Telugu News: Online లోక్ సభలో ఆన్‌లైన్ బెట్టింగ్ బిల్లు.. కఠిన నిబంధనలు

Read Time:  1 min
Telugu News: Online లోక్ సభలో ఆన్‌లైన్ బెట్టింగ్ బిల్లు.. కఠిన నిబంధనలు
FONT SIZE
GET APP

ఆన్ లైన్(Online) వల్ల ఎందరో ప్రాణాలు పోతున్నాయి. బెట్టింగ్ ఊబిలో చిక్కుకుని బయటపడే మార్గం కనిపించక ఆత్మహత్యలకు పాల్పడుతున్న వారి సంఖ్య ఇటీవల బాగా పెరుగుతున్నది. ప్రజలు, బాధిత కుటుంబ సభ్యులు వీటిపై కఠినచర్యలు తీసుకోవాలని కేంద్రంపై ఒత్తిడి తీసుకొచ్చాయి. దీంతో కేంద్ర ప్రభుత్వం ఆన్ లైన్ బెట్టింగ్ను(Online betting) నేరంగా పరిగణించింది. ఈ నేపధ్యంలోనే కేంద్ర ఐటీశాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ప్రమోషన్ అండ్ రెగ్యులేషన్ ఆఫ్ ఆన్లైన్గేమింగ్ బిల్లు-2025ను బుధవారం ప్రవేశపెట్టారు. దీనిపై విపక్షాలు తీవ్ర ఆందోళనలు చేశాయి. అయినప్పటికీ ఆందో
ళనల నడుమే ఈ బిల్లును ప్రవేశపెట్టారు. తర్వాత సభను మధ్యాహ్నం 2 గంటలకు వాయిదా వేశారు. ఈమధ్య కాలంలో ఆన్ లైన్ బెట్టింగ్ యాప్లకు బలై ఎంతోమంది ప్రాణాలు తీసుకుంటున్నారు. ఇలాంటి ఘటనలు రోజురోజుకు పెరుగుతున్న నేపథ్యంలోనే కేంద్రం ఈ బిల్లును తీసుకొచ్చింది.

Online
Online

మూడేళ్ల జైలు శిక్ష

ఆర్థిక లావాదేవీల్లో ప్రమేయం ఉన్నవాళ్లకు గరిష్టంగా 3 ఏళ్ల జైలు శిక్ష, రూ. కోటి జరిమానా(Fine of Rs. 1 crore) ఉంటుంది. ఇక్కడ మరో విషయం ఏంటంటే ఈ బిల్లు ప్రకారం ఆన్ లైన్ గేమ్స్ ఆడేవాళ్లు నేరస్థులుగా కాకుండా బాధితులుగా ఉంటారు. మరోవైపు ఈ బిల్లు వల్ల తమ రంగానికి తీవ్ర నష్టం ఉంటుందని ఆల్ ఇండియా గేమింగ్ ఫెడరేషన్ ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఈ నేపధ్యంలోనే కేంద్ర హోంమంత్రి అమిత్ కు లేఖ రాసింది.

పలు రాష్ట్రాల్లో ఇప్పటికే యాప్పై నిషేధం

పలు రాష్ట్రాలు ఇప్పటికే బెట్టింగ్ యాప్స్ పై నిషేధం విధించాయి. కానీ కొందరు ఆకతాయిలు గుట్టుచప్పుడు కూడా వీటిని వాడుతున్నారు. అందుకే కేంద్రం దేశవ్యాప్తంగా ఈ బెట్టింగ్ యాప్స్ ఆగడాలకు అరికట్టేందుకు ఈ బిల్లును ఈ తీసుకొచ్చింది. బెట్టింగ్ యాప్ ఊబిలో పడకూడదని ఇప్పటికే పోలీసులు యువతకు సూచనలు చేస్తున్నారు.

ఆన్లైన్ గేమింగ్ భారతదేశంలో చట్టబద్ధం?

నైపుణ్యం, అవకాశం లేదా రెండింటిపై ఆధారపడినా , అన్ని రకాల ఆన్‌లైన్ మనీ గేమింగ్‌లను బిల్లు నిషేధిస్తుంది . ఇది ఆన్‌లైన్ మనీ గేమ్‌ను రుసుములు చెల్లించడం, డబ్బు డిపాజిట్ చేయడం లేదా ద్రవ్య రాబడి కోసం ఇతర వాటాలను చెల్లించడం ద్వారా ఆడటం అని నిర్వచిస్తుంది.

ఆన్లైన్ గేమ్స్ ను ఎవరు ప్రారంభించారు?

1980లో ARPANET ఇంగ్లాండ్‌లోని కోల్చెస్టర్‌లోని ఎసెక్స్ విశ్వవిద్యాలయంతో అనుసంధానించబడింది , అక్కడ ఇద్దరు అండర్ గ్రాడ్యుయేట్ విద్యార్థులు MUD లేదా “మల్టీయూజర్ డంజియన్” అని పిలిచే టెక్స్ట్-ఆధారిత ఫాంటసీ అడ్వెంచర్ గేమ్‌ను రాశారు. ARPANET ద్వారా MUDకి కనెక్ట్ అయిన మొదటి బయటి వినియోగదారులు, ఆన్‌లైన్ గేమింగ్ పుట్టింది.

Read hindi news: hindi.vaartha.com

Read also:

https://vaartha.com/crime-newsthe-mystery-of-the-murder-of-a-sahasra-that-will-not-go-away-for-two-days/hyderabad/533185/

Pooja

రచయిత గురించి

Pooja

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.