ఇటీవల పాకిస్థాన్ సెనేట్ సమావేశంలో ఇషాక్ దార్ చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారం రేపుతున్నాయి. బ్రిటన్కు చెందిన ప్రముఖ పత్రిక ది డైలీ టెలిగ్రాఫ్ పాక్ ఎయిర్ఫోర్స్ను “గగనతల రారాజు” అని ప్రశంసించిందని ఆయన ప్రకటించారు.ఇషాక్ దార్ ప్రకారం, మే 10న ఆ పత్రిక ప్రచురించిన కథనంలో పాకిస్థాన్ వైమానిక దళాన్ని ఆకాశానికెత్తేసిందట. ఇది ఇండియా ‘ఆపరేషన్ సిందూర్’కు ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు వచ్చిన తరుణంలో మరింత దృష్టిని ఆకర్షించింది.అయితే, దార్ మాటల్లో నిజం ఉందా? అనే అనుమానంతో డాన్ న్యూస్ నిజ నిర్ధారణ చేపట్టింది. డాన్ వివరించిందేమంటే… మే 10న టెలిగ్రాఫ్ పత్రిక మొదటి పేజీలో అలాంటి కథనం లేదని స్పష్టంచేసింది.

అసలు టెలిగ్రాఫ్ ఏమంది?
ఇంతకీ ఆ కథనం నిజమేనా? లేదంటూ స్పష్టంగా స్పందించింది డైలీ టెలిగ్రాఫ్. “గగనతల రారాజు పాక్ ఎయిర్ఫోర్స్” అనే శీర్షికతో తాము ఎప్పుడూ ఏ కథనం రాయలేదు అని వారు తెలిపారు.వాస్తవానికి, ఈ నకిలీ కథనం ఎయిర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా సృష్టించబడినట్లు అనుమానాలు. కొంతమంది పాక్ నెటిజన్లు ఈ నకిలీ వార్తను సోషల్ మీడియాలో వైరల్ చేశారు. Ishaq Dar అది నిజమని నమ్మి, పార్లమెంట్లో చదివి హాస్యాస్పదమైన పరిస్థితికి లోనయ్యారు.
అంతర్జాతీయంగా పెరిగిన దార్పై విమర్శలు
ఇషాక్ దార్ ప్రకటనపై విమర్శలు అంతర్జాతీయంగా విపరీతంగా వెల్లువెత్తుతున్నాయి. సామాజిక మాధ్యమాల్లో నెటిజన్లు ఆయనపై సెటైర్లు వేస్తున్నారు. “బాధ్యతాయుతమైన పదవిలో ఉంటూ, ఫేక్ న్యూస్ ఎలా నమ్మగలరు?” అంటూ షాక్ వ్యక్తం చేస్తున్నారు.ట్విటర్, ఫేస్బుక్, యూట్యూబ్లో దార్ ప్రసంగంపై వందల కొద్దీ మెమ్స్, కామెంట్స్, వీడియోలు వెల్లువెత్తుతున్నాయి. అసలు ఎంపీ స్థాయిలో ఉన్న వ్యక్తి ఇలా చేయడం దురదృష్టకరం అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
Read Also : Pakistan on Kashmir Issue :చర్చలకు సిద్ధంగా వున్నాం.. పాకిస్థాన్ ప్రధాని