📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

అభ్యర్థుల మధ్య లొల్లి చైర్ పర్సన్/మేయర్ ఎన్నిక తగ్గిన టమాటా ధరలు నిజామాబాద్, కరీంనగర్లో బిజెపి జెండా! జలమండలి పునర్వ్యవస్థీకరణ తెలంగాణకు శుభవార్త ఎన్నికల పోలింగ్ ఎంతంటే? ముగిసిన మున్సిపల్ పోలింగ్ కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు అభ్యర్థుల మధ్య లొల్లి చైర్ పర్సన్/మేయర్ ఎన్నిక తగ్గిన టమాటా ధరలు నిజామాబాద్, కరీంనగర్లో బిజెపి జెండా! జలమండలి పునర్వ్యవస్థీకరణ తెలంగాణకు శుభవార్త ఎన్నికల పోలింగ్ ఎంతంటే? ముగిసిన మున్సిపల్ పోలింగ్ కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు

AIMIM: జుబ్లీహిల్స్ ఎంఐఎం ఎందుకు పోటీచేయడం లేదు?

Author Icon By Saritha
Updated: October 9, 2025 • 2:57 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

కాంగ్రెస్, ఎంఐఎం లోపాయికారీ ఒప్పందం: బిజెపి ఎంపి రఘునందన్రావు:

హైదరాబాద్ : దేశమంతా ఎన్నికలు వస్తే ఎంఐఎం పార్టీ(AIMIM)జుబ్లీహిల్స్ ఎంఐఎం ఎందుకు పోటీచేయడం లేదు? ఎక్కడైనా పోటీ చేయడానికి సిద్ధంగా ఉంటుంది. కానీ మన భాగ్యనగరంలో, జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక జరగబోతుందని, ఇక్కడ మాత్రం ఎంఐఎం పార్టీ ఎందుకు పోటీ చేయడంలేదని బిజెపి ఎంపి రఘు నందన్రావు ప్రశ్నించారు. బుధవారం పార్టీ కార్యాల “యంలో మీడియాతో మాట్లాడారు, జుబ్లిహిల్స్ ఎంఐఎం ఎందుకు పోటీ చేయడం లేదన్న విషయాన్ని ఇప్రజలు ఆలోచించాల్సిన ప్రశ్న అన్నారు. 2014లో -తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత జరిగిన ఎన్నికల్లో జూబ్లీహిల్స్లో ఎంఐఎం పార్టీ పోటీ చేసి 41,656 ఓట్లు సాధించింది. రెండో స్థానంలో నిలిచిందన్నారు. అప్పుడు తెలుగుదేశం పార్టీ 50,898 ఓట్లతో గెలిచింది. కాంగ్రెస్ మూడో స్థానంలో, టిఆర్ఎస్ నాలుగో స్థానంలో -నిలిచాయి. తరువాత 2018, 2023 ఎన్నికల్లో కూడా ఎంఐఎం పోటీ చేసింది.

 Read also: టీవీకే పార్టీ అధినేత ఇంటికి బాంబు బెదిరింపు

ఎంఐఎం పార్టీ అభ్యర్థిని ఎందుకు నిలబెట్టడం లేదు?

కానీ ఇప్పుడు, 2025 నవంబర్ లో జరగబోయే ఈ ఉపఎన్నికలో మాత్రం ఎంఐఎం పార్టీ(AIMIM) అభ్యర్థిని ఎందుకు నిలబెట్టడం లేదు? దీని వెనక పెద్ద రాజకీయ కుట్ర దాగి ఉందన్నారు. ఎంఐఎం పార్టీ ఇప్పుడు ఎవరికీ మద్దతు ఇస్తుంది? బిఆర్ఎస్ కేనా? లేక ఆలోచించాలన్నారు. 2014లో రెండో స్థానానికి చేరిన ఎంఐఎం పార్టీ, ఇప్పుడు ఎందుకు పక్కకు తప్పుకుంటోంది? ఎవరితో కుమ్మక్కైంది? ఎవరికి లాభం కలిగేలా ఈ నిర్ణయం తీసుకుందన్నారు. డిసెంబరులో జరగ బోయే జిహెచ్ఎంసి ఎన్నికల్లో ఎంఐఎం పార్టీకి మేయర్ పదవి ఇవ్వడమే ఈ మొత్తం ఒప్పందం వెనుక ఉన్న అసలు కారణం అన్నారు. కాంగ్రెస్ పార్టీ. ఎంఐఎం పార్టీల మధ్య లోపాధికారిక ఒప్పందం జరిగిన్నది నగ్న సత్యమన్నారు.

కాంగ్రెస్అభ్యర్థి అధికారికంగా ప్రకటించిన తర్వాత, ఆ అభ్యర్థి నిజంగా కాంగ్రెస్, ఎంఐఎండా అన్నది ప్రజలందరికీ స్పష్టమవుతుం దన్నారు. భారతీయ జనతా పార్టీ గత జీహెచ్ఎంసి ఎన్నికల్లో 48 స్థానాలు గెలిచిందని, ఇప్పుడు జూబ్లీహిల్స్ లో బిజెపి గెలిస్తే, మేయర్ పదవి బిజెపి అభ్యర్థికే వస్తుందని తెలుసుకుని, కాంగ్రెస్- ఎంఐఎం(MIM)పార్టీలుభయంతో, రాజకీయ లాభంతో కూడా ఉందన్నారు. కాంగ్రెస్ పార్టీ, ఎంఐఎం ఒత్తిడికి లోనై, ఖబరస్తాన్ నిర్మాణాలపై వేగంగా నిర్ణయాలు తీసుకుంటుందని, జూబ్లీహిల్స్ అర్జెంటుగా ఖబర్దీన్ నిర్మించాలనే ప్రణాళిక కూడా ఈ రాజకీయ ఒప్పందానికి భాగమే అన్నారు. కాంగ్రెస్ పార్టీ రాత్రికి రాత్రే ఖబం *స్తాన్లకు సంబంధించిన జీవోలు తీసుకొ స్తుంది? రాత్రిపూటే కబర్దాన్ నిర్మాణాలకు టెండర్లు, పోలీస్ బందోబస్తులు, సిసిటివిలు ఎందుకు ఏర్పాటు చేస్తోంది? ఇది ఎవరినో తృప్తిపరచడానికి చేస్తున్న రాజకీయ డ్రామా కాదా? ఇది ప్రజలు ఆలోచించాల న్నారు. ఎంఐఎం పార్టీ బీహార్లో 30 సీట్లలో, ఉత్తరప్రదేశ్లో 95 సీట్లలో, తమిళనాడులో, ఉత్తరా ఖండ్లో, మహారాష్ట్రలో. జార్ఖండ్లో పోటీ చేస్తుంది. అయితే తన పుట్టిన నగరమైన భాగ్యనగరంలో మాత్రం అభ్యర్థిని ఎందుకు పెట్టడం లేదు? అభ్యర్థి లేకనా? డీల్ జరిగిందా? ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పాలన్నారు. మీ స్వంత నియోజకవర్గంలో స్మశానానికి స్థలం ఇవ్వలేకపోయిన మీరు, ఎందుకు ఆగమేఘాల మీద ఖబరాన్లకు స్థలం కేటాయిస్తున్నారో ప్రజలకు చెప్పాలని సిఎంను ప్రశ్నిం చారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper : https://epaper.vaartha.com/

Read Also:

AIMIM election news hyderabad politics hyderbad news Jubilee Hills political strategy Telangana Elections

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.