📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా దేశవాళీ క్రికెట్‌కు కోహ్లీ బీసీసీఐ నేడు కీలక సమావేశం? సచిన్ రికార్డు బీట్ చేసిన విరాట్.. రోహిత్ శర్మ రికార్డు బ్రేక్ చేసిన ఆయుశ్ మాత్రే హైదరాబాద్ కు మెస్సీ.. మహిళల ప్రీమియర్ లీగ్ మెగా వేలం రోహిత్ శర్మ అరుదైన ఘనత రెండోసారి ప్రపంచ ఛాంపియన్‌గా భారత్ నిఖత్ జరీన్ కు స్వర్ణం రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా దేశవాళీ క్రికెట్‌కు కోహ్లీ బీసీసీఐ నేడు కీలక సమావేశం? సచిన్ రికార్డు బీట్ చేసిన విరాట్.. రోహిత్ శర్మ రికార్డు బ్రేక్ చేసిన ఆయుశ్ మాత్రే హైదరాబాద్ కు మెస్సీ.. మహిళల ప్రీమియర్ లీగ్ మెగా వేలం రోహిత్ శర్మ అరుదైన ఘనత రెండోసారి ప్రపంచ ఛాంపియన్‌గా భారత్ నిఖత్ జరీన్ కు స్వర్ణం

Shreyas Iyer: ఐపిఎల్ లో చరిత్ర సృష్టించిన శ్రేయస్ అయ్యర్

Author Icon By Anusha
Updated: May 27, 2025 • 12:40 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఐపీఎల్‌ 2025 సీజన్‌లో భాగంగా ముంబై ఇండియన్స్‌తో జరిగిన తమ ఆఖరి లీగ్ మ్యాచ్‌లో సమష్టిగా రాణించిన పంజాబ్ కింగ్స్ 7 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ గెలుపుతో 19 పాయింట్లను ఖాతాలో వేసుకున్న పంజాబ్ కింగ్స్ అగ్రస్థానంలో నిలిచి క్వాలిఫయర్-1కు అర్హత సాధించింది.ఈ మ్యాచ్ లోనేపంజాబ్ కింగ్స్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్(Shreyas Iyer) చరిత్ర సృష్టించాడు. 18 ఏళ్ల ఐపీఎల్ చరిత్రలోనే మూడు జట్లను ప్లే ఆఫ్స్‌కు చేర్చడమే కాకుండా క్వాలిఫయర్-1‌కు తీసుకెళ్లిన తొలి కెప్టెన్‌గా నిలిచాడు. గతంలో ఢిల్లీ క్యాపిటల్స్‌కు సారథ్యం వహించిన అతను ఆ జట్టును టాప్ ప్లేస్‌లో నిలిపి క్వాలిఫయర్-1కు తీసుకెళ్లాడు. గతేడాది కేకేఆర్ కెప్టెన్‌గా ఆ జట్టును ఫైనల్‌కు తీసుకెళ్లడమే కాకుండా టైటిల్ కూడా అందించాడు. తాజాగా పంజాబ్ కింగ్స్‌ను క్వాలిఫయర్-1కు తీసుకెళ్లాడు. ఈ సీజన్‌లో పంజాబ్‌ను ఫైనల్‌కు తీసుకెళ్తే మూడు జట్లను ఫైనల్ చేర్చిన కెప్టెన్‌గా కూడా నయా చరిత్రను లిఖించనున్నాడు. 18 ఏళ్ల ఐపీఎల్ చరిత్రలో మరే కెప్టెన్‌ కూడా ఈ ఫీట్ సాధించలేదు. శ్రేయస్ అయ్యర్ సూపర్ కెప్టెన్సీతో 11 ఏళ్ల తర్వాత పంజాబ్ కింగ్స్ ప్లే ఆఫ్స్ చేరడమే కాకుండా క్వాలిఫయర్-1కు అర్హత సాధించింది.

బౌలర్లలో

ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 184 పరుగులు చేసింది. మరోసారి సూర్యకుమార్ యాదవ్(39 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్స్‌లతో 57) హాఫ్ సెంచరీతో ఆదుకోగా హార్దిక్ పాండ్యా(15 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్‌లతో 26), నమన్ ధిర్(12 బంతుల్లో 2 సిక్స్‌లతో 20) దూకుడుగా ఆడారు. పంజాబ్ బౌలర్లలో అర్ష్‌దీప్ సింగ్, మార్కో జాన్సెన్, విజయ్‌కుమార్ వైశాఖ్ రెండేసి వికెట్లు తీయగా హర్‌ప్రీత్ బ్రార్ ఓ వికెట్ పడగొట్టాడు.

Shreyas Iyer: ఐపిఎల్ లో చరిత్ర సృష్టించిన శ్రేయస్ అయ్యర్

పరుగులు

అనంతరం పంజాబ్ కింగ్స్ 18.3 ఓవర్లలో 3 వికెట్లకు 187 పరుగులు చేసి సునాయస విజయాన్నందుకుంది. ప్రియాన్ష్ ఆర్య(35 బంతుల్లో 9 ఫోర్లు, 2 సిక్స్‌లతో 62), జోష్ ఇంగ్లీస్(42 బంతుల్లో 9 ఫోర్లు, 3 సిక్స్‌లతో 73) హాఫ్ సెంచరీలతో రాణించారు. మిచెల్ సాంట్నర్(2/41) రెండు వికెట్లు తీయగా జస్‌ప్రీత్ బుమ్రా(Jasprit Bumrah) ఓ వికెట్ పడగొట్టాడు.

Read Also : Country Cricket League: కేవలం 5.4 ఓవర్లలోనే కుప్పకూలిన రిచ్‌మండ్ సీసీ

#CaptaincyMasterclass #IPL2025 #IPLRecords #PunjabKings #Qualifier1 #ShreyasIyer Ap News in Telugu Breaking News in Telugu Google News in Telugu Latest News in Telugu Paper Telugu News Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today Today news

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.