Piyush Goyal : భారత్‌, అమెరికా మధ్య వాణిజ్య చర్చలు కొనసాగుతున్నాయి : కేంద్ర వాణిజ్య మంత్రి

Read Time:  1 min
Piyush Goyal : భారత్‌, అమెరికా మధ్య వాణిజ్య చర్చలు కొనసాగుతున్నాయి : కేంద్ర వాణిజ్య మంత్రి
FONT SIZE
GET APP

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump)ఇటీవల ఉక్కు (Steel) మరియు అల్యూమినియం (Aluminium) దిగుమతులపై 50 శాతం వరకు సుంకాలు (Tariffs) విధించనున్నట్లు ప్రకటించారు. దీనిపై కేంద్ర వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్ (Piyush Goyal)స్పందిస్తూ, భారతదేశం మరియు అమెరికా మధ్య వాణిజ్య చర్చలు కొనసాగుతున్నాయి అని తెలిపారు.

Piyush Goyal : భారత్‌, అమెరికా మధ్య వాణిజ్య చర్చలు కొనసాగుతున్నాయి : కేంద్ర వాణిజ్య మంత్రి
Piyush Goyal : భారత్‌, అమెరికా మధ్య వాణిజ్య చర్చలు కొనసాగుతున్నాయి : కేంద్ర వాణిజ్య మంత్రి

తాత్కాలిక వాణిజ్య ఒప్పందం
ఈ ఒప్పందం విషయమై ఈ ఏడాది ఫిబ్రవరిలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌, భారత ప్రధాని నరేంద్ర మోదీ చర్చల్లో పాల్గొన్న సమయంలోనూ మాట్లాడుకున్నారని తెలిపారు. వాణిజ్యం విషయంలో రెండు దేశాలు కలిసి పనిచేయాలనే భావనతో ఉన్నాయని గోయల్‌ చెప్పారు. ఈ సమస్యను ఇరుదేశాలు ద్వైపాక్షికంగా పరిష్కరించుకుంటాయన్నారు. ఇరుదేశాల మధ్య ప్రతిపాదిత, మధ్యంతర వాణిజ్య ఒప్పందంపై చర్చలు జరిపేందుకు అమెరికా అధికారుల బృందం ఈ వారం భారత్‌ను సందర్శించనుందని తెలిపారు. జూన్ చివరికి ఇరుదేశాల మధ్య తాత్కాలిక వాణిజ్య ఒప్పందంపై అంగీకారం కుదిరే అవకాశం ఉందన్నారు.
ఈ విషయంపై భారత వాణిజ్య శాఖ ప్రత్యేక కార్యదర్శి రాజేష్ అగర్వాల్ గత నెలలో వాషింగ్టన్‌లో అధికారులతో చర్చలు జరిపారని గోయల్‌ తెలిపారు. ప్రస్తుతం ఫ్రాన్స్‌లో అధికారిక పర్యటనలో ఉన్న గోయల్‌ ఆ దేశంతో వాణిజ్య, పెట్టుబడి సంబంధాలను పెంచుకోవడానికి అక్కడి నాయకులు, వ్యాపార ప్రతినిధులతో చర్చలు జరుపుతున్నారు. ప్రస్తుతం భారత్‌ నుంచి దిగుమతి అవుతున్న ఉక్కు, అల్యూమినియంపై ఉన్న 25 శాతం సుంకాలను జూన్ 4 నుంచి రెట్టింపు చేస్తామని ఇటీవల ట్రంప్‌ ప్రకటించారు.
ట్రంప్ అధ్యక్షత్వ కాలంలో “అమెరికా ఫస్ట్” విధానం ద్వారా అమెరికన్ పరిశ్రమలను రక్షించే ఉద్దేశంతో విదేశీ ఉత్పత్తులపై అధిక టారిఫ్‌లు విధించబడ్డాయి. ఉక్కు, అల్యూమినియం రంగాల్లో చైనా, భారత్, ఇతర దేశాల నుంచి దిగుమతులు తగ్గించడానికి ఈ నిర్ణయం తీసుకున్నారు.
ఉక్కు పరిశ్రమలపై తీవ్ర ప్రభావం
అయితే దీనివల్ల భారతీయ ఆటో మొబైల్‌-భాగాల ఉత్పత్తుల ఎగుమతిదారులపై, ఉక్కు పరిశ్రమల రంగంపై తీవ్ర ప్రభావం పడుతుందని నిపుణులు హెచ్చరించారు. దాంతో అగ్రరాజ్యానికి చెందిన కొన్ని రకాల వస్తువులపై ప్రతీకార సుంకాలు విధించనున్నామన్న విషయాన్ని భారత్‌ ప్రపంచ వ్యాణిజ్య సంస్థ దృష్టికి తీసుకెళ్లింది. భారత స్టీల్‌, అల్యూమినియంపై విధించిన సుంకాలకు ప్రతిస్పందనగా అమెరికా వస్తువులకు ఇస్తున్న రాయితీలను నిలిపివేసి, దిగుమతి సుంకాలను పెంచనున్నట్లు వెల్లడించింది. ఈ మేరకు ప్రపంచ వ్యాణిజ్య సంస్థ యూఎస్‌కు నోటీసులు పంపగా వాటిని అగ్రరాజ్యం తిరస్కరించింది.

Read Also :Bihar Elections: మూడు దశల్లో బీహార్‌ ఎన్నికలు..?

Sudha

రచయిత గురించి

Sudha

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.