EC: ఇటీవల ఈసీకి రాజకీయ పార్టీల మధ్య విభేదాలు తారాస్థాయికి చేరుకున్నాయి. ఒకరిపై ఒకరు ఆరోపణల వర్షం కురుస్తూనే ఉంది.ఈ పోకడలపై సుప్రీంకోర్టు(Supreme court) కూడా కీలకవ్యాఖ్యలు చేసింది. కేంద్రప్రభుత్వంతో ఈసీ కుమ్మక్కై ఓటర్లను తారుమారుచేస్తూ ఓటు కుంభకోణానికి పాల్పడుతున్నదని ఇండియా కూటమి ఆరోపిస్తున్నది. దీంతో బీహార్ ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియపై దాఖలైన పిటిషన్ల విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఓటర్ల జాబితాలో మర్పులు, చేర్పుల కోసం నామినేషన్ల దాఖలుకు చివరితేదీ వరకు అవకాశం ఉంటుందని ఎన్నిక సంఘం (ఈసీ) కోర్టుకు స్పష్టం చేసింది. దీంతో సెప్టెంబర్ 1తోముగిసిన గడువుపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తేలిపోయింది. బీహార్లో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఎన్నికల సంఘం ఆగస్టు 1న ఓటర్ల ముసాయిదా జాబితాను విడుదల చేసింది. దీనిపై అభ్యంతరాలు తెలిపేందుకు సెప్టెంబర్ 1ని తుది గడువుగా నిర్ణయించింది. ఈ గడువును పొడిగించాలని కోరుతూ కొందరు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్పై సోమవారం విచారణ జరిగింది. ఈ సందర్భంగా ఎన్నికల సంఘం తన వైఖరిని తెలియజేసింది. అభ్యంతరాలను సెప్టెంబర్ 30 తర్వాత కూడా స్వీకరిస్తామని, నామినేషన్ల ప్రక్రియ ముగిసేంత వరకు సవరణలు కొనసాగుతాయని సుప్రీంకోర్టుకు హామీ ఇచ్చింది.

సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు
ఈసీ వివరణ అనంతరం, సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఎన్నికల సంఘం, రాజకీయ పార్టీల మధ్య ఇలాంటి విభేదాలు తలెత్తడం దురదృష్టకరమని అబభిప్రాయపడింది. అదే సమయంలో, ఓటర్ల జాబితాలో(voters’ list) ఫిర్యాదులు చేయడంపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు వాలంటీర్లను నియమించాలని బీహార్ లీగల్ సర్వే అథారిటీని ఆదేశించింది.
ఈసీకి, రాజకీయ పార్టీలకు మధ్య వివాదానికి కారణం ఏమిటి?
ఓటర్ల జాబితాను తారుమారు చేసి, ఓటు కుంభకోణానికి పాల్పడుతున్నారని ఇండియా కూటమి ఈసీపై ఆరోపణలు చేయడమే ఈ వివాదానికి కారణం.
సుప్రీంకోర్టులో ఏ పిటిషన్పై విచారణ జరిగింది?
బీహార్ ఓటర్ల జాబితా సవరణ గడువును పొడిగించాలని కోరుతూ దాఖలైన పిటిషన్పై సుప్రీంకోర్టు విచారణ జరిపింది.
Read hindi news: hindi.vaartha.com
Read also: