Stock Market: భారత్–అమెరికా మధ్య జరగనున్న కీలక వాణిజ్య చర్చల నేపథ్యంలో మంగళవారం దేశీయ స్టాక్ మార్కెట్లు అప్రమత్తంగా కదిలాయి. ఇన్వెస్టర్లు పెద్ద పెట్టుబడులకు దూరంగా ఉండటంతో సూచీలు పరిమిత శ్రేణిలోనే ట్రేడయ్యాయి. ముఖ్యంగా కన్స్యూమర్ డ్యూరబుల్స్, రియల్టీ రంగాల్లో అమ్మకాల ఒత్తిడి కనిపించింది. ఈ జాగ్రత్త ధోరణి వల్ల మార్కెట్లు స్వల్ప నష్టాలతో ముగిశాయి.
Read also: Alert to Clients: ఇకపై ఆధార్ ఓటీపీ చెల్లదు.. RBI కొత్త రూల్స్ ఇవే!

stock markets closed with losses.
స్వల్ప నష్టాలతో ముగిసిన సెన్సెక్స్, నిఫ్టీ సూచీలు
ట్రేడింగ్ ముగిసే సమయానికి బీఎస్ఈ సెన్సెక్స్ 250.48 పాయింట్లు తగ్గి 83,627.69 వద్ద స్థిరపడింది. అదే సమయంలో ఎన్ఎస్ఈ నిఫ్టీ 57.95 పాయింట్లు నష్టపోయి 25,732.30 వద్ద ముగిసింది. భారత్, అమెరికా మధ్య వాణిజ్య చర్చలు జరగనున్నట్లు భారత రాయబారి ప్రకటించడంతో దలాల్ స్ట్రీట్లో ఆచితూచి వ్యవహరించే వాతావరణం నెలకొంది.
కొన్ని లాభాలు, కొన్ని నష్టాలు
సెన్సెక్స్లో (sensex) ఎటర్నల్, టెక్ మహీంద్రా, లాభాల్లో కదిలి సూచీలకు కొంత మద్దతు ఇచ్చాయి. అయితే ట్రెంట్, లార్సెన్ అండ్ టూబ్రో (L&T), ఇండిగో వంటి షేర్లలో నష్టాలు నమోదయ్యాయి. రంగాల వారీగా చూస్తే కన్స్యూమర్ డ్యూరబుల్స్, రియల్టీ సూచీలు నష్టాల్లో ఉండగా, పీఎస్యూ బ్యాంకింగ్, మీడియా రంగాల్లో కొనుగోళ్ల ఆసక్తి కనిపించింది.
నిరోధ స్థాయిలపై నిపుణుల అంచనాలు
మార్కెట్ నిపుణుల అంచనాల ప్రకారం నిఫ్టీకి 25,650–25,600 స్థాయిలో తక్షణ మద్దతు ఉంది. ఈ స్థాయిని కోల్పోతే 25,500 వరకు దిగజారే అవకాశం ఉందని చెబుతున్నారు. పైవైపు 25,800–25,900 వద్ద నిరోధం ఎదురవుతుందని, ఆ స్థాయిని దాటితేనే 26,100 దిశగా మార్కెట్ కదిలే అవకాశం ఉందని విశ్లేషిస్తున్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: