Latest News: Vande Bharat : డిసెంబర్ 10 నుంచి వందే భారత్.. విజయవాడ నుంచి తిరుపతి మీదుగా బెంగళూరుకు

Read Time:  1 min
Latest News: Vande Bharat : డిసెంబర్ 10 నుంచి వందే భారత్.. విజయవాడ నుంచి తిరుపతి మీదుగా బెంగళూరుకు
FONT SIZE
GET APP

విజయవాడ–బెంగళూరు వందే భారత్ (Vande Bharat) ఎక్స్‌ప్రెస్ సేవలు ఈ నెల డిసెంబర్ 10న ప్రారంభం అయ్యే, అవకాశం ఉంది. ప్రారంభ తేదీపై తుది ధృవీకరణ త్వరలో రానున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. ఈ రైలు ప్రధానంగా విజయవాడ – తిరుపతి – బెంగళూరు మార్గంలో నడుస్తూ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక మధ్య త్వరితగతి రవాణాకు మార్గం సుగమం చేయనుంది.

Read Also: RRB NTPC 2025: 8,868 పోస్టుల భర్తీకి ఇవాళే లాస్ట్ డేట్

Vande Bharat from December 10th.. from Vijayawada to Bangalore via Tirupati
Vande Bharat from December 10th.. from Vijayawada to Bangalore via Tirupati

మార్గం సుగమం

ఈ రైలు సేవలను ప్రారంభించడానికి రైల్వే అధికారులు ప్రస్తుతం టైమ్ టేబుల్, సాంకేతిక తనిఖీలను పూర్తిచేస్తున్నారు. ప్రాథమిక ప్రణాళిక ప్రకారం, రైలు ఉదయం 5:15 గంటలకు విజయవాడ నుండి బయలుదేరి మధ్యాహ్నం 1:15 గంటలకు బెంగళూరుకు చేరుకుంటుంది. అంటే ఇప్పటివరకు 9-10 గంటలు పడుతున్న ప్రయాణ సమయం సగానికి పైగా తగ్గనుంది.

(Vande Bharat) ప్రత్యేకించి తిరుపతి మీదుగా నడుస్తుండటం ఈ సేవకు మరింత ప్రాధాన్యత తెచ్చిపెడుతోంది. తిరుమల (Tirumala) లోని శ్రీ వెంకటేశ్వరస్వామి ఆలయాన్ని సందర్శించడానికి ప్రతి రోజు లక్షలాది మంది యాత్రికులు ప్రయాణిస్తారు. ఈ కొత్త రైలు సేవ వారికీ సౌకర్యవంతమైన, వేగవంతమైన ప్రయాణ ప్రత్యామ్నాయాన్ని అందిస్తుంది.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com/

Read Also:

Anusha

రచయిత గురించి

Anusha

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.