TTD notice to Visakhapatnam Sarada Peetham

TTD : భవనాన్ని ఖాళీ చేయండి..విశాఖ శారదాపీఠానికి టీటీడీ నోటీసులు

TTD : తిరుమలలో విశాఖ శారదా పీఠం భవనాన్ని ఖాళీ చేసి తమకు అప్పగించాలని టీటీడీ అధికారులు మఠానికి నోటీసు జారీ చేశారు. స్థానిక గోగర్భం డ్యామ్‌ సమీపంలో ఉన్న విశాఖ శ్రీశారదా పీఠం భవనం ముందు, వెనుక నిబంధనలు ఉల్లంఘించి నిర్మాణాలు చేపట్టగా.. అప్పటి వైసీపీ ప్రభుత్వం సానుకూలంగా స్పందించి ఆక్రమణలను క్రమబద్ధీకరించింది. దీనిపై ప్రజాసంఘాలు, హిందూ ధర్మ పరిరక్షణ సంఘాలు మఠం ఎదుట ఆందోళన చేపట్టాయి. అనంతరం కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే తిరుమల నుంచే ప్రక్షాళన ప్రారంభిస్తున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు.

Advertisements
విశాఖ శారదాపీఠానికి టీటీడీ నోటీసులు

నిర్మాణంలో ఆక్రమణలు, అవకతవకలు

ఆ తర్వాత విశాఖ శారదా పీఠం మఠం భవన నిర్మాణంలో ఆక్రమణలు, అవకతవకలు జరిగినట్లు టీటీడీ అధికారుల కమిటీ ఇచ్చిన నివేదిక ఆధారంగా తిరుమలలో శారదా పీఠం ఆక్రమణలను తొలగిస్తామని టీటీడీ ఛైర్మన్‌ బీఆర్‌ నాయుడు బోర్డు సమావేశంలో పేర్కొన్నారు. టీటీడీ ఎస్టేట్‌ విభాగం అధికారులు విశాఖ శారదా పీఠానికి షోకాజ్‌ నోటీసులు జారీ చేయగా మఠం నిర్వాహకులు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. నిబంధనలను మఠం ఉల్లంఘించిందని న్యాయస్థానం గుర్తించడంతోపాటు మఠంపై చర్యలు తీసుకునే అధికారం టీటీడీకు ఉందని తీర్పులో పేర్కొంది. ఈ మేరకు 15 రోజుల్లోపు మఠాన్ని ఖాళీ చేసి భవనాన్ని అప్పగించాలని టీటీడీ ఎస్టేట్‌ విభాగం నోటీసు జారీ చేసింది.

Read Also: మెగా డీఎస్సీ కాదు మెగా డ్రామా – వైసీపీ

Related Posts
ఎస్ఎల్బీసీ టన్నెల్ వద్ద సహాయక చర్యలు… రంగంలోకి కేరళ డాగ్ స్క్వాడ్
ఎస్ఎల్బీసీ టన్నెల్ వద్ద సహాయక చర్యలు... రంగంలోకి కేరళ డాగ్ స్క్వాడ్

ఎస్ఎల్బీసీ టన్నెల్ వద్ద సహాయక చర్యలు… రంగంలోకి కేరళ డాగ్ స్క్వాడ్ నాగర్ కర్నూలు జిల్లా దోమలపెంట సమీపంలో ఎస్ఎల్బీసీ టన్నెల్ 14వ కిలోమీటరు వద్ద జరిగిన Read more

Krithi Shetty : తెలుగులో ఐరెన్ లెగ్ అనిపించుకున్న మెగా బ్యూటీ అక్కడ గోల్డెన్ లెగ్ కాబోతుందా..?
kruthi

కృతి శెట్టి తెలుగులో తన కెరీర్‌ను 'ఉప్పెన' సినిమాతో ప్రారంభించింది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ అవడంతో, కృతి శెట్టి ఓవర్‌నైట్ స్టార్ హీరోయిన్‌గా Read more

ఆలయ హుండీలో 2000 నోట్లు చలామణి
వైకుంఠపురం వేంకటేశ్వరస్వామి ఆలయ హుండీలో రూ.2 వేల నోట్ల ప్రత్యక్షం

దేశవ్యాప్తంగా రూ.2 వేల నోట్ల చెలామణి 2023లో రద్దైన విషయం అందరికీ తెలుసు. అయితే, ఆ నోట్లు ఇప్పుడు బయటపడటమే కాదు, ఓ ఆలయ హుండీలో కనిపించడం Read more

Hyderabad : యజమానినికరచి చంపినపెంపుడు కుక్క
Hyderabad : యజమానినికరచి చంపినపెంపుడు కుక్క

హైదరాబాద్‌ యూసుఫ్‌గూడ పరిధిలోని మధురానగర్‌లోని ఓ అపార్ట్‌మెంట్‌లో శనివారం రాత్రి ఘోర సంఘటన చోటుచేసుకుంది. పవన్ కుమార్ (35) అనే వ్యక్తి తన నివాసంలో మృతదేహంగా కనిపించడం Read more

Advertisements

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×