हिन्दी | Epaper
EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత

జామా మసీదు పై ఒవైసీ ఆగ్రహం

Sukanya
జామా మసీదు పై ఒవైసీ ఆగ్రహం

సంభాల్‌లో జామా మసీదు వద్ద నిర్మాణంలో ఉన్న కొత్త పోలీస్ అవుట్‌పోస్ట్‌పై ఆల్ ఇండియా మజ్లిస్-ఇ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్ (AIMIM) అధినేత అసదుద్దీన్ ఒవైసీ తీవ్ర విమర్శలు చేశారు.

ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం మద్యం బార్లు మరియు పోలీస్ అవుట్‌పోస్ట్‌లకు మాత్రమే నిధులు కేటాయిస్తుందని, విద్యాసంస్థలు లేదా ఆసుపత్రుల నిర్మాణానికి ఆలోచన చేయడంలేదని ఆయన ఆరోపించారు. “దేశంలో ఎక్కడికైనా వెళ్లండి, పాఠశాలలు లేదా ఆసుపత్రులు కంటే ప్రభుత్వానికి పోలీస్ పోస్టులు, మద్యం బార్లకు ఎక్కువ ప్రాధాన్యం ఉంటుంది,” అని ఒవైసీ సోషల్ మీడియా ప్లాట్‌ఫాం ఎక్స్‌లో పోస్టు చేశారు.

అదే విధంగా, ముస్లింలు నివసించే ప్రాంతాల్లో ప్రాథమిక సౌకర్యాలు కల్పించడంలో ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు.

జామా మసీదు పై ఒవైసీ ఆగ్రహం

సంభాల్ జామా మసీదు సమీపంలో జరిగిన హింస తర్వాత, భద్రతను పటిష్టం చేయడానికి ప్రభుత్వం కొత్త పోలీస్ అవుట్‌పోస్ట్ నిర్మాణం ప్రారంభించింది. ఈ నిర్మాణం భద్రతను మెరుగుపరచడమే కాకుండా నేరాల నియంత్రణకు సులభతరం చేస్తుందని అధికారులు తెలిపారు.

జిల్లా మేజిస్ట్రేట్ డాక్టర్ రాజేందర్ పెన్సియా మాట్లాడుతూ, “సమీప ప్రాంతాల్లో ఆక్రమణలను తొలగించి, సీసీ కెమెరాలు మరియు స్మార్ట్ మీటర్లను ఏర్పాటు చేయడం జరుగుతోంది” అని తెలిపారు. అలాగే, నీటి వనరుల పరిరక్షణ కోసం పాత బావులు తిరిగి తెరవబడుతున్నాయి.

ఆర్కియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (ASI) పరిశోధనలు

జామా మసీదు సమీపంలో ASI బృందం కొన్ని పురాతన హిందూ స్థలాలను గుర్తించింది. “19 బావులు మరియు 68 పవిత్ర స్థలాలు మొత్తం 87 ప్రదేశాలు తిరిగి తెరవడానికి కృషి జరుగుతోంది” అని జిల్లా యంత్రాంగం వెల్లడించింది.

46 సంవత్సరాల తరువాత శివుడి మరియి హనుమంతుడి దేవాలయం కూడా తిరిగి తెరవబడినట్లు సమాచారం.

ఈ కొత్త పోలీస్ అవుట్‌పోస్ట్ నిర్మాణం భద్రతా చర్యల కోసం అనే అభిప్రాయం వ్యక్తమవుతుండగా, ఒవైసీ చేసిన ఆరోపణలు రాజకీయ దృష్ట్యా వివాదాస్పదంగా మారాయి.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870