Plane crash in Sudan2

సూడాన్‌లో విమాన ప్రమాదం – 46కి చేరిన మరణాలు

సూడాన్‌లో జరిగిన ఘోర విమాన ప్రమాదంలో మరణాల సంఖ్య 46కి చేరింది. అధికారిక వర్గాల సమాచారం మేరకు, ఓమ్హర్మన్ నగరంలో ఈ ప్రమాదం జరిగింది. ప్రాథమిక వివరాల ప్రకారం, విమాన ప్రమాదంలో మిలిటరీ సిబ్బంది, పౌరులు మృతి చెందినట్లు నిర్ధారించారు. ఈ ఘటనలో ఇంకా 10 మంది తీవ్రంగా గాయపడినట్లు అధికారులు వెల్లడించారు. గాయపడినవారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉందని, మరణాల సంఖ్య పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది.

Plane crash in Sudan2

పౌర నివాసాలపై కూలిన విమానం

ప్రధానంగా పౌర నివాసాలపై విమానం కూలడంతో భారీగా ప్రాణ నష్టం జరిగింది. ఈ ఘటనకు గల కారణాలను అధికారులు పరిశీలిస్తున్నారు. సూడాన్ ఆర్మీ, ర్యాపిడ్ దళాల మధ్య గత కొన్ని నెలలుగా తీవ్ర యుద్ధం జరుగుతున్న నేపథ్యంలో ఈ ప్రమాదం సంభవించింది. అయితే ఈ విమానం ప్రమాదవశాత్తుగా కూలిందా? లేక యుద్ధం నేపథ్యంలో గాల్లోనే ధ్వంసమైందా? అనే కోణంలో దర్యాప్తు కొనసాగుతోంది.

సూడాన్‌లో నెలకొన్న గందరగోళ పరిస్థితి

2023 నుంచి సూడాన్‌లో సైన్యం, ర్యాపిడ్ సపోర్ట్ దళాల మధ్య తీవ్ర యుద్ధం జరుగుతోంది. ఈ యుద్ధం కారణంగా వేలాది మంది నిరాశ్రయులయ్యారు. సూడాన్‌లో పరిస్థితి రోజు రోజుకు మరింత ఉగ్రరూపం దాలుస్తోంది. ఈ విమాన ప్రమాదం యుద్ధానికి సంబంధించి మరో కొత్త ముప్పును రేకెత్తించే అవకాశం ఉందని అంతర్జాతీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఇప్పటికే సూడాన్ పరిస్థితిని గమనిస్తున్న ఐక్యరాజ్య సమితి, ఇతర అంతర్జాతీయ సంస్థలు తాజా ఘటనపై మరింత దృష్టి సారించాయి.

Related Posts
అంజీర్ పండ్లను రాత్రి నానబెట్టి తింటే కలిగే లాభాలు
health benefits of anjeer f

ఆరోగ్య నిపుణులు ప్రకారం, అంజీర్ పండ్లను రాత్రి నానబెట్టి ఉదయం తినడం శరీరానికి అనేక రకాల లాభాలను అందిస్తుంది. ఈ పండ్లను తేనెతో కలిపి పరగడుపున తింటే Read more

ముఖ్య నేతలతో కేసీఆర్ కీలక నిర్ణయాలు ప్రకటించే అవకాశం
పార్టీ భవిష్యత్ కోసం కేసీఆర్ వ్యూహం – ముఖ్య నేతలతో కీలక సమావేశం

తెలంగాణ రాజకీయాల్లో హీట్ పెరుగుతోంది. ముఖ్యంగా ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్, టీచర్ నియోజకవర్గాల ఎన్నికల అనంతరం కొత్త రాజకీయ సమీకరణాలు తెరపైకి వచ్చాయి. తాజాగా ఎమ్మెల్యే కోటాలో అయిదు Read more

సౌత్వెస్ట్ ఎయిర్‌లైన్స్ విమానం గన్‌ఫైర్‌కి గురి
southwest airlines

అమెరికాలోని డల్లాస్, టెక్సాస్ నుండి ఇండియానా రాష్ట్రంలోని ఇండియానపోలిస్‌కు ప్రయాణిస్తున్న సౌత్వెస్ట్ ఎయిర్‌లైన్స్ విమానం గురువారం రాత్రి గన్‌ఫైర్‌కి గురైంది. ఈ సంఘటన శుక్రవారం సాయంత్రం 8:30 Read more

Kashmir : ఏప్రిల్‌ 19న కశ్మీర్‌కు పరుగులు వందేభారత్‌ రైలు
Vande Bharat train to run to Kashmir on April 19

Kashmir : తొలిసారి వందేభారత్‌ రైలు కాశ్మీర్‌లోయలోకి అందుబాటులోకి రానుంది. ఈ మేరకు ఏప్రిల్‌ 19న తొలి వందే భారత్‌ రైలు కాట్రా నుంచి కశ్మీర్‌కు పరుగులు Read more