ఇప్పట్లో బోనస్, వేతన పెంపు లేనట్లే: సీఈవో క్లారిటీ!

ఇప్పట్లో బోనస్, వేతన పెంపు లేనట్లే: సీఈవో క్లారిటీ!

చాలా కాలంగా దేశీయ ఐటీ సేవల కంపెనీలు తమ ఉద్యోగులకు వేతన పెంపులతో పాటు బోనస్ ప్రకటన గురించి కీలక సమాచారాన్ని అధికారికంగా పంచుకుంటున్నాయి. ఇప్పటికే ఇన్ఫోసిస్, విప్రో వంటి కంపెనీలు ఉద్యోగులకు వీటికి సంబంధించిన వివరాలను షేర్ చేశాయి. ఈ క్రమంలోనే అమెరికా కేంద్రంగా పనిచేస్తున్న కాగ్నిజెంట్ కూడా తమ ఉద్యోగులకు వీటికి సంబంధించిన విషయాలపై కీలక సమాచారం అందించిందని తెలుస్తోంది. వివరాల్లోకి వెళితే.. టెక్ మేజర్ కాగ్నిజెంట్ సీఈవో రవి కుమార్ ఇటీవల జరిగిన టౌన్ హాల్ సమావేశంలో సంస్థ ఉద్యోగులకు బోనస్, ఆలస్యం అయిన జీతాల పెంపుల పత్రాల గురించి ఉద్యోగులతో మాట్లాడారు. వాస్తవానికి ఇది ఉద్యోగుల ఆందోళనలను పరిష్కరించడానికి, సంస్థ పరిహారం ప్రణాళికలపై స్పష్టత ఇవ్వడానికి ఏర్పాటు చేయటం జరిగింది.

Advertisements
ఇప్పట్లో బోనస్, వేతన పెంపు లేనట్లే: సీఈవో క్లారిటీ!


ఆగస్ట్ వరకు వాయిదా
ఈ సమావేశంలో సీఈవో ఉద్యోగుల ఆందోళనలను అంగీకరించారు. ముఖ్యంగా వేతన పెంపులపై మాట్లాడుతూ.. వాస్తవానికి వీటిన ఏప్రిల్‌లో జరగాలని నిర్ణయించబడినప్పటికీ.. ప్రస్తుతం కొన్ని కారణాల వల్ల ఆగస్ట్ వరకు వాయిదా వేస్తున్నట్లు పేర్కొన్నారు. ఆలస్యానికి కారణాన్ని వివరిస్తూ.. కంపెనీ ఆర్థిక లక్ష్యాలు, మార్కెట్ పరిస్థితులతో సరిగ్గా సరిపోలడానికి ఒక వ్యూహాత్మక నిర్ణయమని చెప్పుకొచ్చారు. అయితే సంస్థ హామీ ఇచ్చిన పెంపులను గౌరవించడంలో నిబద్ధత ఉందని, అయితే ఇది కొంత మేరకు ఆలస్యంగా జరుగుతోందని స్పష్టం చేశారు. ఇదే సమయంలో సీఈవో రవి కుమార్ బోనస్ నిర్మాణంపై కూడా కీలక కామెంట్స్ చేశారు. కంపెనీ అర్హత గల ఉద్యోగులు తమ బోనస్లను ప్రణాళిక ప్రకారం అందుకుంటారని తెలిపారు. సమయానికిగాను చెల్లింపులు జరిపేందుకు కృషి చేస్తున్నట్లు ఉద్యోగులకు హామీ ఇచ్చారు. మా ఉద్యోగులు వారి కష్టపడి పని చేసినదానికి తగినంత న్యాయం చేయాలని భావిస్తున్నట్లు చెప్పారు.
కంపెనీ ఈ మార్చి నెలలో బోనస్లు అందజేయనున్నది. ఈ బోనస్ లు పొందడానికి అర్హులైన ఉద్యోగులు మార్చి 10 నాటికి బోనస్ లెటర్స్ మెయిల్ ద్వారా పొందుతారని స్పష్టం చేశారు. ఎలాంటి సవాళ్లను ఎదుర్కొంటున్నప్పటికీ కంపెనీ వృద్ధి, ఆవిష్కరణల పై దృష్టిని తప్పించటం లేదని వెల్లడించారు.
పరిగణనలోకి కంపెనీ ఆర్థిక పరిస్థితులు
కంపెనీ ఆర్థిక పరిస్థితులను పరిగణలోకి తీసుకుని భవిష్యత్తు విజయాలను సాధించటానికి ఏఐ, డిజిటల్ ట్రాన్స్‌ఫర్మేషన్ వంటి రంగాల్లో వ్యూహాత్మక పెట్టుబడులపై దృష్టి పెట్టడంపై నమ్మకంగా ఉన్నట్లు తెలిపారు. దీని ప్రకారం ఉద్యోగులకు వేతన పెంపులు మరింత ఆలస్యాన్ని సూచిస్తున్నాయి. ఇది ఉద్యోగుల మోటివేషన్ దెబ్బతీస్తుందనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి.

Related Posts
Rahul Gandhi: అమెరికా పర్యటనకు వెళ్లనున్న రాహుల్‌ గాంధీ..!
Rahul Gandhi to visit America.

Rahul Gandhi: ఏప్రిల్‌ 19 నుంచి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అమెరికాలో పర్యటించనున్నట్లు సమాచారం. ఈసందర్భంగా ఆయన బ్రౌన్‌ యూనివర్శిటీని సందర్శిస్తారు. బోస్టన్‌లో ప్రవాస భారతీయులతోనూ Read more

ఉద్యోగ నియమాలకు బ్యాంక్ ఆఫ్ బరోడా ప్రకటన
ఉద్యోగ నియమాలకు బ్యాంక్ ఆఫ్ బరోడా ప్రకటన

బ్యాంక్ ఆఫ్ బరోడా 518 పోస్టుల నోటిఫికేషన్ 2025 డిగ్రీ పూర్తిచేసి ఉద్యోగం కోసం చూస్తున్న అభ్యర్థులకు బ్యాంక్ ఆఫ్ బరోడా శుభవార్త చెప్పింది. ఈ బ్యాంక్ Read more

భారీ బందోబస్తు నడుమ ఢిల్లీ ఎన్నికలు నిర్వహిస్తున్న ఈసీ
EC is conducting the Delhi elections amid heavy preparations

న్యూఢిల్లీ: ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికలకు భారీ భద్రత నడుమ పోలింగ్‌ ప్రారంభమైంది. బుధవారం సాయంత్రం 6 గంటల వరకు ఓటింగ్‌ జరగనుందని ఈసీ పేర్కొంది. మొత్తం 70 Read more

ఛాంపియన్స్‌ ట్రోఫీ ఫైనల్‌ మ్యాచ్‌లో భారత్‌ వర్సెస్‌ న్యూజిలాండ్‌ గెలుపెవరిది?
ఛాంపియన్స్‌ ట్రోఫీ ఫైనల్‌ మ్యాచ్‌లో భారత్‌ వర్సెస్‌ న్యూజిలాండ్‌ గెలుపెవరిది?

ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ఫైనల్‌లో భారత్ మరియు న్యూజిలాండ్ మధ్య పోరాటం క్రికెట్ లవర్స్‌కు ఓ ఉత్కంఠ రేకెత్తిస్తున్న మెగా ఇన్కౌంటర్ గా మారింది. ఈ మ్యాచ్‌లో Read more

×