హోలీ పండుగ సంబరాలు దేశవ్యాప్తంగా అంబరాన్ని తాకుతున్నాయి.చిన్నా,పెద్దా అనే తేడా లేకుండా అందరూ రంగుల పండుగలో మునిగితేలుతున్నారు. ఒకరిపై ఒకరు రంగులు చల్లుకుంటూ, నృత్యాలతో, పాటలతో హోలీ ఉత్సవాలను ఆనందంగా జరుపుకుంటున్నారు. హోలీకా దహనం తర్వాత హోలీ వేడుకలు మరింత ఉత్సాహంగా ప్రారంభమయ్యాయి. ప్రధాన నగరాల్లో, పట్టణాల్లో ప్రజలు పెద్ద సంఖ్యలో వీధుల్లోకి వచ్చి ఉత్సాహంగా పాల్గొంటున్నారు.
పూల హోలీతో ప్రత్యేక ఉత్సవాలు
పతంజలి విశ్వవిద్యాలయంలో యోగా గురు రామ్దేవ్ ఆధ్వర్యంలో హోలీ వేడుకలు భిన్నంగా జరిగాయి. హరిద్వార్లోని పతంజలి విశ్వవిద్యాలయంలో స్వామి రామ్దేవ్, ఆచార్య బాలకృష్ణ సమక్షంలో ప్రత్యేక ‘హోలీ ఉత్సవ యజ్ఞం’ నిర్వహించారు. ఈ సందర్భంగా, రామ్దేవ్ దేశ ప్రజలకు వసంత నవస్సాయేష్ఠి శుభాకాంక్షలు తెలియజేశారు. హోలీ పండుగ కేవలం రంగుల పండుగ మాత్రమే కాకుండా, సామాజిక సామరస్యం, ప్రేమ, సోదరభావం, చెడుపై మంచి విజయానికి చిహ్నం అని పేర్కొన్నారు.
ఆచార్య బాలకృష్ణ
హోలీ అంటే అహంకారాన్ని త్యజించే పండుగ అని అన్నారు. ఇది మనలోని దుష్ట భావోద్వేగాలను, హిరణ్యకశ్యపుని హోలిక రూపంలో దహనం చేసే పండుగ అన్నారు. హోలీ రోజున విభేదాలన్నింటినీ మరచిపోయి, సోదరభావం రంగులో రంగులు వేసుకోవడం ద్వారా ఈ పవిత్ర పండుగను అర్థవంతంగా చేసుకోవచ్చన్నారు. దేశ ప్రజలు హోలీ పండుగను పూర్తి స్వచ్ఛతతో జరుపుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. హోలీ రోజున ఆవు పేడ, మట్టి, రసాయన రంగులు వాడకండి. పువ్వులు, మూలికా గులాల్తో మాత్రమే హోలీ జరుపుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. రసాయనాలు కలిగిన రంగుల వల్ల కళ్ళు, చర్మ వ్యాధులు వచ్చే అవకాశం ఉందని బాలకృష్ణ ఆందోళన వ్యక్తం చేశారు.

ఈ కార్యక్రమంలో, పతంజలి విశ్వవిద్యాలయంలోని అన్ని అధికారులు, ఉద్యోగులు, యూనిట్ అధిపతులు, విభాగాధిపతులు, పతంజలి సంస్థకు అనుబంధంగా ఉన్న అన్ని యూనిట్ల ఉద్యోగులు, విద్యా సంస్థల ప్రిన్సిపాళ్లు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, ఉద్యోగులు, సన్యాసి సోదరులు, సాధ్వి సోదరీమణులు పాల్గొన్నారు.
దేశప్రజలందరికి విజ్ఞప్తి
సనాతన సంస్కృతికి సంబంధించిన ప్రతి పండుగను యోగా, యజ్ఞాలతో జరుపుకుంటామన్న రామ్దేవ్ బాబా యోగా, యజ్ఞాలు మన శాశ్వత సంస్కృతి జీవ ఆత్మ అంశాలని గుర్తు చేశారు. గంజాయి, మద్యం మత్తు కారణంగా ఈ సామరస్యం చెడిపోకుండా చూడాలని రామ్దేవ్ బాబా దేశప్రజలందరికి విజ్ఞప్తి చేశారు.
పండుగ ముఖ్య ఉద్దేశం
ఢమరుకాలు మోగిస్తూ సందడి చేస్తున్నారు. పెద్ద సంఖ్యలో జనం రోడ్లపైకి రావడంతో పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. జీవితాల్లో ఆనందాన్ని నింపడమే ఈ పండుగ ముఖ్య ఉద్దేశం. రంగులతోనే కాకుండా డీజే పాటలు, రెయిన్ డ్యాన్స్లతో, ఆటలతో ఎంజాయ్ చేస్తున్నారు.