విజయవాడ Elections : స్థానిక సంస్థల ఎన్నికలు మూడు నెలల ముందుగా 2026 జనవరిలో నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం (State Election Commission) సన్నాహాలు చేస్తోంది. ఐదేళ్ళ పదవీకాలం ముగియడానికి మూడు నెలల ముందుగా ఎన్నికల నిర్వహణకు చట్టంలో ఉన్న వెసులుబాట్ల మేరకు ఏర్పాట్లు చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల కమీషనర్ నీలం సాహ్ని పంచాయితీరాజ్, పురపాలక శాఖల కమీషనర్లకు బుధవారం లేఖలు రాశారు. ప్రస్తుత సర్పంచుల పదవీ కాలం వచ్చే ఏడాది ఏప్రిల్లో… నగరపాలక, పురపాలక సంస్థలు, నగర పంచాయితీల్లో కార్పొరేటర్లు, కౌన్సిలర్ల పదవీ కాలం వచ్చే ఏడాది మార్చితో ముగియనుంది. ఆలోగానే జనవరిలో ఎన్నికల నిర్వహణకు ఇప్పటి నుంచే ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర ఎన్నికల కమీషనర్ లేఖలో పేర్కొన్నారు. ఈ లేఖ ప్రకారం ఎన్నికల నిర్వహణకు (Conduct of elections) షెడ్యూలు ఇలా ఉండవచ్చునంటున్నారు. 2025 అక్టోబరు 15 లోగా వార్డుల పునర్విభజన, రిజర్వేషన్ల ప్రక్రియ పూర్తి చేయాలి. అక్టోబరు 16 నుంచి నవంబరు 15 లోగా వార్డుల వారీగా ఓటర్ల జాబితాలు సిద్ధం చేసి, ప్రచురించాలి. నవంబరు 1 నుంచి 15 లోగా ఎన్నికల అధికారుల నియామకం పూర్తి చేయాలి. నవంబరు 16 నుంచి 30 లోగా పోలింగ్ కేంద్రాల ఖరారు, ఈవీఎంలు సిద్ధం చేయడం, సేకరణ వంటివి పూర్తి చేయాలి. డిసెంబరు 15 లోపు రిజర్వేషన్లు ఖరారు చేయాలి. డిసెంబరు చివరి వారంలో రాజకీయ పార్టీలతో సమావేశాలు నిర్వహించాలి. 2026 జనవరిలో ఎన్నికల నోటిఫికేషన్ ఇచ్చి, అదే నెలలో ఫలితాలు ప్రకటించాలి.

ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడు జరుగుతాయి?
రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకారం, 2026 జనవరిలో ఎన్నికలు జరగనున్నాయి.
ఎన్నికల షెడ్యూల్లో ముఖ్యమైన తేదీలు ఏమిటి?
అక్టోబర్ 15 లోపు వార్డుల పునర్విభజన పూర్తవుతుంది, డిసెంబర్ చివర్లో రాజకీయ పార్టీలతో సమావేశాలు జరుగుతాయి, జనవరిలో నోటిఫికేషన్ జారీ అవుతుంది.
Read hindi news : hindi.vaartha.com
Read also :