हिन्दी | Epaper
రైలు ఆలస్యమైతే ఉచిత భోజనం, పూర్తి రీఫండ్.. కొత్త లేబర్ కోడ్స్ ఎఫెక్ట్.. కార్పోరేట్ రంగం విలవిల అంతర్జాతీయ కైట్ ఫెస్టివల్‌.. పతంగి ఎగురవేసిన ప్రధాని మోదీ నేటి నుంచి గుజరాత్లో ప్రధాని మోదీ పర్యటన ఈనెల 17న వందే భారత్ స్లీపర్ ప్రారంభం Budget 2026: రికార్డు సృష్టించనున్న నిర్మలా సీతారామన్ LIC లో కొత్త స్కిం .. బెనిఫిట్స్ అదిరిపోయాయి !! మొబైల్ వినియోగదారుల కోసం కొత్త యాప్‌ జనవరి చివర్లో బ్యాంకింగ్ సేవలకు బంద్ జనవరి 27న బ్యాంక్ ఉద్యోగుల సమ్మె రైలు ఆలస్యమైతే ఉచిత భోజనం, పూర్తి రీఫండ్.. కొత్త లేబర్ కోడ్స్ ఎఫెక్ట్.. కార్పోరేట్ రంగం విలవిల అంతర్జాతీయ కైట్ ఫెస్టివల్‌.. పతంగి ఎగురవేసిన ప్రధాని మోదీ నేటి నుంచి గుజరాత్లో ప్రధాని మోదీ పర్యటన ఈనెల 17న వందే భారత్ స్లీపర్ ప్రారంభం Budget 2026: రికార్డు సృష్టించనున్న నిర్మలా సీతారామన్ LIC లో కొత్త స్కిం .. బెనిఫిట్స్ అదిరిపోయాయి !! మొబైల్ వినియోగదారుల కోసం కొత్త యాప్‌ జనవరి చివర్లో బ్యాంకింగ్ సేవలకు బంద్ జనవరి 27న బ్యాంక్ ఉద్యోగుల సమ్మె రైలు ఆలస్యమైతే ఉచిత భోజనం, పూర్తి రీఫండ్.. కొత్త లేబర్ కోడ్స్ ఎఫెక్ట్.. కార్పోరేట్ రంగం విలవిల అంతర్జాతీయ కైట్ ఫెస్టివల్‌.. పతంగి ఎగురవేసిన ప్రధాని మోదీ నేటి నుంచి గుజరాత్లో ప్రధాని మోదీ పర్యటన ఈనెల 17న వందే భారత్ స్లీపర్ ప్రారంభం Budget 2026: రికార్డు సృష్టించనున్న నిర్మలా సీతారామన్ LIC లో కొత్త స్కిం .. బెనిఫిట్స్ అదిరిపోయాయి !! మొబైల్ వినియోగదారుల కోసం కొత్త యాప్‌ జనవరి చివర్లో బ్యాంకింగ్ సేవలకు బంద్ జనవరి 27న బ్యాంక్ ఉద్యోగుల సమ్మె రైలు ఆలస్యమైతే ఉచిత భోజనం, పూర్తి రీఫండ్.. కొత్త లేబర్ కోడ్స్ ఎఫెక్ట్.. కార్పోరేట్ రంగం విలవిల అంతర్జాతీయ కైట్ ఫెస్టివల్‌.. పతంగి ఎగురవేసిన ప్రధాని మోదీ నేటి నుంచి గుజరాత్లో ప్రధాని మోదీ పర్యటన ఈనెల 17న వందే భారత్ స్లీపర్ ప్రారంభం Budget 2026: రికార్డు సృష్టించనున్న నిర్మలా సీతారామన్ LIC లో కొత్త స్కిం .. బెనిఫిట్స్ అదిరిపోయాయి !! మొబైల్ వినియోగదారుల కోసం కొత్త యాప్‌ జనవరి చివర్లో బ్యాంకింగ్ సేవలకు బంద్ జనవరి 27న బ్యాంక్ ఉద్యోగుల సమ్మె

Bengaluru : కన్నడ భాష లో మాట్లాడేందుకు నిరాకరించిన ఎస్ బిఐ మేనేజర్..బదిలీ వేటు

Anusha
Bengaluru : కన్నడ భాష లో మాట్లాడేందుకు నిరాకరించిన ఎస్ బిఐ మేనేజర్..బదిలీ వేటు

