Telugu News: Pak- తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న పాకిస్తాన్

Read Time:  1 min
Telugu News: Pak- తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న పాకిస్తాన్
FONT SIZE
GET APP

Pak: భారతదేశంతో నిత్యం పోరాడేందుకు ప్రయత్నించే పాకిస్తాన్ ప్రస్తుతం తీవ్రమైన ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్నది. భారత్పై యుద్ధానికి దిగిన పాక్ రక్షణ ఆయుధాల కోసం విపరీతంగా ఖర్చు చేస్తున్నది. దీనికి తోడు సింధునది(Indus River) నీటి విడుదలను భారతదేశం ఆపి వేయడంతో రైతులకు నీరు అందక పంటలు ఎండిపోతున్నాయి. ఒకవైపు తీవ్రమైన వర్షాలు మరోవైపు నీటి ఎద్దడితో ప్రజలు
అల్లాడుతున్నారు. భారత విమానాలను పాక్ గగనతలంపై అనుమతిని ఇవ్వకపోవడంతో విమానాసంస్థలకు ఖర్చు విపరీతంగా పెరిగింది. నిత్యావసర ధరలు ఆకాశాన్ని అంటాయి. దేశ జనాభాలో దాదాపు సగం మంది 44.7శాతం ప్రజలు దారిద్య్రరేఖకు దిగువన జీవిస్తున్నారని ప్రపంచ బ్యాంకు తాజా నివేదికలో వెల్లడించడం ఆదేశ దయనీయ పరిస్థితులను తెలుపుతున్నది. రాజకీయ, ఆస్థిరత, పెరుగుతున్న ద్రవ్యోల్బణం, పడిపోతున్న పారిశ్రామిక ఉత్పత్తి వంటి సమస్యలు దేశాన్ని ఆర్థిక దివాళాతనానికి దారితీస్తున్నది.

Telugu News: Pak- తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న పాకిస్తాన్
Telugu News: Pak- తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న పాకిస్తాన్

బ్యూరో స్టాటిస్టిక్స్ గణాంకాల ప్రకారం

పాకిస్తాన్ 2022లో 1,766 డాలర్లుగా ఉన్న తలసరి ఆదాయం, 2023 నాటికి 1,568 డాలర్లకు పడిపోయింది. అంటే, ఏడాది కాలంలో 11.38శాతం క్షీణత నమోదైంది. ఇదే సమయంలో దేశ ఆర్థిక వ్యవస్థ పరిమాణం కూడా 375 బిలియన్ డాలర్ల నుంచి 341.6 బిలియన్డా లర్లకు తగ్గిపోయింది. అంతేకాదు ప్రజలను ద్రవ్యోల్బణం(Inflation) కూడా తీవ్రంగా వేధిస్తోంది. ఆహార పదార్థాలు, ఇంధన ధరలు విపరీతంగా పెరగడంతో సామాన్యుల కొనుగోలు శక్తి దెబ్బతింది. ప్రాంతీయ విబేధాలు కూడా ఆర్థిక సంక్షోభాన్ని మరింతగా పెంచాయి. ప్రపంపబ్యాంకు చేస్తున్న ఆర్థిక సాయం కూడా పాకిస్తాన్ ప్రజల అవసరాల కోసం కాకుండా రక్షణ రంగాలకే కేటాయిస్తున్నది. భారత్-
పాక్ యుద్ధం కూడా పాకిస్తాన్ ఆర్థికంగా కొలుకోకుండా అయ్యింది. దీంతో దాదాపు 44 శాతం మంది పేదరికంలోనే జీవిస్తున్నారు.

పాకిస్తాన్‌లో దారిద్య్రం ఎంతవరకు ఉంది?
ప్రపంచ బ్యాంకు నివేదిక ప్రకారం, పాక్ జనాభాలో సుమారు 44.7% ప్రజలు దారిద్య్రరేఖకు దిగువన జీవిస్తున్నారు.

ప్రాంతీయ విభేదాలు పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థపై ఎలా ప్రభావం చూపుతున్నాయి?
పంజాబ్, సింధ్, బలోచిస్తాన్ ప్రాంతాల మధ్య అసమానతలు, రాజకీయ అస్థిరత పాకిస్తాన్‌లో పెట్టుబడులను తగ్గిస్తున్నాయి. ఇది ఆర్థిక క్షీణతకు దారితీస్తుంది.

Read hindi news: hindi.vaartha.com

Read also:

https://vaartha.com/telugu-news-pak-pak-airspace-banned-for-indian-flights-till-september-23/national/533875/

Pooja

రచయిత గురించి

Pooja

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.