📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

మన్యం జిల్లాలో ఏనుగుల బీభత్సం పవన్ ను హెచ్చరించిన కేఏ పాల్ బంగాళాఖాతంలో వాయుగుండం .. వర్షాలు కురిసే అవకాశం రైతులకు నేరుగా కొత్త పాస్ పుస్తకాలు ఈ నెల 12 నుంచి ఆర్టీసీలో అద్దె బస్సుల సమ్మె? పూరీ – తిరుపతి రైలులో మంటలు సంక్రాంతికి ఆర్టీసి ప్రత్యేక బస్సులు పరకామణి కేసులో ఊహించని పరిణామం! ఇంటర్ పరీక్షా కేంద్రాల్లో సీసీ కెమెరాలు | బోర్డు కీలక ఆదేశం ట్రావెల్స్ బస్సులో మంటలు మన్యం జిల్లాలో ఏనుగుల బీభత్సం పవన్ ను హెచ్చరించిన కేఏ పాల్ బంగాళాఖాతంలో వాయుగుండం .. వర్షాలు కురిసే అవకాశం రైతులకు నేరుగా కొత్త పాస్ పుస్తకాలు ఈ నెల 12 నుంచి ఆర్టీసీలో అద్దె బస్సుల సమ్మె? పూరీ – తిరుపతి రైలులో మంటలు సంక్రాంతికి ఆర్టీసి ప్రత్యేక బస్సులు పరకామణి కేసులో ఊహించని పరిణామం! ఇంటర్ పరీక్షా కేంద్రాల్లో సీసీ కెమెరాలు | బోర్డు కీలక ఆదేశం ట్రావెల్స్ బస్సులో మంటలు

బెంగళూరులో తెలుగు ఐటీ ఉద్యోగులకు షాక్

Author Icon By Vanipushpa
Updated: February 5, 2025 • 2:59 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ప్రపంచములో ఎక్కడ చూసినా ఒకటే మాట ఉద్యోగులకు భద్రత లేదు. బెంగళూరులోని ఎక్కువ మంది నివసించే వారిలో ఐటీ ఉద్యోగులది సింహభాగం. ఇక్కడ రెండు తెలుగు రాష్ట్రాల నుంచి ప్రజల సంఖ్య కూడా ఎక్కువగానే ఉంటుంది. ఈ క్రమంలో గడచిన కొన్ని నెలలుగా కర్ణాటక వ్యాప్తంగా కన్నడిగ నినాదం వినిపిస్తోంది. స్థానికులకే ఉద్యోగాల్లో, ఉపాధి అవకాశాల్లో అగ్రస్థానం కల్పించాలని వారు కోరుకుంటున్నారు. దీనికి అనుగుణంగా కర్ణాటక ప్రభుత్వం సైతం ఒక బిల్లును తీసుకొచ్చింది. అయితే పరిశ్రమ వర్గాల నుంచి తీవ్ర వ్యతిరేకత రావటంతో దానిని కొన్ని గంటల్లోనే సిద్ధరామయ్య ప్రభుత్వం వెనక్కి తీసుకుంది. ఇది మరువక మునుపే గతవారం సోషల్ మీడియాలో కన్నడిగులకు ఉద్యోగాల నియామకంలో ప్రాథాన్యత ఇవ్వాలంటూ ట్వీట్ సంచలనం రేపింది.

కర్ణాటకలో యువత ఉద్యోగాల కోసం రోడ్లపై యుద్ధం చేయకుండా.. నియమించుకునే స్థాయిలో ఉన్న కీలక ఉద్యోగులు, వ్యవస్థాపకులు పొరుగువారిపై కనికరం చూపకుండా కన్నడిగులకే ప్రాధాన్యం ఇవ్వాలని ఒక వ్యక్తి చేసిన ట్వీట్ పెద్ద చర్చకు దారితీసింది. దీని తర్వాత తాజాగా ఇదే అంశంపై మరోసారి పెద్ద చర్చ కొనసాగుతోంది. ప్రస్తుతం కెనడాలో నివసిస్తున్న ఉత్తర భారతదేశానికి చెందిన ఒక వ్యక్తి సోషల్ మీడియాలో దీనిపై చేసిన వీడియో వైరల్ అవుతోంది. కర్ణాటకలో జరుగుతున్న భాష, సాంస్కృతిక చర్చలో కన్నడిగులకు తన మద్దతును అందించాడు. కర్ణాటక ఈ విషయంలో సరైన వైపున వాదిస్తోందని అన్నాడు. ప్రస్తుతం కర్ణాటక ప్రజలపై చాలా ద్వేషం పెరుగుతోందని, అయితే వారి భూమి, వారి సంస్కృతి, వారి వారసత్వం, వారి గుర్తింపును కాపాడుకునే హక్కు వారికి ఎల్లప్పుడూ ఉంటుందని సదరు వ్యక్తి ట్విట్టర్ ఖాతాలో వీడియో పోస్ట్ చేశాడు.

#telugu News Ap News in Telugu Bangalore Breaking News in Telugu Google News in Telugu it jobs Latest News in Telugu Paper Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today Today news

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.