NTRSevalu banhd

నేటి నుండి నుంచి ఎన్టీఆర్ వైద్య సేవలు బంద్

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్టీఆర్ వైద్య సేవలు తాత్కాలికంగా నిలిపివేయనున్నట్లు ఆస్పత్రుల సంఘం ప్రకటించింది. నేటి నుండి రాష్ట్రవ్యాప్తంగా అన్ని నెట్వర్క్ ఆస్పత్రుల్లో ఈ సేవలను నిలిపివేస్తామని స్పష్టం చేసింది. ప్రభుత్వంపై రూ.3,500 కోట్ల మేర బకాయిలు పెండింగ్‌లో ఉన్నాయని, ఈ పరిస్థితిలో ఆస్పత్రుల నిర్వహణ సాధ్యం కావడం లేదని ఆస్పత్రుల సంఘం వెల్లడించింది.

బకాయిలను విడుదల ఆలస్యం

ఇప్పటికే ప్రభుత్వాన్ని పలుమార్లు కోరినా, బకాయిలను విడుదల చేయకపోవడంతో తాము సేవలను కొనసాగించలేమని ఆస్పత్రుల యాజమాన్యాలు స్పష్టం చేశాయి. ప్రభుత్వంతో జరిగిన చర్చలు ఎలాంటి సానుకూల ఫలితాన్నీ ఇవ్వలేదని, చివరికి తమకు ఈ నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చిందని తెలిపాయి.

ఆర్థిక ఇబ్బందుల కారణం

ఇప్పటివరకు తమ సామర్థ్యానికి మించి సేవలు అందించామని, అయితే ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఇకపై సేవలను కొనసాగించలేమని ఆస్పత్రుల యాజమాన్యాలు అధికారికంగా నోటీసులు పంపాయి. ప్రభుత్వ వైఖరి మారకపోతే, రాష్ట్రవ్యాప్తంగా ఆరోగ్య సేవలు తీవ్రంగా దెబ్బతింటాయని, దీని ప్రభావం పేద, మధ్య తరగతి ప్రజలపై పడతుందని ఆస్పత్రుల సంఘం హెచ్చరించింది.

NTR
NTR

రాష్ట్రవ్యాప్తంగా లక్షలాది మంది రోగులకు తీవ్ర అసౌకర్యం

ఈ అంశంపై ప్రభుత్వం వెంటనే స్పందించి బకాయిలను విడుదల చేయాలని, లేదంటే రాష్ట్రవ్యాప్తంగా లక్షలాది మంది రోగులకు తీవ్ర అసౌకర్యం కలగొచ్చని వైద్య రంగ నిపుణులు చెబుతున్నారు. ప్రజలకు మెరుగైన వైద్యసేవలను అందించేందుకు ప్రభుత్వం వెంటనే తగిన చర్యలు తీసుకోవాలని, లేదంటే ఆందోళనలు మరింత ఉద్ధృతమయ్యే అవకాశం ఉందని ఆస్పత్రుల సంఘం హెచ్చరించింది.

Related Posts
సంక్రాంతి నాటికి రాష్ట్రంలో గుంతలు లేని రోడ్లు: సీఎం చంద్రబాబు
Roads without potholes in the state by Sankranti. CM Chandrababu

అమరావతి: సీఎం చంద్రబాబు పరవాడలో గుంతలు పడిన రోడ్లను పూడ్చే కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గుంతల రోడ్లు నరకానికి రహదారులు అని.. రోడ్ల Read more

కిసాన్ దివాస్ 2024: రైతుల కృషిని స్మరించుకునే రోజు
kisan diwas

ప్రతి సంవత్సరం డిసెంబరు 23న భారతదేశంలో "కిసాన్ దివాస్" లేదా "కిసాన్ దినోత్సవం" జరుపుకుంటారు. ఈ రోజు వ్యవసాయ క్షేత్రంలో కార్మికులు మరియు రైతుల మహత్వాన్ని గుర్తించేందుకు, Read more

ముస్లిం ఉద్యోగులకు వెసలుబాటు కల్పించిన ఏపీ సర్కార్
Ramadan 2025

ముస్లిం ఉద్యోగులు ఇబ్బంది పడకుండా ఈ నిర్ణయం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముస్లిం ఉద్యోగులకు శుభవార్త అందించింది. రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని, ముస్లిం ప్రభుత్వ ఉద్యోగులకు విధుల నుంచి Read more

బడ్జెట్ సమావేశాల్లో కొత్త ఆదాయపు పన్ను చట్టం!
nirmala sitharaman

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ త్వరలో జరగబోయే బడ్జెట్ సమావేశాల్లో కొత్త ఆదాయపు పన్ను చట్టాన్ని ప్రవేశపెట్టనున్నారు. ప్రస్తుత ఆదాయపు పన్ను చట్టం-1961ను రద్దు చేసి, Read more