📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

పిహెచ్ సి స్థాయిలోనే స్క్రబ్ టైఫస్ నిర్ధారణ పరీక్షలు విగ్రహాల ఏర్పాటుపై బందరులో ఉద్రిక్తత సంక్రాంతి నుంచి అన్ని సేవలు ఆన్లైన్ గవర్నర్ అబ్దుల్ నజీర్ సిఎం చంద్రబాబు భేటీ ఈ నెల 15 వరకు రేషన్ కార్డు తీసుకొనే గడువు టెన్త్ పరీక్ష ఫీజు గడువు పొడిగింపు అమరావతికి త్వరలోనే అధికారిక గుర్తింపు.. చిలకలూరిపేటలో రోడ్డు ప్రమాదం.. జాతీయ స్థాయిలో గిరిజన విద్యార్థుల మెరుపులు 2,500 ఎకరాల్లో అంతర్జాతీయ స్పోర్ట్స్ సిటీ పిహెచ్ సి స్థాయిలోనే స్క్రబ్ టైఫస్ నిర్ధారణ పరీక్షలు విగ్రహాల ఏర్పాటుపై బందరులో ఉద్రిక్తత సంక్రాంతి నుంచి అన్ని సేవలు ఆన్లైన్ గవర్నర్ అబ్దుల్ నజీర్ సిఎం చంద్రబాబు భేటీ ఈ నెల 15 వరకు రేషన్ కార్డు తీసుకొనే గడువు టెన్త్ పరీక్ష ఫీజు గడువు పొడిగింపు అమరావతికి త్వరలోనే అధికారిక గుర్తింపు.. చిలకలూరిపేటలో రోడ్డు ప్రమాదం.. జాతీయ స్థాయిలో గిరిజన విద్యార్థుల మెరుపులు 2,500 ఎకరాల్లో అంతర్జాతీయ స్పోర్ట్స్ సిటీ

తెలుగు రాష్ట్రాల్లోని ఈ స్టేషన్లలో 26 రైళ్లకు హాల్ట్ లు

Author Icon By Vanipushpa
Updated: February 4, 2025 • 4:56 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఏదో విధంగా ఆదాయం పెంచుకునేందుకు ప్రయత్నిస్తున్న రైల్వేశాఖ ఈ మధ్య పలు ప్రయోగాలు చేస్తోంది. ఇందులో భాగంగా ఏపీలోని పలు రైల్వే స్టేషన్లలో కొత్తగా దూర ప్రాంతాలకు వెళ్లే పలు రైళ్లను ప్రయోగాత్మకంగా ఆపాలని దక్షిణ మధ్య రైల్వే నిర్ణయం తీసుకుంది. అలాగే వీటి వివరాలను కూడా వెల్లడించింది. ఇందులో 26 ఎక్స్ ప్రెస్, సూపర్ ఫాస్ట్ రైళ్లు కూడా కొత్తగా ఇప్పటివరకూ ఆగని స్టేషన్లలో ఆగబోతున్నాయి. భువనేశ్వర్-సికింద్రాబాద్ రైలు (17015) ను ఈ నెల 4 నుంచి సత్తెనపల్లి, పిడుగురాళ్ల, నడికుడి, మిర్యాలగూడ, నల్గొండలో ఆపబోతున్నారు. అలాగే నాగర్ సోల్-నర్సాపూర్ ఎక్స్ ప్రెస్ (17232) ను కూడా సత్తెనపల్లి, పిడుగురాళ్ల, నడికుడి, మిర్యాలగూడ, నల్గొండలో నిన్నటి నుంచి ఆపుతున్నారు. హజరత్ నిజాముద్దీన్-తిరుపతి (12708) రైలును తెలంగాణలోని బెల్లంపల్లిలో ఈ నెల 5నుంచి ఆపనున్నారు. అలాగే ఎర్నాకుళం-పాట్నా ఎక్స్ ప్రెస్ (22669)ను ఈ నెల 5 నుంచి ఖమ్మంలో ఆపబోతున్నారు. బీదర్-హైదరాబాద్ ఎక్స్ ప్రెస్ (17009)ని మర్పల్లిలో ఇవాళ్టి నుంచి హాల్ట్ ఇస్తున్నారు.

అలాగే చెన్నై సెంట్రల్ -అహ్మదాబాద్ (23656)ను, అహ్మదాబాద్-చెన్నై సెంట్రల్ (23655)ను నిన్నటి నుంచి పెద్దపల్లిలో ఆపుతున్నారు. అలాగే సికింద్రాబాద్-గుంటూరు (12706), గుంటూరు-సికింద్రాబాద్ (10705) రైళ్లను ఇవాళ్టి నుంచి నెక్కొండలో ఆపుతున్నారు. చెన్నై-హజరత్ నిజాముద్దీన్ (12611) రైలుకు ఈ నెల 8 నుంచి వరంగల్ లో హాల్ట్ ఇచ్చారు. అలాగే చెన్నై సెంట్రల్-హైదరాబాద్ (12603) రైలుకు నిన్నటి నుంచి సత్తెనపల్లి, పిడుగురాళ్ల, నడికుడి, మిర్యాలగూడ, నల్గొండలో స్టాపులు ఇచ్చారు. అటు తిరుపతి-లింగంపల్లి (12733) రైలును నిన్నటి నుంచి పిడుగురాళ్ల, నడికుడి, మిర్యాలగూడలో ఆపుతున్నారు. అలాగే నరసాపురం-లింగంపల్లి (17255) రైలును నిన్నటి నుంచి నల్గొండలో ఆపుతున్నారు. లింగంపల్లి-నరసాపూర్ (17256) రైలును నిన్నటి నుంచి మంగళగిరిలో ఆపుతున్నారు. పూరీ-తిరుపతి (17479), బిలాస్ పూర్ -తిరుపతి(17481), తిరుపతి-కాకినాడ టౌన్ (17249) రైళ్లను నిన్నటి నుంచి చిన్న గంజాంలో ఆపుతున్నారు.

#telugu News Ap News in Telugu Breaking News in Telugu Google News in Telugu halts Indian Railway Latest News in Telugu Paper Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today Today news

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.