📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత

ఢిల్లీ సీఎం ప్రమాణ స్వీకారానికి ముహూర్తం ఖరారు

Author Icon By Vanipushpa
Updated: February 14, 2025 • 3:30 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

27 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత ఢిల్లీలో బీజేపీ అధికారాన్ని చేజిక్కించుకున్న సంగతి తెలిసిందే. 70 అసెంబ్లీ స్థానాలకు గానూ 48 స్థానాల్లో బీజేపీ గెలవగా.. ఆమ్ ఆద్మీ పార్టీ 22 స్థానాలలో విజయం సాధించింది. ఈ క్రమంలో ఢిల్లీలో ప్రభుత్వ ఏర్పాటుకు బీజేపీ సిద్ధమవుతోంది. ఇందుకు సంబంధించిన సన్నాహాలను కమలం పార్టీ మొదలుపెట్టింది. ఢిల్లీ నూతన ముఖ్యమంత్రి ప్రమాణస్వీకారానికి ముహూర్తం ఖరారైందని తెలిసింది. ఢిల్లీ నూతన సీఎం ప్రమాణ స్వీకారోత్సవం ఫిబ్రవరి 19 లేదా 20న జరిగే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. ఢిల్లీ శాసనసభా పక్ష సమావేశం ఫిబ్రవరి 17 లేదా 18న జరిగే అవకాశం ఉంది. ప్రధాని నరేంద్ర మోడీ అమెరికా పర్యటనలో ఉన్న సంగతి తెలిసిందే. ఈ పర్యటన ముగించికుని ఇవాళ లేదా రేపు ఉదయానికి ప్రధాని ఢిల్లీకి రానున్నారు. ప్రధాని మోడీ ఢిల్లీకి చేరుకున్న తర్వాత ప్రభుత్వ ఏర్పాటుకు సన్నాహాలు ముమ్మరం అయ్యే అవకాశం ఉంది.


అమిత్ షా, జేపీ నడ్డాలతో ప్రధాని భేటీ
ప్రధాని నరేంద్ర మోడీ ఢిల్లీ వచ్చిన వెంటనే ప్రధానితో అమిత్ షా, జేపీ నడ్డా సహా బీజేపీ ముఖ్య నేతలు భేటీ కానున్నట్లు తెలుస్తోంది. ప్రధాని మోడీతో చర్చలు జరిపి ఈ నెల 17, 18 తేదీల్లో శాసనసభా పక్ష సమావేశం ఏర్పాటు చేసి ముఖ్యమంత్రి అభ్యర్థిని ఎన్నుకోనున్నారు. 19 లేదా 20న ఢిల్లీ ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం జరిగే అవకాశం ఉంది. గెలిచిన 48 మంది ఎమ్మెల్యేలలో 15 మంది పేర్లను షార్ట్ లిస్ట్ చేశారు. వారిలో తొమ్మిది మందిని ముఖ్యమంత్రి, మంత్రులు, స్పీకర్ పదవులకు ఎంపిక చేస్తారు.
ఈ సారి ఢిల్లీ ఎన్నికల్లో ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్, మనీష్ సిసోడియాతో సహా ఆ పార్టీ కీలక నాయకులు పరాజయం పాలయ్యారు. మరోవైపు ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటించకుండానే ఎన్నికల బరిలోకి దిగిన బీజేపీ.. ప్రభుత్వ అధిపతిని నిర్ణయించడానికి ఉన్నత స్థాయి సమావేశాలను ప్రారంభించింది. ఐదుగురు నాయకులు కీలక పోటీదారులుగా ఉద్భవించారు.
పర్వేష్ వర్మకె ఎక్కువ అవకాశాలు
న్యూఢిల్లీ అసెంబ్లీ స్థానంలో ఆప్ అధినేత కేజ్రీవాల్ ను ఓడించిన పర్వేష్ వర్మ.. ఢిల్లీలో ముఖ్యమంత్రి అభ్యర్థిత్వానికి పోటీ పడేవారి జాబితాలో ముందున్నారు. ఢిల్లీ అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా పని చేసిన సీనియర్ బీజేపీ నేత విజయేందర్ గుప్తా, గతంలో రాష్ట్ర అధ్యక్షుడిగా పని చేసిన కీలక బ్రాహ్మణ నేత సతీష్ ఉపాధ్యాయ్, కేంద్ర నాయకులతో సన్నిహిత సంబంధాలు కలిగి ఉన్న ఢిల్లీ బీజేపీ ప్రధాన కార్యదర్శి ఆశిష్ సూద్, వైశ్య సమాజానికి చెందిన ఆర్ఎస్ఎస్ నేత జితేంద్ర మహాజన్ ఇతర పోటీదారులుగా ఉన్నారు.

#telugu News Ap News in Telugu BJP Breaking News in Telugu Delhi CM's finalized Google News in Telugu Latest News in Telugu Paper Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today Today news

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.