ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కుమారుడు మార్క్ శంకర్ పవనోవిచ్ సింగపూర్లోని ఓ పాఠశాలలో జరిగిన అగ్నిప్రమాదంలో గాయపడిన సంగతి తెలిసిందే. ఈ వార్త వెలువడే సమయానికి పవన్ అల్లూరి జిల్లా గిరిజన ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు.తన పర్యటనను కొనసాగిస్తూ, ఇక్కడి ప్రజలకు ఇచ్చిన మాట ఉంది. పర్యటన పూర్తయ్యాకే సింగపూర్ వెళ్తాను” అని ఉదయం మీడియాతో చెప్పారు. ఈ విషయంపై అతని నిశ్చయాన్ని చూసిన అభిమానులు మరింత గర్వపడిపోయారు.సాయంత్రం వరకు పర్యటన పూర్తి చేసుకుని పవన్ విశాఖపట్నంలో మీడియా ముందుకు వచ్చారు. కొడుకు గాయపడిన విషయంపై తొలిసారి స్పందించారు. “అదేదో చిన్న ఘటన అనుకున్నా.

కానీ అసలు విషయం తెలిసినప్పుడు షాక్ అయ్యాను” అని ఆయన చెప్పారు.ఆదిలోన విషయం అంతగా అర్థం కాలేదు. చిన్న గాయం అనుకున్నాను. తర్వాత ఆసుపత్రిలో చేర్చారని తెలిసి కలత కలిగింది, అని చెప్పిన పవన్ కళ్యాణ్ గళం కొంచెం కంపించిపోయింది.“తన ఊపిరితిత్తుల్లోకి పొగ వెళ్లడంతో బ్రాంకోస్కోపీ చేస్తున్నారట. మా అబ్బాయి పక్కనే కూర్చున్న క్లాస్మేట్కి తీవ్రమైన గాయాలయ్యాయట. ఇంకా వేరే ఓ చిన్నారి ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయాడని తెలిసి హృదయం గులికి పోయింది, అంటూ తన బాధను పంచుకున్నారు.ఈ అగ్నిప్రమాదం సమ్మర్ క్యాంప్ సందర్భంగా జరిగిందని, ఇది నిజంగా దురదృష్టకరమైన ఘటనగా అభివర్ణించారు. “బిడ్డలు అక్కడ సురక్షితంగా ఉంటారని తల్లిదండ్రులు నమ్ముతారు. కానీ ఇలాంటి సంఘటనలు ఆ నమ్మకాన్ని దెబ్బతీస్తున్నాయి” అని పవన్ ఆవేదన వ్యక్తం చేశారు.తన కుమారుడి ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం మెరుగుపడుతోందని తెలిపారు. “డాక్టర్లు మంచి కేర్ తీసుకుంటున్నారు. త్వరలోనే మార్క్ కోలుకుంటాడని ఆశిస్తున్నాం” అన్నారు.పవన్ కల్యాణ్ మాటల్లో తండ్రిగా ఉండే ఆత్మీయత, ఆందోళన స్పష్టంగా కనిపించింది. ఆయన అభిమానులు, ప్రజలు సోషల్ మీడియాలో ‘గెట్ వెల్ సూన్ మార్క్’ అంటూ మద్దతు తెలుపుతున్నారు.ఈ ఘటన తాలూకు హృదయవిదారక పరిణామాలు ప్రతి ఒక్కరికీ ఆవేదన కలిగిస్తున్నాయి. కానీ పవన్ తాత్కాలికంగా అయినా ప్రజాసేవలో నిలిచిన తీరు అందరికీ ప్రశంసనీయమైంది.
READ ALLSO : అమరావతిలో రేపు సీఎం చంద్రబాబు ఇంటికి శంకుస్థాపన