📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత

Prime Minister: నా పక్కన వీరిద్దరినీ చూసి కొందరికి ఈ రోజు నిద్ర పట్టదు: మోదీ

Author Icon By Anusha
Updated: May 2, 2025 • 5:42 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేడు కేరళలో పర్యటించారు. ముఖ్యంగా తిరువనంతపురం సమీపంలో ఏర్పాటు చేసిన విఝింజం ఇంటర్నేషనల్ డీప్ వాటర్ మల్టీపర్పస్ సీపోర్టును ప్రారంభించారు. అయితే ఈ కార్యక్రమానికి కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ సహా కాంగ్రెస్ సీనియర్ నేత, ఎంపీ శశి థరూర్ హాజరయ్యారు. అక్కడే మోదీ వీరి పక్కన నిల్చొని షాకింగ్ కామెంట్లు చేశారు. వీరిద్దరూ తన పక్కన ఉండడం చూసి కొందరు నేతలకు ఈరోజు నిద్ర పట్టదని వివరించారు. ఇలా పరోక్షంగా కాంగ్రెస్‌పై వ్యంగ్యాస్త్రాలు విసరగా ఈ కామెంట్లు వైరల్ అయ్యాయి. 

పూర్తి వివరాలు

శుక్రవారం రోజు ఉదయమే ఆయన తిరువనంతపురం సమీపంలో రూ.8,900 కోట్ల వ్యయంతో ఏర్పాటు చేసిన విఝింజం ఇంటర్నేషనల్ డీప్ వాటర్ మల్టీపర్పస్ సీపోర్టును ప్రారంభించారు. అయితే ఈ కార్యక్రమానికి కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్, ప్రముఖ వ్యాపారవేత్త గౌతమ్ అదానీ, కాంగ్రెస్ సీనియర్ నేత, తిరువనంతపురం ఎంపీ శశి థరూర్ హాజరయ్యారు. పోర్టు ప్రారంభం తర్వాత వీరంతా ఒకే వేదిక మీదకు వచ్చి ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. ముఖ్యంగా ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడుతూ ఈ సీపోర్టుతో కేరళలో ఆర్థిక స్థిరత్వం ఏర్పడుతుందని అన్నారు.అలాగే అంతర్జాతీయ వాణిజ్యం, షిప్పింగ్‌లో భారత పాత్రను గణనీయంగా మారుస్తుందని అశాభావం వ్యక్తం చేశారు. అనంతరం వేదికపై తన పక్కన నిల్చున్న సీఎం పినరయి విజయన్, కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్‌ను ఉద్దేశించి మాట్లాడుతూ షాకింగ్ కామెంట్లు చేశారు. ఈరోజు తన పక్క శశిథరూర్ ఉన్నారని ఈ కార్యక్రమం కొంత మందికి నిద్రలేని రాత్రిని మిగులుస్తుందన్నారు. ఈ సందేశం ఎక్కడికి వెళ్లాలో అక్కడికి వెళ్లిపోయిందని పరోక్షంగా కాంగ్రెస్‌పై వ్యంగ్యాస్త్రాలు విసిరారు. ఈయన ఇలా ప్రత్యేకించి కాంగ్రెస్ గురించి మాట్లాడడానికి చాలానే కారణాలు ఉన్నాయి.

ఈమధ్య కాలంలో కాంగ్రెస్ అధినాయకత్వంతో శశి థరూర్ కు పొసగడం లేదు. గత కొన్ని నెలలుగా ఈయన తన సొంత పార్టీ అయిన కాంగ్రెస్ పైనే తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ మధ్యే ఆయన ఓ కేంద్ర మంత్రితో సెల్ఫీ దిగగా శశి థరూర్ పార్టీ మారబోతున్నట్లు ప్రచారం మొదలైంది. దీని తర్వాత ఆయన భారత విదేశాంగ విధానాన్ని ప్రశంసిస్తూ చేసిన కామెంట్లతో దీనికి మరింత బలం చేకూరింది. ఇలాంటి సమయంలోనే మోదీ కేరళకు రావడం శశి థరూర్‌యే నేరుగా వెళ్లి స్వాగతించడంతో ఆయన కచ్చితంగా పార్టీ మారబోతున్నారని సంకేతాలు వినిపిస్తున్నాయి. శశి థరూర్ తాజాగా ఎక్స్ వేదికగా ఓ పోస్ట్ పెట్టారు. అందులో ఢిల్లీ విమానాశ్రయంలో విమానాల ఆలస్యం ఉన్నప్పటికీ సమయానికి తిరువనంతపురం చేరుకోగలిగానని తన నియోజక వర్గానికి వచ్చిన ప్రధాని మోదీని సాదరనంగా స్వాగతించానని రాసుకొచ్చారు.

Read Also: Swiggy gold: Z+ సెక్యూరిటీతో ఇంటికే బంగారం డెలివరీ చేసిన స్విగ్గీ

#KeralaNews #narendramodi #PinarayiVijayan #ShashiTharoor #Thiruvananthapuram #VizhinjamPort Ap News in Telugu Breaking News in Telugu Google News in Telugu Latest News in Telugu Paper Telugu News Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today Today news

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.