📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత

విలువైన ఓటును ఉపయోగించుకోండి: మోడీ, అమిత్ షా

Author Icon By Vanipushpa
Updated: February 5, 2025 • 2:24 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఉదయం 11 గంటల వరకు 19.95 శాతం పోలింగ్ నమోదైనట్లు తెలిసింది. ఢిల్లీ ఎన్నికల్లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, రాహుల్ గాంధీ, ఢిల్లీ ముఖ్యమంత్రి అతిషి, కేంద్ర మంత్రి జైశంకర్ సహా పలువురు ప్రముఖులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రక్రియ ప్రారంభం కాగా.. ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రజలకు ప్రత్యేక విజ్ఞప్తి చేశారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లోని అన్ని స్థానాలకు ఈరోజు పోలింగ్ జరుగుతోందని ప్రధాని మోడీ ఎక్స్(ట్విట్టర్) వేదికగా పేర్కొన్నారు. ఇక్కడి ఓటర్లందరూ ఈ ప్రజాస్వామ్య ఉత్సవంలో పూర్తి ఉత్సాహంతో పాల్గొని తమ విలువైన ఓటును వేయాలని ప్రధాని కోరారు. మొదటిసారి ఓటు వేయబోతున్న యువ ఓటర్లకు ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపారు. ప్రతి ఒక్కరూ మొదట ఓటు వేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఓటింగ్ లో కొత్త రికార్డును నెలకొల్పాలని ప్రధాని నరేంద్ర మోడీ ఆకాంక్షించారు.

ఆ సమయంలోనే హోంమంత్రి అమిత్ షా కూడా ఎక్స్(ట్విట్టర్) వేదికగా పోలింగ్ గురించి ప్రజలకు సూచించారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటు వేయబోయే సోదర సోదరీమణులు తప్పుడు వాగ్దానాలు, కలుషిత యమునా నది, మద్యం దుకాణాలు, చెడిపోయిన రోడ్లు, మురికి నీటికి వ్యతిరేకంగా ఓటు వేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ప్రజా సంక్షేమం పట్ల బలమైన ట్రాక్ రికార్డ్, ఢిల్లీ అభివృద్ధి పట్ల స్పష్టమైన దార్శనికత కలిగిన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ప్రతి ఒక్కరూ ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు మీ ఒక్క ఓటు ఢిల్లీని ప్రపంచంలోనే అత్యంత అభివృద్ధి చెందిన రాజధానిగా మార్చగలదన్నారు.

#telugu News Ap News in Telugu Breaking News in Telugu Delhi Elections Google News in Telugu Latest News in Telugu Narendra Midi Paper Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today vote

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.