हिन्दी | Epaper
ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం ఆధార్, మొబైల్ లింక్ పై కీలక అప్ డేట్ డ్వాక్రా మహిళలకు ప్రభుత్వం కొత్త కార్యక్రమాలు బాలికల కోసం ప్రభుత్వ పథకాలు కర్ణాటకలో బైక్‌ ట్యాక్సీలపై నిషేధం ఎత్తివేత ఆధార్ కార్డు పోయిందా..? ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం ఆధార్, మొబైల్ లింక్ పై కీలక అప్ డేట్ డ్వాక్రా మహిళలకు ప్రభుత్వం కొత్త కార్యక్రమాలు బాలికల కోసం ప్రభుత్వ పథకాలు కర్ణాటకలో బైక్‌ ట్యాక్సీలపై నిషేధం ఎత్తివేత ఆధార్ కార్డు పోయిందా..? ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం ఆధార్, మొబైల్ లింక్ పై కీలక అప్ డేట్ డ్వాక్రా మహిళలకు ప్రభుత్వం కొత్త కార్యక్రమాలు బాలికల కోసం ప్రభుత్వ పథకాలు కర్ణాటకలో బైక్‌ ట్యాక్సీలపై నిషేధం ఎత్తివేత ఆధార్ కార్డు పోయిందా..? ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం ఆధార్, మొబైల్ లింక్ పై కీలక అప్ డేట్ డ్వాక్రా మహిళలకు ప్రభుత్వం కొత్త కార్యక్రమాలు బాలికల కోసం ప్రభుత్వ పథకాలు కర్ణాటకలో బైక్‌ ట్యాక్సీలపై నిషేధం ఎత్తివేత ఆధార్ కార్డు పోయిందా..?

బ్యాంకులు పరిహారం ఇవ్వాల్సిందే: సుప్రీంకోర్టు

Vanipushpa
బ్యాంకులు పరిహారం ఇవ్వాల్సిందే: సుప్రీంకోర్టు

ఇటీవల కాలంలో క్షణంలో డబ్బు సైబర్‌ నేరాల చేతిలోకి పోతున్నాయి. మన అమాయకత్వాని ఆసరా చేసుకుని సైబర్‌ నేరాల అరాచకాలు మితిమీరిపోతున్నాయి. డబ్బు పోగొట్టుకున్నా బాధితులకు సుప్రీంకోర్టు ఊరట కలిగించింది. కస్టమర్‌ కేర్‌ మోసాలు.. మాల్‌వేర్‌తో ఖాతాలను ఖాళీ చేసే సైబర్‌ నేరాల విషయంలో బాధితులకు ఊరట కలిగించేలా సుప్రీంకోర్టు కీలక తీర్పునిచ్చింది. అనుమతి లేని/మోసపూరిత ఆన్‌లైన్‌ లావాదేవీల కారణంగా తమ ప్రమేయం లేకుండానే ఖాతాలోని డబ్బు పోగొట్టుకున్న బాధితులు మూడ్రోజుల్లో ఫిర్యాదు చేస్తే.. బ్యాంకులు పరిహారం ఇవ్వాల్సిందేనని తేల్చిచెప్పింది.

అయితే.. భారతీయ రిజర్వ్‌ బ్యాంకు(ఆర్‌బీఐ) 2017 జూలై 6న ఇచ్చిన సర్క్యులర్‌లో పేర్కొన్నట్లుగా బాధితులు మూడ్రోజుల్లో ఫిర్యాదు చేస్తే.. థర్డ్‌పార్టీ యాప్‌, వ్యక్తుల ద్వారా జరిగే మోసాల విషయంలోనూ బాధితులకు ఊరట కలిగించాల్సిన బాధ్యత బ్యాంకులదేనని స్పష్టం చేసింది.

గువాహటికి చెందిన పల్లభ్‌ భౌమిక్‌ అనే బాధితుడి విషయంలో జస్టిస్‌ జేబీ పార్దివాలా, జస్టిస్‌ ఆర్‌.మహాదేవన్‌ల ధర్మాసనం ఈ మేరకు తీర్పునిచ్చింది. కేసు పూర్వాపరాల్లోకి వెళ్తే.. బాధితుడు 2021లో ప్రపంచ దిగ్గజ గార్మెంట్స్‌ సంస్థ లూయీఫిలిప్‌ నుంచి రూ.4 వేలు వెచ్చించి, ఓ బ్లేజర్‌ కొనుగోలు చేశారు. ఆ తర్వాత.. దాన్ని వాపస్‌ చేస్తానంటూ లూయీఫిలిప్‌ వెబ్‌సైట్‌లో కస్టమర్‌ కేర్‌కు సమాచారం ఇచ్చారు. తనకు రూ.4 వేలను వెనక్కి ఇవ్వాలని కోరారు.

అయితే.. 2021లో లూయీఫిలిప్‌ వెబ్‌సైట్‌ హ్యాకింగ్‌కు గురై.. ఆ సైట్‌ నియంత్ర హ్యాకర్ల చేతికి వెళ్లిపోయింది. వెబ్‌సైట్‌లో కస్టమర్‌కేర్‌ను సంప్రదించినట్లు బాధితుడు భావించినా.. దీన్ని సైబర్‌ నేరగాళ్లు అవకాశంగా మలచుకుని, లూయీఫిలిప్‌ మేనేజర్‌ పేరుతో ఫోన్‌ చేశారు. ‘‘తప్పకుండా మీ సొమ్మును తిరిగి ఇస్తాం.


అయితే.. మీరు మేము పంపే లింకు ద్వారా యాప్‌ను ఇన్‌స్టాల్‌ చేసుకోవాలి’’ అని సూచించారు. బాధితుడు ఆ యాప్‌ను ఇన్‌స్టాల్‌ చేయగానే.. అతని ఎస్‌బీఐ ఖాతాలో ఉన్న రూ.94,204.80 గూగుల్‌పే ద్వారా సైబర్‌ నేరగాళ్ల ఖాతాకు బదిలీ అయ్యింది. తన ఖాతా ఖాళీ అవ్వడంతో బాధితుడు ఎస్‌బీఐ కస్టమర్‌ కేర్‌కు ఫోన్‌ చేసి, జరిగిన మోసంపై ఫిర్యాదు చేశారు. అయితే గూగుల్‌పే ద్వారా లావాదేవీలు జరిగినందున తాము బాధ్యులం కాదని కస్టమర్‌కేర్‌ సిబ్బంది సమాధానమిచ్చారు.

దాంతో బాధితుడు గువాహటి పోలీసులు, అసోం సీఐడీ సైబర్‌ క్రైమ్‌ సెల్‌, జాతీయ సైబర్‌ నేరాల నమోదు పోర్టల్‌లో ఫిర్యాదు చేశారు. ఆర్‌బీఐ అంబుడ్స్‌మన్‌ను సంప్రదించినా.. న్యాయం జరగకపోవడంతో గువాహటి హైకోర్టును ఆశ్రయించారు. ఈలోగా నిందితుడు ఉత్తరప్రదేశ్‌కు చెందినవాడని సైబర్‌ క్రైమ్‌ పోలీసులు గుర్తించారు. నేరం జరిగిన 24 గంటల్లోనే బాధితుడు ఫిర్యాదు చేశారని, ఎస్‌బీఐదే లోపమని హైకోర్టు సింగిల్‌ బెంచ్‌ స్పష్టం చేసింది. అతను కోల్పోయిన రూ.94,204.80ని తిరిగి ఇచ్చేయాలని తీర్పునిచ్చింది. అయితే.. బాధితుడి పక్షానే న్యాయం ఉండడంతో.. ఎస్‌బీఐ సుప్రీంకోర్టులో అప్పీల్‌ చేసింది.

తాజాగా ఈ కేసును విచారించిన జస్టిస్‌ జేబీ పార్దివాలా నేతృత్వంలోని ధర్మాసనం ఎస్‌బీఐనే తప్పుబట్టింది. బాధితుడి ప్రమేయం లేకుండానే ఆయన ఖాతాలోని సొమ్ము బదిలీ అయ్యింది. కాబట్టి.. ఎస్‌బీఐ అతనికి పరిహారంగా మొత్తం సొమ్మును తిరిగి ఇవ్వాల్సిందే’’ అని తీర్పునిచ్చింది.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

AI ని నమ్ముకొని ప్రాణాలమీదకు తెచ్చుకున్న డాక్టర్

AI ని నమ్ముకొని ప్రాణాలమీదకు తెచ్చుకున్న డాక్టర్

వెండికి డిమాండ్ పెరుగుతుందా? తగ్గుతుందా?

వెండికి డిమాండ్ పెరుగుతుందా? తగ్గుతుందా?

అయోధ్య రామాలయం పనులు ముగింపు దశలో, ఏప్రిల్ 30కి ఏమిటి?

అయోధ్య రామాలయం పనులు ముగింపు దశలో, ఏప్రిల్ 30కి ఏమిటి?

బెంగాల్‌లో బీజేపీ వస్తే 45 రోజుల్లో కంచె, అమిత్ షా షాక్!

బెంగాల్‌లో బీజేపీ వస్తే 45 రోజుల్లో కంచె, అమిత్ షా షాక్!

బడ్జెట్ కు ముందు అల్వా వేడుక ఎందుకు చేస్తారు ?

బడ్జెట్ కు ముందు అల్వా వేడుక ఎందుకు చేస్తారు ?

రేపే బడ్జెట్.. వీటి ధరల్లో మార్పు ఉండబోతుందా ?

రేపే బడ్జెట్.. వీటి ధరల్లో మార్పు ఉండబోతుందా ?

డిప్యూటీ సీఎంగా సునేత్ర పవార్ ప్రమాణ స్వీకారం..

డిప్యూటీ సీఎంగా సునేత్ర పవార్ ప్రమాణ స్వీకారం..

భారతీయ విద్యార్థికి జైలు శిక్ష..ఎందుకంటే?

భారతీయ విద్యార్థికి జైలు శిక్ష..ఎందుకంటే?

‘బ్లాక్ బడ్జెట్’, ‘డ్రీమ్ బడ్జెట్’ల గురించి తెలుసా?

‘బ్లాక్ బడ్జెట్’, ‘డ్రీమ్ బడ్జెట్’ల గురించి తెలుసా?

ఎన్సీపీ విలీనంపై శరద్‌ పవార్ కీలక వ్యాఖ్యలు

ఎన్సీపీ విలీనంపై శరద్‌ పవార్ కీలక వ్యాఖ్యలు

‘జన నాయగన్’ చిత్రం విడుదల ఆలస్యం పై స్పందించిన విజయ్

‘జన నాయగన్’ చిత్రం విడుదల ఆలస్యం పై స్పందించిన విజయ్

5 రాష్ట్రాల పైనే మోదీ సర్కారు ఫోకస్

5 రాష్ట్రాల పైనే మోదీ సర్కారు ఫోకస్

📢 For Advertisement Booking: 98481 12870