Bandi Sanjay: రెండు రాష్ట్రాల జల వివాదాల పై ఎన్డీయే ప్రభుత్వ తొలివిజయం: కేంద్రమంత్రి

Read Time:  1 min
జలవివాదాలపై రెండు రాష్ట్రాల వివాదాల పై ఎన్డీయే ప్రభుత్వ తొలివిజయం: కేంద్రమంత్రి
జలవివాదాలపై రెండు రాష్ట్రాల వివాదాల పై ఎన్డీయే ప్రభుత్వ తొలివిజయం: కేంద్రమంత్రి
FONT SIZE
GET APP

జమ్మికుంట: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఇరు రాష్ట్రాల(Telangana, Andhra Pradesh) మధ్య నెలకొన్న జలవివాదాలపై కేంద్ర ప్రభుత్వం జలశక్తి శాఖ ఆధ్వర్యంలో ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశం ఏర్పాటు చేయడం భారత ప్రభుత్వ తొలివిజయమని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్కుమార్(Bandi Sanjay) అన్నారు. గురువారం కరీంనగర్ జిల్లా హుజురాబాద్(Hujurabad) నియోజకపిణీ కేంద్రం లో టెన్త్ విద్యార్థులకు సైకిళ్ల కార్యక్ర మానికి విచ్చేసిన కేంద్ర మంత్రి సంజయ్ కుమార్ విలేకరుల సమావేశంలో ఆసక్తికరమైన అంశాలను వెల్లడించారు.

Bandi Sanjay: జలవివాదాలపై రెండు రాష్ట్రాల వివాదాల పై ఎన్డీయే ప్రభుత్వ తొలివిజయం: కేంద్రమంత్రి
Bandi Sanjay: రెండు రాష్ట్రాల జల వివాదాల పై ఎన్డీయే ప్రభుత్వ తొలివిజయం: కేంద్రమంత్రి

కేంద్ర ప్రభుత్వానికి రెండు రాష్ట్రాలు సమానమే

ఈ సందర్భంగా కేంద్ర మంత్రి బండి సంజయ్ మాట్లాడుతూ ఏళ్ల తరబడి ఇరు రాష్ట్రాల మధ్య నెలకొన్న జల వివాదాలను కేంద్ర ప్రభుత్వం సామరస్యంగా పరిష్కరించుకోవాలన్న అభిమతంతో ముందుకు సాగుతుందన్నారు. కేంద్ర ప్రభుత్వానికి రెండు రాష్ట్రాలు సమానమేనని, ఎవరిపై ఎక్కువ, తక్కువ మక్కువలు లేవని బండి సంజయ్కుమార్ స్పష్టం చేసారు. గతంలో బిఆం “ఎస్ ప్రభుత్వం ఏపి ప్రభు త్వంతో రహస్య ఒప్పందాలు కుదుర్చుకుని కృష్ణ నీటి జలాలను తాకట్టు పెట్టిందని బండి సంజయ్ కుమార్ తీవ్రంగా ఆరోపించారు. కాళేశ్వరంలో ఏస్థాయిలో ఆవినీతి జరిగిందో.. అధికారుల ఆక్రమ ఆస్తులే నిదర్శనమని బండి అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో కేసిఆర్ కుటుంబం భారీ తీవ్రంగా దుయ్యబట్టారు.

కేంద్రం ఇరు రాష్ట్రాల సమావేశం ప్రభుత్వ విజయం

ఇరు రాష్ట్రాల మధ్య ఏళ్ల తరబడి నెలకొన్న జల వివాదాలను సమరస్యపూర్వకంగా పరిష్కరించుకోవాలన్న ఉద్దేశంతో కేంద్రం ఇరు రాష్ట్రాల సమావేశం ప్రభుత్వ విజయం అన్నారు. ఇరు నారులు వేరు వేరు ఎజెండాలతో సమావేశానికి హజరయ్యారని, అయినప్పటికి ఆయా ఎజెండాలోని అంశాలపై నిపుణులు ఉన్నతాధికారులతో కేంద్ర ప్రభుత్వం ఎక్స్పర్ట్ కమిటీని నియమించిందన్నారు. కేంద్రం జలవివాద విషయంలో పెద్దన్న పాత్ర పోషిస్తుందని సిఎం రేవంత్రెడ్డి చేసిన వ్యాఖ్యలను కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ పూర్తిగా స్వాగతిస్తున్నానన్నారు .

బండి సంజయ్ ఏ మంత్రివర్గం?

ఆయన జూన్ 9, 2024న హోం మంత్రిత్వ శాఖ సహాయ మంత్రిగా నియమితులయ్యారు.

బండి సంజయ్ ఏ నియోజకవర్గంలో ఉన్నారు?
కరీంనగర్ లోక్‌సభ నియోజకవర్గం. కరీంనగర్ లోక్‌సభ నియోజకవర్గం దక్షిణ భారతదేశంలోని తెలంగాణ రాష్ట్రంలోని 17 లోక్‌సభ (పార్లమెంటు దిగువ సభ) నియోజకవర్గాలలో ఒకటి. భారతీయ జనతా పార్టీకి చెందిన బండి సంజయ్ ప్రస్తుతం ఈ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు.

Read hindi news: hindi.vaartha.com

Read also: Hyderabad Airport : విమానాశ్రయాన్ని భయపెడుతున్న పక్షి తాకిడి

Vanipushpa

రచయిత గురించి

Vanipushpa

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.