📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ఢిల్లీ-ఆగ్రా ఎక్స్‌ప్రెస్ హైవేపై ఘోర ప్రమాదం SBI యోనోలో 6,500 ఉద్యోగాలు: ఛైర్మన్ వైద్యుల ప్రిస్క్రిప్షన్లపై NMC కీలక ఆదేశాలు సీయూఈటీ నోటిఫికేషన్ విడుదల: పీజీ ప్రవేశాలు ప్రారంభం ఘోర రోడ్డు ప్రమాదం.. పొగమంచే కారణం పెరగనున్న కార్ల ధరలు పోస్టాఫీస్‌లో మ్యూచువల్‌ ఫండ్‌ సేవలు సొంతూళ్లకు వెళ్లేవారికి ఊరట.. సంక్రాంతి ప్రత్యేక రైళ్లు కేంద్ర మాజీ హోంమంత్రి శివరాజ్ పాటిల్ కన్నుమూత వందే మాతరం 150 ఏళ్లు అమిత్ షా సందేశం ఢిల్లీ-ఆగ్రా ఎక్స్‌ప్రెస్ హైవేపై ఘోర ప్రమాదం SBI యోనోలో 6,500 ఉద్యోగాలు: ఛైర్మన్ వైద్యుల ప్రిస్క్రిప్షన్లపై NMC కీలక ఆదేశాలు సీయూఈటీ నోటిఫికేషన్ విడుదల: పీజీ ప్రవేశాలు ప్రారంభం ఘోర రోడ్డు ప్రమాదం.. పొగమంచే కారణం పెరగనున్న కార్ల ధరలు పోస్టాఫీస్‌లో మ్యూచువల్‌ ఫండ్‌ సేవలు సొంతూళ్లకు వెళ్లేవారికి ఊరట.. సంక్రాంతి ప్రత్యేక రైళ్లు కేంద్ర మాజీ హోంమంత్రి శివరాజ్ పాటిల్ కన్నుమూత వందే మాతరం 150 ఏళ్లు అమిత్ షా సందేశం

Tollgate : రహదారులపై సరికొత్త టెక్నాలజీతో టోల్ ఛార్జీలు!

Author Icon By Vanipushpa
Updated: March 21, 2025 • 5:13 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

దేశంలో జాతీయ రహదారుల రూపురేఖలు మారుతున్నాయి. ప్రయాణం మరింత సులభంగా, వేగంగా సాగేందుకు కేంద్ర ప్రభుత్వం సరికొత్త విధానాలను తీసుకువస్తోంది. దీంతో టోల్ ప్లాజాల వద్ద గంటల తరబడి నిరీక్షణకు స్వస్తి పలికే అవకాశం ఉంది. అటు టోల్ ఛార్జీల భారం తగ్గించేందుకు కూడా ఈ విప్లవాత్మక మార్పులకు కేంద్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టబోతుంది. ఈ విషయాలన్ని స్వయంగా రోడ్డు రవాణా , రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ప్రకటించడంతో వాహనదారుల్లో ఆనందం వెల్లివిరుస్తోంది.

ఊరటనిచ్చే కొత్త విధానం
ప్రస్తుతం టోల్ గేట్ల వద్ద ఎదురయ్యే ట్రాఫిక్ సమస్యలు, ఛార్జీల మోతతో సతమతమవుతున్న వాహనదారులకు ఈ కొత్త విధానం నిజంగా ఊరటనిచ్చే అంశం. టోల్ వసూళ్లలో పారదర్శకత, వేగం పెంచేందుకు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించనున్నారు. రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ వినూత్న ఆలోచనతో ముందుకొచ్చింది. సంవత్సరానికి రూ.3,000 లేదా 15 సంవత్సరాలకు ఒకేసారి రూ.30,000 చెల్లించేలా వార్షిక , జీవితకాల టోల్ ఫీజులను ప్రవేశపెట్టాలని యోచిస్తోంది.
ఈ విధానం అమల్లోకి వస్తే టోల్ గేట్ల వద్ద నెలకొనే ట్రాఫిక్ కష్టాలకు చెక్ పెట్టవచ్చు. శాటిలైట్ టోలింగ్, ANPR టెక్నాలజీతో టోల్ వసూళ్లు సులభతరం!
అభివృద్ధికి టోల్ ఛార్జీలు అవసరం
మౌలిక సదుపాయాల అభివృద్ధికి టోల్ ఛార్జీలు ఎంతో అవసరమని గడ్కరీ స్పష్టం చేశారు. “మంచి రోడ్డు కావాలంటే దానికి డబ్బు చెల్లించాలి అనేది మా విధానం” అని ఆయన కుండబద్దలు కొట్టారు. నాణ్యమైన రోడ్ల నిర్మాణం, నిర్వహణకు టోల్ ఛార్జీల ద్వారా వచ్చే ఆదాయాన్ని వినియోగిస్తామని ఆయన హామీ ఇచ్చారు.

జాతీయ రహదారుల ఫీజు నియమాలు: జాతీయ రహదారులపై టోల్ ప్లాజాలు జాతీయ రహదారుల ఫీజు నియమాలు, 2008 ప్రకారం నడుస్తాయి. 2023-24లో టోల్స్ ద్వారా రూ.64,809.86 కోట్ల ఆదాయం వచ్చింది. ఇది గత సంవత్సరంతో పోలిస్తే 35% ఎక్కువ కావడం విశేషం.

#telugu News Ap News in Telugu Breaking News in Telugu Google News in Telugu Latest News in Telugu Paper Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today the latest technology! Today news Toll charges on roads

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.