Cricket Betting Case : వైసీపీ నేతపై ఆన్‌లైన్ క్రికెట్ బెట్టింగ్ కేసు నమోదు

Read Time:  1 min
Andhra Pradesh politics
Andhra Pradesh politics
FONT SIZE
GET APP

Cricket Betting Case : ఏపీ, తెలంగాణలో పలు నగరాలను టార్గెట్ చేసుకుని ఆన్లైన్ బెట్టింగ్ నిర్వహిస్తున్న వై మురళి, ఎం వెంకట్రావులను పోలీసులు పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లులో ఆదివారం నాడు అరెస్ట్ చేశారు. ఆన్‌లైన్ బెట్టింగ్ నిర్వహిస్తున్న వైసీపీ నేత ఎడ్ల తాతాజీ తో పాటు అతడి సోదరుడిపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. నరసాపురం డిఎస్పి శ్రీ వేద ఈ కేసు వివరాలను మీడియాకు వెల్లడించారు.

వైసీపీ నేతపై ఆన్‌లైన్ క్రికెట్

బైపాస్ రెడ్డి సమీపంలో ఆన్లైన్ క్రికెట్ బెట్టింగ్

హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం కేంద్రాలుగా చేసుకొని కొందరు ఆన్లైన్ క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్నారని పాలకొల్లు పోలీసులకు సమాచారం అందింది. దాంతో పోలీసులు పాలకొల్లు పరిధిలోని పెనుమదం బైపాస్ రెడ్డి సమీపంలో ఆన్లైన్ క్రికెట్ బెట్టింగ్ జరుగుతున్న సమాచారంతో ఆకస్మిక దాడి చేశామన్నారు. మురళి, వెంకట్రావు అనే ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసినట్లు తెలిపారు. వారి వద్ద నుంచి పది సెల్ ఫోన్లు రెండు ల 30000 నగదు స్వాధీనం చేసుకున్నారు.

పరారీలో ఉన్న వైసీపీ నేత ఆయన సోదరుడు

ఈ ఆన్లైన్ బెట్టింగ్ కు సంబంధించి వైసీపీ నేత, ఉమ్మడి జిల్లా డీసీఎంఎస్ మాజీ చైర్మన్ ఎడ్ల తాతాజీ తోపాటు ఆయన సోదరుడు నాగేశ్వరరావు పై కేసు నమోదు చేసినట్లు తెలిపారు. వీరు గత కొన్ని ఏళ్లుగా ఆన్లైన్ బెట్టింగ్ రాకెట్ నిర్వహిస్తున్నారని పోలీసులు స్పష్టం చేశారు. పరారీలో ఉన్న వైసీపీ నేత ఆయన సోదరుడు కోసం రెండు స్పెషల్ టీమ్స్ తో గాలింపు చర్యలు చేపట్టామని వెల్లడించారు.

Read Also: విశాఖ శారదాపీఠానికి టీటీడీ నోటీసులు

sumalatha chinthakayala

రచయిత గురించి

sumalatha chinthakayala

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.