Over 500 Indians released from UAE prisons

UAE: క్షమాభిక్ష..యూఏఈ జైళ్ల నుంచి 500 మందికి పైగా భారతీయులు విడుదల!

UAE: భారత్‌తో సత్సంబంధాలను మరింత బలోపేతం చేసుకునే క్రమంలో యూఏఈ అనూహ్య నిర్ణయం తీసుకుంది. పవిత్ర రంజాన్‌ మాసం సందర్భంగా భారీ సంఖ్యలో ఖైదీలకు క్షమాభిక్ష ప్రసాదించింది. అందులో భారత్‌కు చెందిన వాళ్లే 500 మందికి పైగా ఉండగా.. వాళ్లంతా జైళ్ల నుంచి విడుదలైనట్లు సమాచారం. ఈ చర్య భారత్‌- యూఏఈల మధ్య బలమైన సంబంధాలను తెలియజేస్తోంది.

యూఏఈ  జైళ్ల నుంచి 500 మందికి

దుబాయ్‌లోని జైళ్లలో మగ్గుతున్న వివిధ దేశాలకు చెందిన ఖైదీ

రంజాన్‌ సందర్భంగా యూఏఈ అధ్యక్షుడు షేక్‌ మహ్మద్‌ బిన్‌ జాయేద్‌ అల్‌ నహ్యాన్‌ అక్కడి జైళ్లలో ఉన్న 1,295 మంది ఖైదీలను విడుదల చేయాలని ఆదేశించారు. మరోవైపు ప్రధాని షేక్‌ మొహమ్మద్‌ బిన్‌ రషీద్‌ అల్‌ మక్తూమ్‌ కూడా 1,518 మంది ఖైదీలకు క్షమాభిక్ష ప్రసాదిస్తూ నిర్ణయం తీసుకున్నారు. దుబాయ్‌లోని జైళ్లలో మగ్గుతున్న వివిధ దేశాలకు చెందిన ఖైదీలకు తాజా క్షమాభిక్ష వర్తిస్తుందని అటార్నీ జనరల్‌, ఛాన్సలర్‌ ఎస్సమ్‌ ఇస్సా అల్‌ హుమైదాన్‌ ప్రకటించారు.

ఖైదీలకు క్షమాభిక్ష ప్రసాదించడం యూఏఈలో ఆనవాయితీ

రంజాన్‌ మాసం సందర్భంగా ఇలా ఖైదీలకు క్షమాభిక్ష ప్రసాదించడం.. విడుదల చేయడం యూఏఈలో ఆనవాయితీగా వస్తోంది. అయితే సత్ప్రవర్తనను ఆధారంగా చేసుకునే ఆయా ఖైదీలను ఎంపిక చేసి విడుదల చేస్తుంటారు. అంతేకాదు వాళ్లు జనజీవన స్రవంతిలో కలిసిపోయేందుకు అవసరమయ్యే ఆర్థిక సాయం కూడా అందించనున్నారు. కాగా, యూఏఈలో మరణశిక్షలు పడిన భారతీయులు 25 మంది ఉన్నారని, వారిపై కోర్టు తీర్పులు ఇంకా అమలుకాలేదని విదేశీ వ్యవహారాలశాఖ సహాయమంత్రి కీర్తి వర్థన్‌సింగ్‌ ఇటీవల రాజ్యసభలో తెలిపారు.

Related Posts
బంగ్లాదేశ్ నేత యూనస్ ఎన్నికల మార్గరేఖ కోసం సమయం కోరారు
Muhammad Yunus

బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రధానమంత్రి ముహమ్మద్ యూనస్, ఆగస్టులో ప్రధాని షేక్ హసీనాను పదవినుంచి తొలగించిన తర్వాత, దేశంలో రాజకీయ స్థితిగతులను సరి చేయడానికి బాధ్యత వహిస్తున్నారు. తన Read more

ఎలన్ మస్క్, ట్రంప్ కలిసి “గాడ్ బ్లెస్ అమెరికా” పాట పాడిన ప్రదర్శన వైరల్
musk

టెస్లా CEO ఎలన్ మస్క్ మరియు అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్, డెన్వర్‌లోని మార్అ లాగో ఎస్టేట్‌లో “గాడ్ బ్లెస్ అమెరికా” పాటను కలిసి పాడిన Read more

తెలంగాణలో ఆరోగ్యశ్రీ సేవలు పునఃప్రారంభం
తెలంగాణలో ఆరోగ్యశ్రీ సేవలు పునఃప్రారంభం

జనవరి 10 న పెండింగ్ వైద్య బిల్లులపై ఆరోగ్యశ్రీ సేవలను నిలిపివేసిన తెలంగాణ నెట్‌వర్క్ హాస్పిటల్స్ అసోసియేషన్ (తన్హా) సభ్య ఆసుపత్రులు సోమవారం తమ నిరసనలను విరమించుకుని, Read more

వైసీపీ పై మంత్రి మనోహర్ విమర్శలు
ఎమ్మెల్సీ టికెట్ పై సంచలన చర్చ వర్మకు గౌరవం దక్కాలనే మనోహర్ అభిప్రాయం

రాష్ట్ర ఆహార, పౌర సరఫరాల శాఖ మంత్రి, జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పాలనపై తీవ్ర విమర్శలు Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *