POK: పీఓకే మనదేనంటూ రాజ్‌నాథ్ సింగ్ కీలక వ్యాఖ్యలు

Read Time:  1 min
POK: పీఓకే మనదేనంటూ రాజ్‌నాథ్ సింగ్ కీలక వ్యాఖ్యలు
FONT SIZE
GET APP

కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్ మనదే అని అక్కడ ఉండే ప్రజలు కూడా మన వాళ్లే అని కీలక వ్యాఖ్యలు చేశారు. భౌగోళికంగా విడిపోయినా అక్కడి ప్రజలకు ఇండియాతో ధృడమైన సంబంధాలు ఉన్నాయని పేర్కొన్నారు. ఏదో ఒకరోజు వారంతా మన దేశంలో ఏకం అవుతారని అయితే ఆరోజు ఎంతో దూరంలో లేదని చెప్పారు. సీఐఐ బిజినెస్ సదస్సు(CII Business Conference)లో ఇవాళ ఆయన మాట్లాడుతూ ఉగ్రవాదం పట్ల భారత్ తన వ్యూహాన్ని రీడిజైన్, రీ డిఫైన్ చేసిందని స్పష్టం చేశారు. గ్రేట్ ఇండియా సంకల్పమే మా లక్ష్యం అని వివరించారు.

భౌగోళికంగా

నేడు దేశ రాజధాని ఢిల్లీలోని సీఐఐ బిజినెస్ సదస్సులో రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగానే జాతిని ఉద్దేశించి మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. మనకు ఏమైనా చేసే శక్తి ఉన్నప్పటికీ సంయమనం కూడా చాలా అవసరం అని రాజ్‌నాథ్ సింగ్ వ్యాఖ్యానించారు. ఆపరేషన్ సిందూర్(Operation Sindoor) ద్వారా దేశ భద్రతకు మేకిన్ ఇండియా ముఖ్యం అని ప్రూవ్ అయిందన్నారు. అందుకే భారత్ తన వ్యూహాన్ని రీడిజైన్, రీ డిఫైన్ చేసిందని స్పష్టం చేశారు. అందులో భాగంగానే ఫైటర్ జెట్లు, క్షిపణి వ్యవస్థలను నిర్మించడంతో పాటు కొత్త తరం యుద్ధ సాంకేతికతల పైనా దృష్టి పెట్టామన్నారు. ముఖ్యంగా ఆపరేషన్ సిందూర్ సమయంలో ఉపయోగించిన దేశీయంగా అభివృద్ధి చెందిన వ్యవస్థలు ప్రపంచం మొత్తాన్ని ఆశ్చర్యానికి గురి చేశాయన్నారు. శత్రు కవచాన్ని దాటుకుని వెళ్లగలమని అందరికీ నిరూపించామన్నారు.

POK: పీఓకే మనదేనంటూ రాజ్‌నాథ్ సింగ్ కీలక వ్యాఖ్యలు
POK: పీఓకే మనదేనంటూ రాజ్‌నాథ్ సింగ్ కీలక వ్యాఖ్యలు

ఉద్దేశంతో

పాకిస్థాన్, పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోని ఉగ్రస్థావరాలే లక్ష్యంగా దాడులు చేసిన వీటిని ఉపయోగించగా మన ఆయుధాలు ఎలా ధ్వంసం చేశాయో అందరూ చూశారాని రాజ్‌నాథ్ సింగ్(Rajnath Singh) తెలిపారు. మనం తలుచుకుంటే ఇంకా చేయగలం అని బలంతో పాటు నిగ్రహం, సమన్వయం కూడా పాటించాలనే ఉద్దేశంతోనే ఆగినట్లు వెల్లడించారు. అలాగే ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాకిస్థాన్ కు తను చేసిన తప్పు వల్ల భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందనేది స్పష్టంగా అర్థమైందన్నారు.

Read Also: Karnataka: కర్ణాటక లో మత ఘర్షణలను ఆపేందుకు స్పెషల్ ఫోర్స్

Anusha

రచయిత గురించి

Anusha

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.