గుజరాత్లోని పోర్బందర్ నుంచి సొమాలియా వెళ్లే నౌకలో మంటలు చెలరేగాయి. (Ship Catches Fire) సుభాష్ నగర్ జెట్టీ వద్ద లంగరు వేసిన కార్గో షిప్ (Cargo ship)లో సోమవారం ఉదయం మంటలు వ్యాపించాయి. దీంతో మూడు అగ్నిమాపక వాహనాలు అక్కడకు చేరుకున్నాయి. నౌకలో చెలరేగిన మంటలను ఆర్పేందుకు ఫైర్ సిబ్బంది ప్రయత్నించారు. కాగా, జామ్నగర్లోని హెచ్ఆర్ఎం అండ్ సన్స్ కంపెనీకి చెందిన ఈ నౌకలో బియ్యం బస్తాలు లోడ్ చేశారు. ఈ బస్తాలకు మంటలు వ్యాపించడంతో తీవ్రమయ్యాయి. ఈ నేపథ్యంలో ఆ కార్గో షిప్ను సముద్రంలోకి లాక్కెళ్లారు.

మరోవైపు బియ్యం లోడ్ ఉన్న ఆ నౌక (Ship Catches Fire)సొమాలియాలోని బొసాసోకు వెళ్లాల్సి ఉన్నదని అధికారులు తెలిపారు. అందులో మంటలు చెలరేగిన సంఘటనపై దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు. మరోవైపు ఆ నౌక (Ship Catches Fire)నుంచి మంటలు ఎగసిపడుతున్న వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.మంటలకు విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణమై ఉండొచ్చని అనుమానిస్తున్నారు. ఘటనా స్థలాన్ని పరిశీలించిన అనంతరం పూర్తి వివరాలు వెల్లడించనున్నారు. పోర్ట్ అథారిటీ, కోస్ట్ గార్డ్, పోలీసులు ఈ ఘటనపై సంయుక్త దర్యాప్తు ప్రారంభించారు.
సొమాలియా చరిత్ర ?
సోమాలియాను కనీసం పాలియోలిథికు కాలం నుండి మానవ నివాసితప్రాంతంగా ఉందని గుర్తించారు. రాతియుగం కాలంలో, డయాను, హర్జియిసెను సంస్కృతులు ఇక్కడ వృద్ధి చెందాయి. ఆఫ్రికా కొమ్ము (హార్న్ ఆఫ్ ఆఫ్రికా) లోని సోమాలియాలో క్రీ.పూ. 4 వ సహస్రాబ్ది నాటి సమాధులలో లభించిన ఖనన ఆచారాల పురాతన సాక్ష్యాలు లభించాయి. 1909 లో ఉత్తరాన జలేలో ప్రాంతంలో లభించిన రాతి ఉపకరణాలు తూర్పు, పశ్చిమ ప్రాంతాల మధ్య పాలోయోలితికు కాలానికి చెందిన కళాకృతులుగా పురావస్తు విశ్వవిద్యాలయం వర్గీకరించింది.
ఏ కార్గో షిప్లో కాల్పులు జరిపారు?
కర్ణాటకలోని కార్వార్ సమీపంలో ప్రమాదకరమైన అంతర్జాతీయ సముద్ర వస్తువులను రవాణా చేసే MV మెర్స్క్ ఫ్రాంక్ఫర్ట్ కార్గో షిప్లో పెద్ద అగ్నిప్రమాదం సంభవించిన తర్వాత ఇండియన్ కోస్ట్ గార్డ్ (ICG) యొక్క మూడు నౌకలు అగ్నిమాపక ఆపరేషన్ నిర్వహిస్తున్నాయి.
Read hindi news: hindi.vaartha.com
Read Also: