📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా దేశవాళీ క్రికెట్‌కు కోహ్లీ బీసీసీఐ నేడు కీలక సమావేశం? సచిన్ రికార్డు బీట్ చేసిన విరాట్.. రోహిత్ శర్మ రికార్డు బ్రేక్ చేసిన ఆయుశ్ మాత్రే హైదరాబాద్ కు మెస్సీ.. మహిళల ప్రీమియర్ లీగ్ మెగా వేలం రోహిత్ శర్మ అరుదైన ఘనత రెండోసారి ప్రపంచ ఛాంపియన్‌గా భారత్ నిఖత్ జరీన్ కు స్వర్ణం రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా దేశవాళీ క్రికెట్‌కు కోహ్లీ బీసీసీఐ నేడు కీలక సమావేశం? సచిన్ రికార్డు బీట్ చేసిన విరాట్.. రోహిత్ శర్మ రికార్డు బ్రేక్ చేసిన ఆయుశ్ మాత్రే హైదరాబాద్ కు మెస్సీ.. మహిళల ప్రీమియర్ లీగ్ మెగా వేలం రోహిత్ శర్మ అరుదైన ఘనత రెండోసారి ప్రపంచ ఛాంపియన్‌గా భారత్ నిఖత్ జరీన్ కు స్వర్ణం

IPL 2025: ఐపీఎల్ లో చరిత్ర సృష్టించిన యశస్వి జైస్వాల్

Author Icon By Anusha
Updated: May 21, 2025 • 3:22 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఇండియన్ ప్రీమియర్ లీగ్(IPL) 2025లో భాగంగా,రాజ‌స్థాన్ రాయ‌ల్స్ (Rajasthan Royals) చివ‌రి లీగ్ మ్యాచ్‌లో 6 వికెట్ల తేడాతో జ‌య‌భేరి మోగించింది,ఈ మ్యాచ్ గెలవడం ద్వారా రాజస్థాన్ రాయల్స్ తమ ఐపీఎల్ 2025 ప్రయాణాన్ని విజయంతోముగించింది. ఈ మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ ఓపెనింగ్ బ్యాటర్ యశస్వి జైస్వాల్ తన పేరిట ఒక ప్రత్యేకమైన రికార్డును సృష్టించాడు. 18 ఏళ్ల ఐపీఎల్ చరిత్రలో విరాట్ కోహ్లీ, వీరేంద్ర సెహ్వాగ్ వంటి గొప్ప బ్యాటర్లు కూడా చేయలేని ఘనతను యశస్వి జైస్వాల్(Yashasvi Jaiswal) సాధించాడు.ఐపీఎల్ 2025 యశస్వి జైస్వాల్‌కు చాలా అద్భుతంగా గడిచింది. యశస్వి జైస్వాల్ అద్భుతంగా బ్యాటింగ్ చేసి 14 మ్యాచ్‌ల్లో 559 పరుగులు చేశాడు. ఇందులో 6 అర్థ సెంచరీలు ఉన్నాయి. ఇది కాకుండా జైస్వాల్ 5 సార్లు బౌండరీతో ఇన్నింగ్స్ ప్రారంభించాడు. ఇప్పుడు యశస్వి జైస్వాల్ ఐపీఎల్ చరిత్రలో 2 వేర్వేరు సీజన్లలో 5 ఇన్నింగ్స్‌లలో బౌండరీతో శుభారంభం చేసి తొలి బ్యాటర్‌గా నిలిచాడు. అంతకుముందు జైస్వాల్ ఐపీఎల్ 2023లో ఈ ఘనత సాధించాడు.

IPL 2025: ఐపీఎల్ లో చరిత్ర సృష్టించిన యశస్వి జైస్వాల్

ఇన్నింగ్స్‌

యశస్వి జైస్వాల్ కంటే ముందు విరాట్ కోహ్లీ, వీరేంద్ర సెహ్వాగ్, సునీల్ నరైన్, ఫిల్ సాల్ట్ నాలుగు ఇన్నింగ్స్‌లను బౌండరీతో ప్రారంభించారు. ఐపీఎల్ 2025 తొలి మ్యాచ్‌లో ఆర్సీబీపై యశస్వి జైస్వాల్ సిక్స్‌తో ఇన్నింగ్స్‌ను ప్రారంభించాడు. దీని తర్వాత పంజాబ్ కింగ్స్, కోల్‌కతా నైట్ రైడర్స్ జట్లపై ఫోర్ కొట్టడం ద్వారా ఇన్నింగ్స్‌ను ప్రారంభించాడు. సీఎస్కేతో(CSK) జరిగిన సీజన్ చివరి మ్యాచ్‌లో యశస్వి బౌండరీ కొట్టడం ద్వారా ఇన్నింగ్స్‌ను ప్రారంభించాడు.ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన సీఎస్కే 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 187 పరుగులు చేసింది. సీఎస్కే తరఫున బ్యాటింగ్ చేసిన ఆయుష్ మాత్రే అత్యధికంగా 43 పరుగులు చేశాడు. ఇది కాకుండా డెవాల్డ్ బ్రెవిస్ 42 పరుగులు, శివం దూబే 39 పరుగులు చేశారు. రాజస్థాన్ రాయల్స్ తరఫున బౌలర్లలో ఆకాష్ మధ్వల్, యుధ్వీర్ సింగ్ 3 వికెట్లు పడగొట్టారు.దీని తర్వాత రాజస్థాన్ రాయల్స్ 17.1 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేరుకుంది. రాజస్థాన్ తరఫున బ్యాటింగ్ చేస్తున్నప్పుడు వైభవ్ సూర్యవంశీ 57 పరుగులు చేసి అత్యధిక ఇన్నింగ్స్ ఆడాడు. రాజస్థాన్ కెప్టెన్ సంజు శాంసన్ 41, యశస్వి జైస్వాల్ 36, ధ్రువ్ జురేల్ అజేయంగా 31 పరుగులు చేశారు. సీఎస్కే బౌలర్లలో రవిచంద్రన్ అశ్విన్ 2 వికెట్లు, నూర్ అహ్మద్, అన్షుల్ కాంబోజ్ తలో వికెట్ పడగొట్టారు.

Read Also: IPL 2025: సీఎస్‌కేపై రాజస్థాన్ ఘన విజయం

#IPL2025 #IPLRecords #RajasthanRoyals #RRvsCSK #YashasviJaiswal Ap News in Telugu Breaking News in Telugu Google news Google News in Telugu Latest News in Telugu Paper Telugu News Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today Today news

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.