📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ఘోర రోడ్డు ప్రమాదం.. పొగమంచే కారణం పెరగనున్న కార్ల ధరలు పోస్టాఫీస్‌లో మ్యూచువల్‌ ఫండ్‌ సేవలు సొంతూళ్లకు వెళ్లేవారికి ఊరట.. సంక్రాంతి ప్రత్యేక రైళ్లు కేంద్ర మాజీ హోంమంత్రి శివరాజ్ పాటిల్ కన్నుమూత వందే మాతరం 150 ఏళ్లు అమిత్ షా సందేశం క్రిస్మస్, న్యూ ఇయర్‌కు ప్రత్యేక రైళ్లు తెలంగాణలో కొత్త జూ పార్క్‌.. ఎక్కడంటే? నేడు పార్లమెంటులో ‘వందేమాతరం’పై చర్చ ఆధార్ కార్డు జెరాక్స్ కాఫీలపై త్వరలో కేంద్రం కీలక నిర్ణయం గోవాలో భయానక అగ్ని ప్రమాదం రెపో రేటును 0.25 శాతం తగ్గించిన ఆర్‌బీఐ EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ ఘోర రోడ్డు ప్రమాదం.. పొగమంచే కారణం పెరగనున్న కార్ల ధరలు పోస్టాఫీస్‌లో మ్యూచువల్‌ ఫండ్‌ సేవలు సొంతూళ్లకు వెళ్లేవారికి ఊరట.. సంక్రాంతి ప్రత్యేక రైళ్లు కేంద్ర మాజీ హోంమంత్రి శివరాజ్ పాటిల్ కన్నుమూత వందే మాతరం 150 ఏళ్లు అమిత్ షా సందేశం క్రిస్మస్, న్యూ ఇయర్‌కు ప్రత్యేక రైళ్లు తెలంగాణలో కొత్త జూ పార్క్‌.. ఎక్కడంటే? నేడు పార్లమెంటులో ‘వందేమాతరం’పై చర్చ ఆధార్ కార్డు జెరాక్స్ కాఫీలపై త్వరలో కేంద్రం కీలక నిర్ణయం గోవాలో భయానక అగ్ని ప్రమాదం రెపో రేటును 0.25 శాతం తగ్గించిన ఆర్‌బీఐ EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్

Yogi Adityanath: కమేడియన్‌‌పై యోగి ఆదిత్యనాథ్ ఆగ్రహం

Author Icon By Vanipushpa
Updated: March 26, 2025 • 12:41 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

భావప్రకటన స్వేచ్ఛ పేరుతో వ్యక్తిగత దూషణలు చేయడం సరికాదని ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ వ్యాఖ్యానించారు. మహారాష్ట్ర డిప్యూటీ సీఎం ఏక్‌నాథ్ షిండే‌పై స్టాండప్ కమేడియన్ కునాల్ కమ్రా వేసిన జోకులను ఉటంకిస్తూ యోగి ఈ వ్యాఖ్యలు చేశారు. ఏఎన్ఐ న్యూస్ ఏజెన్సీకి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో యోగి ఆదిత్యనాథ్ మాట్లాడుతూ.. ‘దురదృష్టవశాత్తూ భావప్రకటన స్వేచ్ఛ పేరుతో కొందరు దేశాన్ని ముక్కలు చేయడం, విభజనను విస్తృతం చేయడం తమ జన్మహక్కుగా భావిస్తున్నారు’ అని యోగి మండిపడ్డారు.

తీవ్ర దుమారంకు కారణాలు
ముంబయిలో ఆదివారం జరిగిన ఓ షోలో కునాల్ కమ్రా.. ఏక్‌నాథ్ షిండేను ద్రోహి అంటూ జోకులు పేల్చడంపై తీవ్ర దుమారం రేగుతోంది. ఈ వ్యవహారం రాజకీయ రంగు పులుముకుంది. తాను క్షమాపణ చెప్పేది లేదని, ఒకవేళ కోర్టు తాను తప్పుచేశానని ఆదేశిస్తే చెబుతానని కునాల్ కమ్రా స్పష్టం చేశారు. తనకు 500కిపైగా బెదిరింపు కాల్స్ వచ్చినట్టు తెలిపారు.
కాంగ్రెస్‌పై యోగి ఆదిత్యనాథ్ పలు విమర్శలు
ఇక, ఏఎన్ఐ ఇంటర్వ్యూలో కాంగ్రెస్‌పై యోగి ఆదిత్యనాథ్ పలు విమర్శలు గుప్పించారు. అమెరికా కుబేరుడు జార్జ్ సోరెస్ నుంచి తీసుకున్న డబ్బుతో 2024 లోక్‌సభ ఎన్నికలను ప్రభావితం చేయడానికి ప్రయత్నించిందని ఆరోపించారు. అలాగే, కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వం ముస్లింలకు 4 శాతం కోటా బిల్లును తీసుకొచ్చి బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని అవమానించిందని ధ్వజమెత్తారు. ‘లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్, ఇండియా కూటమిలో పార్టీలు పరోక్షంగా లేదా ప్రత్యక్షంగా విదేశీ నగదును ఉపయోగించి ప్రభావితం చేసే ప్రయత్నం చేశాయి’ అని యోగి ఆరోపణలు చేశారు.
కాగా, కమేడియన్ కమ్రా.. ముంబయిలో ఆదివారం నిర్వహించిన షోలో డిప్యూటీ సీఎం ఏక్‌నాథ్ షిండే ఉద్దేశిస్తూ జోకులు పేల్చారు. ‘‘శివసేన నుంచి శివసేన బయటికి వచ్చింది.. ఎన్సీపీ నుంచి ఎన్సీపీ విడిపోయింది.. అంతా గందరగోళంగా ఉంది’’ మరాఠా రాజకీయాల గురించి మాట్లాడారు. అలాగే, షిండే ద్రోహిగా అభివర్ణించించిన కునాల్.. ‘దిల్‌ తో పాగల్‌ హై’ అనే బాలీవుడ్ సినిమా పాటలోని చరణాలను రాజకీయాలను అనుగుణంగా మార్చి వ్యంగ్యంగా పాడారు.

#telugu News anger against comedian Ap News in Telugu Breaking News in Telugu Google News in Telugu Latest News in Telugu Paper Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today Yogi Adityanath's

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.