ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదివారం ఉత్తరప్రదేశ్లోని అయోధ్యలో (Ayodhya) ఉన్న శ్రీరామ జన్మభూమి మందిరాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా బాలరాముడిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ముఖ్యమంత్రి వెంట పలువురు నేతలు పాల్గొనగా, దేవాలయ అధికారులు మరియు ఉత్తరప్రదేశ్ ఎన్డీఏ నాయకులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. దర్శనం అనంతరం ఆలయ పరిసరాల్లో నెలకొన్న ఆధ్యాత్మిక వాతావరణం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
Read also: AP: విశాఖ ఉక్కు ప్రైవేటీకరణపై జగ్గారెడ్డి కీలక వ్యాఖ్యలు

Chandrababu Naidu
దర్శనం అనంతరం ఆలయ నిర్వాహకులు చంద్రబాబుకు ఆలయ నిర్మాణ శైలి, శిల్పకళ, నిర్వహణ విధానాలపై వివరించారు. దీనిపై ఆయన ఆసక్తిగా ప్రశ్నలు అడిగి తెలుసుకున్నారు. ఈ పర్యటన తనకు ఎంతో ప్రశాంతమైన, ఆధ్యాత్మిక అనుభూతిని ఇచ్చిందని సీఎం చంద్రబాబు తెలిపారు. శ్రీరాముడి విలువలు, ఆదర్శాలు సమాజానికి ఎప్పటికీ మార్గదర్శకమని పేర్కొంటూ, అవి ప్రతి ఒక్కరికి స్ఫూర్తినివ్వాలని ఆకాంక్షించారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: