జమ్మూ కశ్మీర్లో ఇటీవల జరిగిన పహల్గామ్ ఉగ్రదాడి ఘటనపై పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ (Pakistan Prime Minister Shehbaz Sharif)స్పందించారు.అయితే, ఆయన వ్యాఖ్యలు సామాన్యంగా కాకుండా,మరోసారి వివాదానికి దారి తీసేలా ఉన్నాయి.ఈ దాడిని “దురదృష్టకరం” అన్న ఆయన, అప్పట్లో పాక్ ఎదుర్కొన్న 1971 యుద్ధ ఓటమికి తాము “ప్రతీకారం తీర్చుకున్నాం” అంటూ అసంబద్ధంగా వ్యాఖ్యానించడం భారత వర్గాల్లో తీవ్ర అభ్యంతరాలు రేపుతోంది.ఒకవైపు దాడిని ఖండిస్తున్న షరీఫ్, మరోవైపు భారత్పై రాజకీయ పంచులు (Political attacks on India)వేయడం గమనార్హం.ఈ దాడితో రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు మరింత పెరిగే పరిస్థితి ఏర్పడింది,” అంటూ తెలిపారు.అంతటితో ఆగకుండా, “1971 పరాజయానికి ఇది ఒక రకమైన బదులు,అన్నట్లు చెలరేగారు,(“This is a kind of revenge for the 1971 defeat,” they said)

ముజఫరాబాద్లో బాధిత కుటుంబాలకు పరామర్శ
భారత సైన్యం చేపట్టిన ‘ఆపరేషన్ సిందూర్’ సమయంలో ముజఫరాబాద్ ప్రాంతంలో మరణించిన పాకిస్తాన్ జవాన్ల కుటుంబాలను షరీఫ్ కలసి పరామర్శించారు.బాధిత కుటుంబాలకు ఆర్థికంగా సహాయంగా చెక్కులు అందించారు.ఈ సందర్భంగా పహల్గామ్ ఘటన గురించి మాట్లాడుతూ, భారత్ను నిష్పాక్షిక దర్యాప్తుకు ఒప్పించాలన్న యత్నం చేసినట్లు తెలిపారు.
భారత్పై నేరుగా ఆరోపణ
పహల్గామ్ దాడిపై తాము అంతర్జాతీయ స్థాయిలో విచారణకు సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు.అయితే, భారత్ మాత్రం ఈ ప్రతిపాదనను ఖండించిందని ఆరోపించారు.ఇదే అంశాన్ని వివిధ అంతర్జాతీయ లేవనెత్తాలని పాకిస్థాన్ ప్రయత్నిస్తున్నట్లుగా కనిపిస్తోంది.
రాజకీయ లబ్దికోసం ప్రయోగం?
1971 యుద్ధానికి ఈ ఘటనను అనుసంధానిస్తూ మాట్లాడిన షరీఫ్, ఈ వ్యాఖ్యలతో ఏం సాధించాలనుకుంటున్నారో స్పష్టంగా అర్థం కావడం లేదు.ఒకవైపు శాంతికి పిలుపు ఇస్తూ, మరోవైపు మునుపటి ఘర్షణల్ని తెరపైకి లాగే ప్రయత్నం చేయడం రాజకీయ ప్రయోజనాల కోసమేనన్న అనుమానాలను పెంచుతోంది.
అంతర్జాతీయ స్పందన కోసం ఎదురు చూస్తున్న పాక్
పాకిస్థాన్ తనదైన వాదనలతో ఈ దాడిని అంతర్జాతీయ దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నంలో ఉంది.కానీ, అంతర్జాతీయ సమాజం దీనిపై ఎలా స్పందించనుందో వేచి చూడాల్సిందే.ప్రస్తుతం వరకు ఐక్యరాజ్య సమితి వంటి ప్రముఖ సంస్థల నుంచి ఎటువంటి అధికారిక స్పందన రాలేదు.
Read Also : Jyoti Malhotra : జ్యోతిని స్పాన్పర్ చేసిన సంస్థకు అజర్ బైజాన్ తో ఒప్పందం!