हिन्दी | Epaper
హైదరాబాద్‌లో నేషనల్ బుక్ ఫెయిర్ రీఛార్జ్ ధరలు పెంచనున్న టెలికాం కంపెనీలు? రైళ్లలో అదనపు లగేజీపై ఛార్జీలు ఢిల్లీ-ఆగ్రా ఎక్స్‌ప్రెస్ హైవేపై ఘోర ప్రమాదం SBI యోనోలో 6,500 ఉద్యోగాలు: ఛైర్మన్ వైద్యుల ప్రిస్క్రిప్షన్లపై NMC కీలక ఆదేశాలు సీయూఈటీ నోటిఫికేషన్ విడుదల: పీజీ ప్రవేశాలు ప్రారంభం ఘోర రోడ్డు ప్రమాదం.. పొగమంచే కారణం పెరగనున్న కార్ల ధరలు పోస్టాఫీస్‌లో మ్యూచువల్‌ ఫండ్‌ సేవలు హైదరాబాద్‌లో నేషనల్ బుక్ ఫెయిర్ రీఛార్జ్ ధరలు పెంచనున్న టెలికాం కంపెనీలు? రైళ్లలో అదనపు లగేజీపై ఛార్జీలు ఢిల్లీ-ఆగ్రా ఎక్స్‌ప్రెస్ హైవేపై ఘోర ప్రమాదం SBI యోనోలో 6,500 ఉద్యోగాలు: ఛైర్మన్ వైద్యుల ప్రిస్క్రిప్షన్లపై NMC కీలక ఆదేశాలు సీయూఈటీ నోటిఫికేషన్ విడుదల: పీజీ ప్రవేశాలు ప్రారంభం ఘోర రోడ్డు ప్రమాదం.. పొగమంచే కారణం పెరగనున్న కార్ల ధరలు పోస్టాఫీస్‌లో మ్యూచువల్‌ ఫండ్‌ సేవలు హైదరాబాద్‌లో నేషనల్ బుక్ ఫెయిర్ రీఛార్జ్ ధరలు పెంచనున్న టెలికాం కంపెనీలు? రైళ్లలో అదనపు లగేజీపై ఛార్జీలు ఢిల్లీ-ఆగ్రా ఎక్స్‌ప్రెస్ హైవేపై ఘోర ప్రమాదం SBI యోనోలో 6,500 ఉద్యోగాలు: ఛైర్మన్ వైద్యుల ప్రిస్క్రిప్షన్లపై NMC కీలక ఆదేశాలు సీయూఈటీ నోటిఫికేషన్ విడుదల: పీజీ ప్రవేశాలు ప్రారంభం ఘోర రోడ్డు ప్రమాదం.. పొగమంచే కారణం పెరగనున్న కార్ల ధరలు పోస్టాఫీస్‌లో మ్యూచువల్‌ ఫండ్‌ సేవలు హైదరాబాద్‌లో నేషనల్ బుక్ ఫెయిర్ రీఛార్జ్ ధరలు పెంచనున్న టెలికాం కంపెనీలు? రైళ్లలో అదనపు లగేజీపై ఛార్జీలు ఢిల్లీ-ఆగ్రా ఎక్స్‌ప్రెస్ హైవేపై ఘోర ప్రమాదం SBI యోనోలో 6,500 ఉద్యోగాలు: ఛైర్మన్ వైద్యుల ప్రిస్క్రిప్షన్లపై NMC కీలక ఆదేశాలు సీయూఈటీ నోటిఫికేషన్ విడుదల: పీజీ ప్రవేశాలు ప్రారంభం ఘోర రోడ్డు ప్రమాదం.. పొగమంచే కారణం పెరగనున్న కార్ల ధరలు పోస్టాఫీస్‌లో మ్యూచువల్‌ ఫండ్‌ సేవలు

Bilawal Bhutto Zardari : భిలావల్ భుట్టో వ్యాఖ్యలకు ఒవైసీ కౌంటర్

Sudheer
Bilawal Bhutto Zardari : భిలావల్ భుట్టో వ్యాఖ్యలకు ఒవైసీ కౌంటర్

సింధు నది జలాల ఒప్పందంపై పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ నేత భిలావల్ భుట్టో జర్దారీ చేసిన సంచలన వ్యాఖ్యలపై ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ తీవ్రంగా స్పందించారు. సింధు జలాల విషయంలో “రక్తం ప్రవహిస్తుంది” అని భిలావల్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర విమర్శలకు లోనయ్యాయి. పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో భారత్ సింధు జలాల ఒప్పందాన్ని పునఃసమీక్షించాలని భావిస్తుండగా, ఈ నేపథ్యంలో భిలావల్ చేసిన హెచ్చరికలపై దేశవ్యాప్తంగా రాజకీయ నేతల నుంచి వ్యతిరేక స్పందన వ్యక్తమవుతోంది.

Read Also : Khawaja Asif : భారత్ మమ్మల్ని వదిలిపెట్టదు – పాక్ మంత్రి కీలక వ్యాఖ్యలు

భిలావల్ కుటుంబ చరిత్ర గుర్తుచేసిన ఒవైసీ

భిలావల్ వ్యాఖ్యలపై స్పందించిన ఒవైసీ, “తన తాత జుల్ఫికర్ అలీ భుట్టోను, తల్లి బెనజీర్ భుట్టోను ఎవరు హత్య చేశారు తెలుసుకోవాలని” చురకలంటించారు. తీవ్రవాదమే భిలావల్ కుటుంబాన్ని చంపిందని, అలాంటప్పుడు ఇలాంటి భయాందోళనలు సృష్టించడమేంటని ప్రశ్నించారు. అమెరికా సహాయం లేకుండా దేశాన్ని నడపలేని పరిస్థితిలో ఉన్న పాకిస్థాన్ నాయకులు మళ్ళీ మతం పేరుతో బెదిరింపులు చేయడం సరికాదని ఒవైసీ మండిపడ్డారు.

పాకిస్థాన్ నేతలపై తీవ్రమైన ఆరోపణలు

ఒవైసీ తన విమర్శలను మరింత తీవ్రంగా చేసి, పాకిస్థాన్ నేతలను ఖవారిజ్‌లకంటే అధ్వాన్నమైనవారిగా అభివర్ణించారు. అమాయకులను లక్ష్యంగా చేసుకుని దాడులు చేయడం వల్ల ఏ దేశమైనా మౌనంగా ఉండదని, దాడుల ద్వారా మతాన్నీ, మానవత్వాన్నీ అపహాస్యం చేస్తున్నారని ఒవైసీ పేర్కొన్నారు. బెనజీర్ భుట్టో హత్య కేసు ఇప్పటికీ అపరిష్కృతంగా ఉండడం, తీవ్రవాద శక్తుల పాత్రపై ఉన్న అనుమానాలను గుర్తు చేస్తూ, పాకిస్థాన్ విధానాలపై ఒవైసీ గట్టి విమర్శలు చేశారు.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870