కర్ణాటకలోని బెంగళూరు శివార్లలో ఉన్న సూర్యనగర ఎస్‌బీఐ శాఖలో చోటుచేసుకున్న భాషా వివాదం రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర చర్చకు దారితీసింది.స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు చెందిన ఓ మేనేజ‌ర్ క‌న్న‌డ భాష‌లో మాట్లాడేందుకు నిరాక‌రించింది.ఓ కస్టమర్ ఆ బ్రాంచ్ మేనేజర్‌ను కన్నడలో మాట్లాడాలని కోరగా ఆమె అందుకు అంగీకరించలేదు. తాను కన్నడలో కానీ హిందీలో కానీ అస్సలే మాట్లాడనని చెబుతూ కేవలం ఇంగ్లీషులోనే సమాధానం ఇచ్చారు. ఇలా ఈ ఇద్దరి మధ్య గొడవ జరగ్గా ఈ వీడియో కాస్తా నెట్టింట వైరల్ అయింది. దీంతో అనేక మంది మేనేజర్‌(Manager)పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో ఎస్‌బీఐ సదరు మేనేజర్‌ను బదిలీ చేసింది.

కస్టమర్‌

బెంగళూరులోని సూర్యనగరలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మేనేజర్ కస్టమర్‌తో గొడవ పడ్డారు.ఏం చేసుకుంటావో చేసుకోపో అంటూ వ్యాఖ్యానించింది. ఇది కర్ణాటక కాబట్టి కన్నడనే మాట్లాడాలని కస్టమర్ చెప్పగా ఇది ఇండియా నాకు నచ్చిన భాషలో మాట్లాడతానంటూ మేనేజర్ దురుసుగా సమాధానం చెప్పారు. ఇలా వీరిద్దరి మధ్య తీవ్ర వివాదం సాగగా అక్కడే ఉన్న కొందరు దీన్ని వీడియోగా తీసి సోషల్ మీడియా(Social media)లో పెట్టారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతుండగా అంతా సదరు మేనేజర్‌పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.కానీ ఆమె చేసిన వ్యాఖ్యలు, కస్టమర్‌తో మాట్లాడిన విధానం చూసి కర్ణాటకలోని పలు ప్రాంతాల్లో భాషా సంఘాలు తీవ్ర నిరసన వ్యక్తం చేశాయి. కన్నడ భాషపై బ్యాంక్ మేనేజర్ తీరును వ్యతిరేకిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు చేపడుతున్నట్లు కర్ణాటక రక్షణ వేదికే సంఘం ప్రకటించింది. ఎస్‌బీఐ ఉద్యోగులు కస్టమర్లను పదే పేద అవమానిస్తున్నారని స్థానిక భాషలోనే ప్రాథమిక సేవలను అందించడంలో విఫలం అవుతున్నారని ఆరోపించింది.

అధికారులు

అయితే తాజాగా ఈ వివాదంపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్ధరామయ్య(Siddaramaiah) స్పందించారు.బ్యాంక్ మేనేజర్ పౌరులతో ప్రవర్తించిన తీరు సైరనది కాదని చెప్పారు. అలాగే స్థానిక భాషను బ్యాంకు ఉద్యోగులు అందరూ గౌరవించాలని కస్టమర్లను గౌరవిస్తూ స్థానిక భాషలోనే మాట్లాడే ప్రయత్నం చేయాలన్నారు. అలాగే సూర్య నగరలో కన్నడ మాట్లాడడానికి నిరాకరించిన ఎస్‌బీఐ మేనేజర్‌ను ఆ సంస్థ బదిలీ చేసిందని తెలిపారు. ఇంతటితో ఈ సమస్య సర్దుమణిగిందని తాము భావిస్తున్నట్లు పేర్కొన్నారు. అలాగే ఇలాంటి ఘటనలు మళ్లీ జరగకుండా ఉండేలా అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు. దేశంలోని అన్ని బ్యాంకుల సిబ్బందికి ఆయా ప్రాంతాల సంస్కృతి, భాష వంటి విషయాల్లో శిక్షణ ఇవ్వాలని కేంద్ర ఆర్థిక సేవల విభాగాన్ని కోరారు. భాషా వివాదం కొనసాగుతున్న వేళ ఇలాంటివి జరిగితే ఉద్రిక్తతలు మరింత పెరిగే అవకాశం ఉందని సీఎం సిద్ధరామయ్య చెప్పుకొచ్చారు.

Read Also: Stock Market: లాభాల్లో స్టాక్ మార్కెట్లు

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870