Pune: భార్యాభర్తల అనుబంధాన్ని ఎంత వర్ణించినా తక్కువే. మనసులో మనసై తోడు ఒకరు ఉంటే ఇక ప్రపంచమే స్వర్గసీమ ఆవుతుంది. కష్టాలు, బాధలు, రోగాలు, ఆర్థిక ఇబ్బందులు ఎన్ని అయితే ఇట్టే జయించవచ్చు. త్యాగం గొప్ప గుణం. గొప్ప మనసున్నవారే చేస్తారు. భర్త అనారోగ్యంతో బాధపడుతుంటే భార్య అతనిని ఎలాగైనా కాపాడుకోవాలని పరితపించింది. ఆ త్యాగమే ఇద్దరినీ అనంతలోకానికి పంపించింది. మహారాష్ట్రలోని పూణే(Pune)లో జరిగిన ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి.

భర్తకు లివర్ దానం చేసిన భార్య
అనారోగ్యంతో ఆసుపత్రి పాలైన భర్తను ఏవిధంగానైనా కాపాడుకోవాలని భార్య ఆశించింది. అతని పేరు బాపు కోంకర్. ఆయన కాలేయం(Liver) పూర్తిగా దెబ్బతిందని, కాలేయ మార్పిడి చేయాల్సిందేనని వైద్యులు స్పష్టం చేశారు. దీంతో బాపు భార్య కామిని తన కాలేయం ఇచ్చేందుకు ముందుకు వచ్చింది. పూణేలోని సహ్యాద్రి ఆసుపత్రిలో ఈనెల 15న కాలేయ మార్పిడి ఆపరేషన్ జరిగింది. కామిని శరీరంలోని కాలేయంలో కొంతభాగాన్ని తీసి ఆమె భర్త బాపు శరీరంలో వైద్యులు అమర్చారు.
ఆరోగ్యం విషమించి, ఇద్దరూ మృతి
ఆపరేషన్ తర్వాత బాపు ఆరోగ్యం మరింత విషమించింది. రెండు రోజుల తర్వాత ఈనెల 17న బాపు కన్నుమూశాడు. మరోవైపు, కాలేయ దానం కారణంగా కామినికి కూడా ఇన్ ఫెక్షన్ సోకింది. చికిత్స పొందుతూ ఈనెల 21న ఆమె కూడా మరణించారు. దీంతో వైద్యుల నిర్లక్ష్యం వల్లే బాపు, కామిని చని పోయారంటూ వారి బంధువులు ఆందోళన చేపట్టారు. దీనిపై విచారణ జరిపి, వైద్యులను శిక్షించాలని బంధువులు డిమాండ్ చేశారు. స్పందించిన ఉన్నతాధికారులు కాగా ఈ ఘటనపై ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులు స్పందించారు. కాలేయ మార్పిడి చికిత్సకు సంబంధించిన అన్ని వివరాలు, పేషెంట్ అనారోగ్య వివరాలు, వీడియో ఫుటేజీలతో పాటు రికార్డులన్నీ సమర్పించాలని ఆసుపత్రి యాజమాన్యానికి నోటీసులు జారీ చేశారు. వాటిని పరిశీలించి నిర్లక్ష్యం ఉన్నట్లు తేలితే కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు పేర్కొన్నారు.
బంధువులు ఏమని ఆరోపించారు?
వైద్యుల నిర్లక్ష్యం వల్లే ఈ ఇద్దరూ చనిపోయారని బంధువులు ఆరోపిస్తూ ఆందోళన చేపట్టారు.
అధికారుల స్పందన ఏమిటి?
ఆరోగ్యశాఖ అధికారులు ఆసుపత్రికి నోటీసులు జారీ చేసి, రికార్డులు, ఫుటేజ్, వివరాలు అందించాలని ఆదేశించారు. నిర్లక్ష్యం తేలితే కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.
READ HINDI NEWS : hindi.vaartha.com
READ ALSO :