భారత్లో ఉన్న పాకిస్థాన్ పౌరులకు కేంద్ర ప్రభుత్వం మరోసారి గట్టి హెచ్చరిక జారీ చేసింది. నిర్ణీత గడువులోగా దేశం విడిచిపెట్టని పక్షంలో, నేరుగా జైలుకు పంపిస్తామని స్పష్టం చేసింది. ఏప్రిల్ 4 నుంచి అమలులోకి వచ్చిన ఇమ్మిగ్రేషన్ & ఫారిన్ యాక్ట్ 2025 ప్రకారం, గడువు ముగిసిన తర్వాత కూడా భారత్లో ఉండిపోతే, పాక్ పౌరులకు మూడేళ్ల జైలు శిక్ష లేదా రూ.3 లక్షల జరిమానా లేదా రెండూ ఒకేసారి విధించే అవకాశం ఉందని కేంద్రం తెలిపింది.
గడువుపై స్పష్టమైన మార్గదర్శకాలు
భారత్ ప్రభుత్వం నిర్దేశించిన విధంగా, పాక్ పౌరులు వీసా గడువును గౌరవించి దేశం విడిచిపెట్టాలి. సాధారణ టూరిస్ట్, బిజినెస్, మతపరమైన, కుటుంబ సందర్శన వీసాల గడువు ఇప్పటికే ముగిసింది. ప్రస్తుతం మెడికల్ వీసా ఆధారంగా ఉన్న పాకిస్థాన్ పౌరులకు మాత్రం కొంత సడువు ఇచ్చారు. వీరందరూ ఏప్రిల్ 29లోగా తప్పనిసరిగా భారత్ను విడిచి వెళ్లాలని ఆదేశించారు. ఈ గడువును కూడా ఉల్లంఘించినా, అదే కఠిన చర్యలు తీసుకోవడం ఖాయమని అధికార వర్గాలు స్పష్టం చేశాయి.
Read Also : Phalgam Terror Attack: పహల్గామ్ ఉగ్రదాడితో సంబంధం లేదన్న పాకిస్థాన్ స్పందించిన ఒమర్ అబ్దుల్లా
భద్రత దృష్టితో కేంద్రం కఠిన చర్యలు
దేశ భద్రతను దృష్టిలో ఉంచుకొని కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని తీసుకుంది. అక్రమ వీసాలతో గడువు మించిపోయి మిగిలిపోయిన విదేశీ పౌరులు, భద్రతాపరమైన ముప్పును పెంచే ప్రమాదం ఉన్నందున, ప్రభుత్వానికి కఠిన ఆంక్షలు విధించడం తప్పదని అధికారులు చెబుతున్నారు. ఇప్పటికే పలు సందర్భాల్లో పాక్ పౌరులపై నిఘా పెంచినట్టు సమాచారం. భారత భద్రతను సమగ్రంగా కాపాడే క్రమంలో, వీసా నిబంధనలు ఉల్లంఘించే వారిపై మన్నించని విధంగా చర్యలు కొనసాగనున్నాయి.