ప్రపంచ శాంతి కోసం భారతదేశం ఎప్పుడూ కట్టుబడి ఉంటుందని, అయితే శక్తి ఉన్నప్పుడు మాత్రమే ఇతర దేశాలు ఆ శాంతి మాటలు పరిగణనలోకి తీసుకుంటాయని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) చీఫ్ Mohan Bhagwat వ్యాఖ్యానించారు.శనివారం జైపూర్ సమీపంలోని హర్మారా రవినాథ్ ఆశ్రమంలో జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. భగవత్ స్పష్టంగా చెప్పారు –ప్రేమ, మానవత్వం అద్భుతమైనవి. కానీ, అవి వినిపించాలంటే శక్తి ఉండాలి.

పాకిస్థాన్పై పరోక్ష వ్యాఖ్యలు
ఇటీవలి ఘటనలలో భారత్ తీసుకున్న దృఢమైన నిర్ణయాలపై భగవత్ పరోక్షంగా స్పందించారు. మన దేశం ఎవరినీ ద్వేషించదు. కానీ, శక్తి ఉంటేనే ప్రేమకు విలువ ఉంటుంది, అని చెప్పారు. ఇది ప్రపంచ స్వభావం. మనం మార్చలేము.అంతర్జాతీయంగా శక్తివంతంగా నిలవడం ఎంతో కీలకమని ఆయన స్పష్టం చేశారు. ప్రపంచ సంక్షేమం కోసం బలంతో ముందుకు సాగాలి. ఇప్పుడు ప్రపంచం మన బలాన్ని చూస్తోంది,’’ అని వ్యాఖ్యానించారు.
హిందూ ధర్మం – ప్రపంచ శ్రేయస్సు లక్ష్యం
భగవత్ మాట్లాడుతూ, ప్రపంచ శ్రేయస్సే హిందూ ధర్మానికి ప్రాతినిధ్యం అని తెలిపారు. ఇది ఒక విశిష్టమైన ధర్మబద్ధత. మనం అందరికీ మంచి కోరే సంప్రదాయాన్ని అనుసరిస్తున్నాం, అని అన్నారు.భారతదేశం ఇప్పటికే సామరస్యానికి పెద్దన్నగా మారిందని ఆయన గుర్తుచేశారు. శ్రీలంక, నేపాల్, మాల్దీవుల వంటి దేశాలకు తొలి సహాయం భారత్ నుంచే వచ్చింది, అని చెప్పారు.
భారత సాంస్కృతిక విలువలు – త్యాగానికి గుర్తింపు
ఆర్ఎస్ఎస్ చీఫ్ భారత సాంస్కృతిక నేపథ్యాన్ని కూడా చర్చించారు. త్యాగం మన సంప్రదాయం. శ్రీరాముడి నుంచి భామాషా వరకు ఎన్నో ఉదాహరణలు ఉన్నాయ్, అని అన్నారు.భారత ప్రజలలో సహాయం చేసే మనస్తత్వం ఉందని, అదే మన బలమని తెలిపారు. మన విలువలు ప్రపంచానికి ఆదర్శంగా నిలుస్తున్నాయి, అని పేర్కొన్నారు.
భారత దృఢ సంకల్పం – భద్రత, శాంతి రెండింటికీ అవసరం
భగవత్ మాటల్లో స్పష్టత ఉంది – దేశం బలహీనంగా ఉండకూడదు. శాంతికి శక్తి ఆధారమే. ప్రపంచం మన మాట వినాలంటే, బలంగా ఉండాలి. బలమే మనకు గౌరవం తీసుకువస్తుంది, అని పేర్కొన్నారు.
Read Also : Nara Lokesh : ‘యువగళం’ కాఫీ టేబుల్ పుస్తకాన్ని ఆవిష్కరించిన మోదీ