ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh)లో జిల్లాల పేర్ల మార్పుల దిశగా కూటమి ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. సరిహద్దులు, పేర్ల మార్పులపై సమగ్రంగా అధ్యయనం చేయాలని భావిస్తోంది. ఇప్పటికే దీనికి సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది.పేర్లు, సరిహద్దుల మార్పులపై చర్చించేందుకు ప్రభుత్వం ప్రత్యేకంగా మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేసింది. జిల్లాలు, మండలాలు, గ్రామాల పరిపాలన పునర్వ్యవస్థపై ఈ ఉపసంఘం పరిశీలన చేస్తుంది. ప్రజాప్రతినిధుల సూచనలు, ప్రజాభిప్రాయాలతో మేళవించి నివేదిక రూపొందించనుంది.

ప్రధాన కార్యదర్శి ఉత్తర్వులు జారీ
ఈ నిర్ణయానికి సంబంధించి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ మంగళవారం అధికారిక ఉత్తర్వులు విడుదల చేశారు. జిల్లా పేర్ల మార్పులు (Changes in district names), మండలాల విభజన, గ్రామాల విలీనం వంటి అంశాలపై సమీక్ష చేసి నివేదిక ఇవ్వాలని స్పష్టంగా ఆదేశించారు.ఇప్పటికే కొన్ని జిల్లాల్లో ప్రజలు పేర్ల మార్పు కోరుతున్నారు. తమ ప్రాంతాలకు చరిత్ర, సంస్కృతిని ప్రతిబింబించే పేర్లు కావాలన్న డిమాండ్ వినిపిస్తోంది. కొంతమంది ప్రజలు మాత్రం గత ప్రభుత్వ తీసుకున్న నిర్ణయాలపై అసంతృప్తిగా ఉన్నారు. కాబట్టే కొత్త ప్రభుత్వం ఈ అంశంపై సమగ్ర దృష్టితో ముందుకు వెళ్తోంది.
ప్రభుత్వ లక్ష్యం: సమగ్ర పాలన
పేర్లు మారుస్తే కేవలం గుర్తింపే కాదు, పరిపాలన కూడా బాగుంటుందనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. పాలనను ప్రజలకు మరింత చేరువ చేయాలనే దృష్టితో కొత్త సరిహద్దులు నిర్ణయించబోతున్నారు. ప్రజలకు స్పష్టమైన పరిపాలనా వ్యవస్థ అందించడమే ప్రభుత్వ లక్ష్యంగా కనిపిస్తోంది.ఈ అధ్యయన కమిటీ నివేదికపై ప్రభుత్వం త్వరలోనే నిర్ణయం తీసుకోనుంది. దీనివల్ల వచ్చే రోజుల్లో జిల్లాల పునర్వ్యవస్థ, పేర్ల మార్పులపై స్పష్టత రావచ్చు. ప్రజల అభిప్రాయాలు, ప్రాంతీయ చరిత్ర ఆధారంగా నిర్ణయాలు తీసుకుంటామని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.
Read Also : IIT Kharagpur: ఐటీ ఖరగ్పూర్లో మరో విద్యార్థి మృతి