Telugu News: Uttar Pradesh: మదర్సా టాయిలెట్‌లో బందీగా  40 మంది బాలికలు

Read Time:  1 min
Uttar Pradesh: మదర్సా టాయిలెట్‌లో బందీగా  40 మంది బాలికలు
Uttar Pradesh: మదర్సా టాయిలెట్‌లో బందీగా  40 మంది బాలికలు
FONT SIZE
GET APP

ఉత్తరప్రదేశ్‌లో దారుణమైన ఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. అక్రమంగా నడుపుతున్న ఓ మదర్సాలో తనిఖీలకు వెళ్లిన అధికారులకు దిగ్భ్రాంతికర దృశ్యం(Shocking scene) ఎదురైంది. అధికారులు వస్తున్నారని గమనించిన నిర్వాహకులు, 9 నుంచి 14 సంవత్సరాల వయసున్న సుమారు 40 మంది బాలికలను టెర్రస్‌పై ఉన్న ఓ మరుగుదొడ్డిలో బంధించి ఉంచిన అమానుషం బయటపడింది.

Crime: దొంగతనం కేసులో మహిళను చితకొట్టిన యజమాని..అయితే సీన్ రివర్స్

Uttar Pradesh

అక్రమ మదర్సా, అధికారుల ఆకస్మిక తనిఖీ

బహ్రైచ్ జిల్లా పరిధిలోని పహల్వారా గ్రామంలోని ఒక మూడంతస్తుల భవనంలో గత మూడేళ్లుగా ఓ మదర్సాను ఎలాంటి రిజిస్ట్రేషన్ లేకుండా అక్రమంగా నిర్వహిస్తున్నారని అధికారులకు ఫిర్యాదులు అందాయి. ఈ నేపథ్యంలో, పయాగ్‌పూర్ సబ్ డివిజనల్ మేజిస్ట్రేట్ (ఎస్డీఎం) అశ్విని కుమార్ పాండే నేతృత్వంలోని బృందం ఆకస్మిక తనిఖీ చేపట్టింది.

తాళాలు పగలగొట్టి బంధించిన బాలికల విడుదల

తనిఖీ కోసం భవనంలోకి(building) ప్రవేశించిన అధికారులను నిర్వాహకులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. ముఖ్యంగా పై అంతస్తుకు వెళ్లకుండా నిలువరించడంతో అధికారులకు అనుమానం వచ్చింది. దీంతో పోలీసుల సహాయంతో పైకి వెళ్లగా, అక్కడ టెర్రస్‌పై ఉన్న ఓ టాయిలెట్‌కు బయట నుంచి తాళం వేసి ఉండటాన్ని గమనించారు. మహిళా పోలీసుల సమక్షంలో ఆ తాళాన్ని పగలగొట్టి చూడగా లోపల సుమారు 40 మంది బాలికలు భయంతో వణికిపోతూ కనిపించారు. వారిని బయటకు తీసుకురాగా, తీవ్రమైన భయాందోళనతో ఎవరూ మాట్లాడలేకపోయారని అధికారులు తెలిపారు.

ఘటనపై దర్యాప్తు ఆదేశాలు

ఈ ఘటనపై ఎస్డీఎం అశ్విని కుమార్ పాండే స్పందిస్తూ, మదర్సా రిజిస్ట్రేషన్(Madrasa Registration) మరియు దాని చట్టబద్ధతపై నివేదిక ఇవ్వాలని జిల్లా మైనారిటీ సంక్షేమ అధికారి మొహమ్మద్ ఖలీద్‌ను ఆదేశించినట్లు చెప్పారు. ఈ విషయంపై తమకు ఇప్పటివరకు ఎటువంటి ఫిర్యాదు అందలేదని, ఒకవేళ ఎవరైనా ఫిర్యాదు చేస్తే చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని ఒక పోలీస్ అధికారి వివరించారు. ఈ ఘటనపై అధికారులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.

ఈ దారుణం ఎక్కడ జరిగింది?

ఉత్తరప్రదేశ్‌లోని బహ్రైచ్ జిల్లా పరిధిలోని పహల్వారా గ్రామంలోని ఒక మదర్సాలో జరిగింది.

అధికారులు టాయిలెట్‌లో ఎంతమంది బాలికలను గుర్తించారు?

9 నుంచి 14 సంవత్సరాల వయసున్న సుమారు 40 మంది బాలికలను గుర్తించారు.

Read hindi news: hindi.vaartha.com

Read Also:

Sushmitha

రచయిత గురించి

Sushmitha

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.