📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత

కర్ణాటక రాజకీయాల్లో అనూహ్య పరిణామాలు

Author Icon By Vanipushpa
Updated: March 3, 2025 • 3:47 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

కర్ణాటక రాజకీయాల్లో అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నాయి. మొన్నటివరకు నివురుగప్పిన నిప్పులా వర్గ రాజకీయాలు ఒక్కసారిగా గుప్పుమన్నాయి. ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు వ్యతిరేకంగా సీనియర్ నాయకులు తమ గళాన్ని వినిపిస్తోన్నారు. బాహటంగానే ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ చీఫ్, ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌కు మద్దతు పలుకుతున్నారు.
ఒకే వేదికపై డీకే శివకుమార్, అమిత్ షా
కోయంబత్తూరు ఈషా ఫౌండేషన్‌లో జరిగిన మహా శివరాత్రి ఉత్సవాల్లో డీకే శివకుమార్ పాల్గొన్న విషయం తెలిసిందే. కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాతో ఆయన వేదికను పంచుకోవడం అందరి దృష్టినీ ఆకర్షించింది. కర్ణాటక రాజకీయాల్లో ఓ చిన్న సైజు సునామీని లేవదీసింది. ఇది అక్కడితో ఆగలేదు. దీనికి కొనసాగింపు సైతం చోటు చేసుకుంది. డీకే శివకుమార్ ముఖ్యమంత్రి కావడాన్ని ఎవరూ అడ్దుకోలేరంటూ ఉడుపిలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ ముఖ్యమంత్రి వీరప్ప చేసిన వ్యాఖ్యలు అగ్నికి ఆజ్యం పోసినట్టయింది. కాంగ్రెస్‌లో కల్లోలాన్ని రేపింది. డీకే శివకుమార్‌లో మంచి నాయకత్వం లక్షణాలు ఉన్నాయని, రాష్ట్రంలో పార్టీని పునర్నిర్మించారని అన్నారు. జనం ఏవేవో చెప్పుకొంటోన్నారు గానీ ఆయనను సీఎం కాకుండా ఎవరూ ఆపలేరని తేల్చి చెప్పారు. దాని గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదంటూ భరోసా ఇచ్చారు.


ముఖ్యమంత్రి కావడం డీకేశికి బహుమతిగా ఇవ్వాల్సింది కాదని కష్టపడి సంపాదించినదని పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలు కలకలం రేపాయి. దీనిపై డీకే శివకుమార్ సైతం తాజాగా స్పందించారు. వీరప్ప మొయిలీ చేసిన వ్యాఖ్యలపై తానేమీ మాట్లాడదలచుకోలేదని పేర్కొన్నారు. ఆయన ఏం చెప్పారనేది తెలియదని వ్యాఖ్యానించారు. ఈ ఉదయం బెంగళూరులో విలేకరులతో మాట్లాడారు డీకేశి. పార్టీని మరింత బలోపేతం చేయాల్సి ఉందని, దీనికోసం పీసీసీ అధ్యక్షుడిగా రాష్ట్రవ్యాప్తంగా పర్యటించాల్సి ఉందని, బూత్ స్థాయిలో కమిటీలతో సమావేశం కానున్నానని చెప్పారు.
వీరప్ప మొయలీ వ్యాఖ్యలు వ్యక్తిగతం
వీరప్ప మొయిలీ చేసిన వ్యాఖ్యలపై మంత్రులు ప్రియాంక్ ఖర్గే, సంతోష్ లాడ్ మాట్లాడారు. ఇప్పటికిప్పుడు డీకే శివకుమార్ ముఖ్యమంత్రి అవుతాడంటూ మొయిలీ చెప్పలేదని, ఏదో ఒక రోజు సీఎం అవుతాడనే అన్నాడని గుర్తు చేశారు. కష్టపడి పని చేసినందుకు డీకేకు రివార్డ్ దక్కడం ఖాయమేనని, ఈ విషయాన్ని ఖరారు చేయాల్సింది పార్టీ హైకమాండ్ మాత్రమేనని చెప్పారు. ప్రస్తుతానికి తమ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ మాత్రమేనని, ముఖ్యమంత్రి ఎవరనేది మీడియా ముందు నిల్చొని నిర్ణయించేది కాదని ప్రియాంక్ ఖర్గే చెప్పారు. పార్టీ, ప్రజల కోసం కష్టపడి పని చేసిన వాళ్లకు ఏదో ఒక రోజు రివార్డు దక్కుతుందని అన్నారు. వీరప్ప మొయలీ చేసిన వ్యాఖ్యలు ఆయన వ్యక్తిగతమని వ్యాఖ్యానించారు.

#telugu News Ap News in Telugu Breaking News in Telugu Google News in Telugu Karnataka politics Latest News in Telugu Paper Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today Today news Unexpected developments

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.