📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు హైదరాబాద్‌లో నకిలీ రోలెక్స్ చోరీ… కాంగ్రెస్ MLA రాహుల్ పై అత్యాచార కేసు నమోదు ఢిల్లీ విద్యార్థి ఆత్మహత్య ఇద్దరు కార్మికులు సజీవ దహనం సీపీ సజ్జనార్‌తో సమావేశమైన సినీ ప్రముఖులు పోలీస్ స్టేషన్‌లో భారీ పేలుడు కోల్‌కతాలో భారీ అగ్నిప్రమాదం.. యువకుడి పై కత్తితో దాడి.. 10 మందిని చంపేసిన నర్సు! ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు హైదరాబాద్‌లో నకిలీ రోలెక్స్ చోరీ… కాంగ్రెస్ MLA రాహుల్ పై అత్యాచార కేసు నమోదు ఢిల్లీ విద్యార్థి ఆత్మహత్య ఇద్దరు కార్మికులు సజీవ దహనం సీపీ సజ్జనార్‌తో సమావేశమైన సినీ ప్రముఖులు పోలీస్ స్టేషన్‌లో భారీ పేలుడు కోల్‌కతాలో భారీ అగ్నిప్రమాదం.. యువకుడి పై కత్తితో దాడి.. 10 మందిని చంపేసిన నర్సు!

నౌహీరా షేక్‌‌కు సుప్రీంకోర్టు బిగ్ వార్నింగ్

Author Icon By Vanipushpa
Updated: March 6, 2025 • 11:29 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

పలు స్కీమ్‌ల పేరుతో రూ.వేలకోట్లను డిపాజిట్ల రూపంలో సేకరించి.. మోసగించిన హీరా గ్రూప్ ఎండీ నౌహీరా షేక్‌కు సర్వోన్నత న్యాయస్థానం రెండు ఆప్షన్లు ఇచ్చింది. మూడు నెలల్లోగా డిపాజిటర్ల నుంచి సేకరించిన రూ.25 కోట్లను చెల్లించాలని లేదంటే జైలుకు వెళ్లాల్సి వస్తుందని తేల్చిచెప్పింది. లక్షలాది మంది నుంచి పలు స్కీమ్‌ల పేరుతో రూ.5,600 కోట్లు వసూలుచేశారనేది ప్రధాన ఆరోపణ. ఈ కేసులో బుధవారం నాటి విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. బాదితుల నుంచి సేకరించిన రూ.25 కోట్లను 90 రోజుల్లోగా నౌషెరా షేక్ తిరిగి ఇవ్వకుంటే కస్టడీలోకి తీసుకోవాలని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరెట్ (ఈడీ)ని ఆదేశించింది.


ధర్మాసనం హెచ్చరిక
లొంగిపోయే గడువు పొడిగించిన నవంబర్ 11, 2024 నుంచి కోర్టు వెలువరించిన ఆదేశాలను నిందితురాలు వరుసగా ధిక్కరిస్తున్నారని, ఆమె రూ. 25 కోట్లు చెల్లించాల్సి ఉంటుందని జస్టిస్ జేబీ పార్దివాలా నేతృత్వంలోని సుప్రీంకోర్టు ధర్మాసనం పేర్కొంది. ‘మూడు నెలల్లోగా డిపాజిటర్ల సొమ్ము రూ.25 కోట్లు తిరిగి చెల్లించాలి.. నిందితులకు ఇదే చివరి అవకాశం.. అలా కాకుంటే బెయిల్ ఆటోమేటిక్‌గా రద్దవుతుంది.. ఈడీ జైలుకు పంపుతుంది’ అని ధర్మాసనం స్పష్టం చేసింది. నౌషెరా తరఫున వాదనలు వినిపించిన సీనియర్ లాయర్ కపిల్ సిబల్.. ఆమె వద్ద డబ్బులేదని చెప్పారు. అయితే, షేక్ పేరును ఉన్న అనేక ఆస్తులను అటాచ్ చేసినట్లు ఈడీ పేర్కొంది. కానీ, వేలానికి ఇబ్బందులు లేని ఆస్తుల జాబితాను ఇవ్వాలని ఆమె న్యాయవాది కోరితే వివరాలను మాత్రం వెల్లడించలేదు. తన పేరుతో కేవలం మూడు ఆస్తులే ఉన్నాయని వివరాలు సమర్పించిన షేక్.. వాటిలోని తెలంగాణలోని రెండింటిని ఈడీ వేలం వేయడానికి ఎటువంటి ఇబ్బంది ఉండదు.
నమ్మించి నిలువునా ముంచేశారు
ఇక, హీరా గోల్డ్ కేసులో సీరియస్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్ ఆఫీస్ (SFIO) విచారణ కొనసాగుతోంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక, ఢిల్లీ సహా పలు చోట్ల ఈ కేసులో పెండింగ్‌లో ఉన్నారు. నగలు, బంగారం స్కీమ్‌లు పేరుతో డబ్బులు వసూలు చేసి.. పెట్టుబడికి 36 శాతం డివిడెంట్ ఇస్తామని నమ్మించి నిలువునా ముంచేశారు. ప్రారంభించిన కొత్తలో డివిడెండ్ చెల్లించి.. భారీగా డిపాజిట్లు సేకరించిన తర్వాత బోర్డు తిప్పేశారు. బాధితుల ఫిర్యాదుతో కేసులు నమోదుకాగా.. అక్టోబరు 2018లో నౌషెరా షేక్‌ను అరెస్ట్ చేశారు.

#telugu News Ap News in Telugu Breaking News in Telugu Google News in Telugu Latest News in Telugu nowhera-shaik Paper Telugu News suprem court Telugu News online Telugu News Paper Telugu News Today

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.