వరలో సిఎం రేవంత్ రెడ్డి భారీ ప్రకటన మేడారం జాతరతో ఆర్టీసీకి రూ.3.28 కోట్ల ఆదాయం రాష్ట్రానికి నిధులపై ప్రత్యేక కార్యాచరణ ఎన్నికలు సాఫిగా జరిగేలా చర్యలు నేటితో ముగియనున్న ఉపసంహరణ గడువు రాజ్యాంగాన్ని తొలగించడమే BJP లక్ష్యం రాష్ట్రవ్యాప్తంగా బార్ కౌన్సిల్ ఎన్నికల సందడి కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు గ్రూప్-1 అభ్యర్థులకు హైకోర్టులో ఊరట ఉద్యోగాలపై త్వరలో సిఎం రేవంత్ రెడ్డి భారీ ప్రకటన మేడారం జాతరతో ఆర్టీసీకి రూ.3.28 కోట్ల ఆదాయం రాష్ట్రానికి నిధులపై ప్రత్యేక కార్యాచరణ ఎన్నికలు సాఫిగా జరిగేలా చర్యలు నేటితో ముగియనున్న ఉపసంహరణ గడువు రాజ్యాంగాన్ని తొలగించడమే BJP లక్ష్యం రాష్ట్రవ్యాప్తంగా బార్ కౌన్సిల్ ఎన్నికల సందడి కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు గ్రూప్-1 అభ్యర్థులకు హైకోర్టులో ఊరట ఉద్యోగాలపై త్వరలో సిఎం రేవంత్ రెడ్డి భారీ ప్రకటన మేడారం జాతరతో ఆర్టీసీకి రూ.3.28 కోట్ల ఆదాయం రాష్ట్రానికి నిధులపై ప్రత్యేక కార్యాచరణ ఎన్నికలు సాఫిగా జరిగేలా చర్యలు నేటితో ముగియనున్న ఉపసంహరణ గడువు రాజ్యాంగాన్ని తొలగించడమే BJP లక్ష్యం రాష్ట్రవ్యాప్తంగా బార్ కౌన్సిల్ ఎన్నికల సందడి కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు

Ponnam Prabhakar: ఆర్టీసీ బస్సులోని ప్రయాణికులతోని మాట్లాడిన పొన్నం, మేయర్ విజయలక్ష్మి

Ramya
Ponnam Prabhakar: ఆర్టీసీ బస్సులోని ప్రయాణికులతోని మాట్లాడిన పొన్నం, మేయర్ విజయలక్ష్మి

ప్రజల మధ్యకి వచ్చి వారిని కలిసిన మంత్రి పొన్నం ప్రభాకర్

హైదరాబాద్ నగరంలో రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ వినూత్న పద్ధతిని అనుసరించారు. ప్రజల మూడ్‌, అభిప్రాయాలు తెలుసుకోవడమే లక్ష్యంగా ఆయన సిటీ ఆర్టీసీ బస్సులో సాధారణ ప్రయాణికుల్లా ప్రయాణించారు. ఆయనతో పాటు నగర మేయర్ గద్వాల విజయలక్ష్మి, రాజ్యసభ సభ్యుడు అనిల్ కుమార్ యాదవ్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. పంజాగుట్ట నుంచి లక్డీకాపూల్ వరకు సాధారణంగా టికెట్ తీసుకొని ప్రయాణించడం ద్వారా, ఈ నేతలు ప్రజల మధ్యకి వచ్చారు. అధికార పధవుల్లో ఉన్న నేతలు ప్రత్యక్షంగా ప్రజలతో మమేకమవుతారు అంటే, అది నూతన శైలికే మారుపేరు. ఈ ప్రయాణ సమయంలో బస్సులో ఉన్న ప్రయాణికులతో మంత్రి ఆత్మీయంగా సంభాషించగా, మహిళలతో ప్రత్యేకంగా మాట్లాడారు. వారు ఎదుర్కొంటున్న వాస్తవ పరిస్థితులను తెలుసుకొని, ప్రభుత్వం అందిస్తున్న పథకాలపై వారి అభిప్రాయాలను స్వయంగా విన్నారు.

మహాలక్ష్మి పథకం ప్రభావం – మహిళల జీవితాల్లో మార్పు

ప్రయాణంలో ప్రధానంగా మహిళలతో మాట్లాడిన మంత్రి, రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న మహాలక్ష్మి పథకం గురించి వివరించారు. ఈ పథకం ద్వారా మహిళలకు అందిస్తున్న ఉచిత బస్సు (Free Bus) ప్రయాణ సౌకర్యం ఎన్నో కుటుంబాలకు ఆర్థికంగా మేలు చేస్తోందని మంత్రి వివరించగా, బస్సులో ఉన్న మహిళలు కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ప్రతినెలా రూ. 600 నుంచి రూ. 1000 వరకు ఆదా అవుతోందని, ఇది తమ కుటుంబ బడ్జెట్‌ను నిలకడగా ఉంచడంలో సహాయపడుతోందని వారు చెప్పారు. గత ప్రభుత్వాల్లో ఎన్నడూ ఇవ్వనటువంటి ప్రయోజనాలను ఇప్పుడు మహిళలు పొందుతున్నారని, ఇది నిజమైన మహిళా సంక్షేమానికి నిదర్శనమని మంత్రి స్పష్టంగా తెలిపారు. ఈ పథకం వల్ల ఉద్యోగాలకు వెళ్లే మహిళలు, విద్యార్థినులు, మధ్య తరగతి మహిళలు ఎంతో ప్రయోజనం పొందుతున్నారని చెప్పారు.

రేవంత్ రెడ్డి ప్రభుత్వం సంక్షేమానికి మారుపేరు

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు మరింత చేరువయ్యేలా అనేక సంక్షేమ పథకాలతో ముందుకు సాగుతోందని చెప్పారు. సన్న బియ్యం పంపిణీ, ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపు, రూ. 500కి గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ వంటి పథకాలు ఇప్పటికే విజయవంతంగా అమలవుతున్నాయని వివరించారు. మహిళా సంఘాలను ఆర్థికంగా బలోపేతం చేయడమే కాకుండా, కోటి మంది మహిళలను కోటీశ్వరులుగా తీర్చిదిద్దాలన్నదే తమ ప్రభుత్వ ముఖ్యమైన లక్ష్యమని మంత్రి పేర్కొన్నారు. ఇది కేవలం నినాదంగా కాకుండా, ప్రణాళికాబద్ధంగా అమలవుతోందని అన్నారు.

నగర రవాణా వ్యవస్థలో నూతన వైపు

రాష్ట్ర రవాణా శాఖ మంత్రి హోదాలో, హైదరాబాద్ నగర రవాణా వ్యవస్థను మెరుగుపరచేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల గురించి కూడా మంత్రి వివరించారు. ఇటీవలే పెద్ద సంఖ్యలో కొత్త ఆర్టీసీ బస్సుల (RTC BUS) ను ప్రవేశపెట్టామని, ప్రజలకు ప్రయాణంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటున్నామని హామీ ఇచ్చారు. నగరంలోని రద్దీ ప్రాంతాలకు ఎక్కువ బస్సులు మంజూరు చేయడం, కొత్త రూట్లు ప్రారంభించడం, ఆన్‌లైన్ టికెటింగ్ వంటి ఆధునిక సదుపాయాలను పరిచయం చేయడంపై కూడా దృష్టి పెట్టామన్నారు.

Read also: Sajjanar: వాహనదారులను మరోసారి హెచ్చరించిన సజ్జనార్

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870