Udaipur: వాష్‌రూమ్‌లోకి తొంగి చూసినందుకు ₹10 లక్షల ఫైన్!

Read Time:  1 min
Udaipur
Udaipur
FONT SIZE
GET APP

రాజస్థాన్ రాష్ట్రం ఉదయ్‌పూర్‌లో(Udaipur) ఉన్న ప్రముఖ లగ్జరీ హోటల్ లీలా ప్యాలెస్‌పై కన్జూమర్ కోర్టు కీలక తీర్పు ఇచ్చింది. చెన్నైకి చెందిన దంపతులు తమ బస సమయంలో ఎదుర్కొన్న అనుచిత ఘటనకు సంబంధించి హోటల్‌పై చర్యలు తీసుకుంటూ ₹10 లక్షల జరిమానా విధించింది.

Read Also: Gig Workers: 16 ఏళ్లు నిండితేనే ‘గిగ్‌’ కార్మికులుగా నమోదు

Udaipur

బాధితుల కథనం ప్రకారం, వారు హోటల్ గదిలోని వాష్‌రూమ్‌లో ఉన్న సమయంలో హోటల్ సిబ్బంది అనుమతి లేకుండా మాస్టర్ కీ ఉపయోగించి గదిలోకి ప్రవేశించారు. తాము లోపల ఉన్నామని స్పష్టంగా చెప్పినా, సిబ్బంది బయటకు వెళ్లకుండా గదిలోకి తొంగి చూడడంతో తీవ్ర అసౌకర్యం, మానసిక వేదనకు గురయ్యామని వారు కోర్టులో వాపోయారు.

ఈ ఘటన అతిథుల వ్యక్తిగత గోప్యతను తీవ్రంగా ఉల్లంఘించిందని కన్జూమర్ కోర్టు అభిప్రాయపడింది. ‘Do Not Disturb’ బోర్డు లేకపోవడాన్ని కారణంగా చూపడం సమర్థనీయం కాదని, అతిథుల భద్రత, గోప్యతను కాపాడాల్సిన బాధ్యత పూర్తిగా హోటల్ యాజమాన్యానిదేనని స్పష్టం చేసింది.

సేవల్లో లోపం ఉందని తేల్చిన కోర్టు

హోటల్(Udaipur) సిబ్బంది ప్రవర్తనను సేవలలో లోపంగా పరిగణించిన కోర్టు, లగ్జరీ హోటళ్లలో ఇలాంటి ఘటనలు మరింత ఆందోళన కలిగించే అంశమని వ్యాఖ్యానించింది. హోటల్ ప్రతిష్ఠ ఎంత గొప్పదైనా, అతిథుల హక్కులు ఉల్లంఘితమైతే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించింది.

ఈ తీర్పుతో దేశవ్యాప్తంగా హోటల్ పరిశ్రమలో అతిథుల గోప్యత, భద్రత అంశాలపై కొత్త చర్చకు దారితీసింది. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా స్పష్టమైన మార్గదర్శకాలు అమలు చేయాల్సిన అవసరం ఉందని న్యాయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

Pooja

రచయిత గురించి

Pooja

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.