Latest Telugu news : Sam Pitroda – పాకిస్థాన్‌ను పొగుడుతూ కొత్త వివాదానికి తెరలేపిన సామ్‌ పిట్రోడా

Read Time:  1 min
Sam Pitroda - పాకిస్థాన్‌ను పొగుడుతూ కొత్త వివాదానికి తెరలేపిన సామ్‌ పిట్రోడా
Sam Pitroda - పాకిస్థాన్‌ను పొగుడుతూ కొత్త వివాదానికి తెరలేపిన సామ్‌ పిట్రోడా
FONT SIZE
GET APP

ఇండియన్ ఓవర్సీస్‌ కాంగ్రెస్ చీఫ్‌ సామ్‌ పిట్రోడా (Sam Pitroda) మరో కొత్త వివాదానికి తెరలేపారు. ఇటీవల దాయాది దేశంలో పర్యటించిన ఆయన.. పాకిస్థాన్‌ (Pakistan) పర్యటనలో తనకు సొంత ఇంట్లో ఉన్నట్టే అనిపించిందని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు రాజకీయంగా దుమారం రేపాయి. పాకిస్థాన్‌ విషయంలో కాంగ్రెస్‌ పార్టీ ఎప్పుడూ సానుకూల వైఖరి కనబరుస్తుందని బీజేపీ విమర్శించింది.

Sam Pitroda - పాకిస్థాన్‌ను పొగుడుతూ కొత్త వివాదానికి తెరలేపిన సామ్‌ పిట్రోడా
Sam Pitroda – పాకిస్థాన్‌ను పొగుడుతూ కొత్త వివాదానికి తెరలేపిన సామ్‌ పిట్రోడా

తాజాగా ఫారిన్‌ పాలసీపై మాట్లాడిన సామ్‌ పిట్రోడా (Sam Pitroda) పొరుగుదేశాలైన పాకిస్థాన్‌, బంగ్లాదేశ్‌, నేపాల్‌లతో సంబంధాలు మెరుగుపర్చుకోవడానికి భారత్‌ ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. ఈ సందర్భంగా ఆయా దేశాల్లో పర్యటించినప్పుడు తన వ్యక్తిగత అనుభవాలను గురించి ఆయన పంచుకున్నారు. ‘నేను పాకిస్థాన్‌కు వెళ్లాను. కచ్చితంగా ఈ విషయం మీకు చెప్పాలి. అక్కడ నేను సొంత ఇంట్లో ఉన్నట్టు అనుభూతి చెందాను. నేను బంగ్లాదేశ్‌కు వెళ్లాను. నేపాల్‌కు వెళ్లాను. అక్కడ కూడా ఇంట్లో ఉన్న అనుభూతే కలిగింది’ అని వ్యాఖ్యానించారు. భారత ప్రజల జీన్స్‌, ఆయా దేశాల ప్రజల జీన్స్‌ ఒకటేనని, ఈ అన్ని దేశాల మధ్య దగ్గరి సంబంధాల కోసం సాంస్కృతిక సారూప్యతలు కూడా ఉన్నాయని సామ్‌ పిట్రోడా వ్యాఖ్యానించారు. అయితే ఉగ్రవాదం, హింస లాంటి కొన్ని సవాళ్లు కూడా ఉన్నాయని అంగీకరించారు. అయితే పాకిస్థాన్‌ను పొగుడుతూ పిట్రోడా (Sam Pitroda) చేసిన వ్యాఖ్యలను బీజేపీ తీవ్రంగా తప్పుపడుతోంది. ఇందులో ఆశ్చర్యమేమీ లేదని కాంగ్రెస్‌ మొదటి నుంచి పాకిస్థాన్‌పట్ల సానుకూల వైఖరే కనబరుస్తోందని విమర్శించింది.

సామ్ పిట్రోడా గురించి ?

సామ్ పిట్రోడా (జననం, నవంబర్ 16, 1942) గా ప్రసిద్ధి చెందిన సత్యనారాయణ గంగారాం పిట్రోడా ఒక భారతీయ అధికారి, టెలికమ్యూనికేషన్ ఇంజనీర్ మరియు వ్యవస్థాపకుడు . ఆయన తూర్పు భారత రాష్ట్రమైన ఒడిశాలోని టిట్లాగఢ్‌లో గుజరాతీ కుటుంబంలో జన్మించారు.

సామ్ పిట్రోడా ఎక్కడ ఉన్నారు?

ఆయన 1964 నుండి ఇల్లినాయిస్‌లోని చికాగోలో తన భార్య మరియు ఇద్దరు పిల్లలతో పాటు ఢిల్లీలో కూడా నివసిస్తున్నారు. 1987లో ప్రధానమంత్రి రాజీవ్ గాంధీకి సలహాదారుగా పనిచేసిన కాలంలో, పిట్రోడా టెలికమ్యూనికేషన్స్, నీరు, అక్షరాస్యత, రోగనిరోధకత, పాడి మరియు నూనెగింజలకు సంబంధించిన ఆరు సాంకేతిక మిషన్లకు నాయకత్వం వహించారు.

Read hindi news: hindi.vaartha.com

Read Also:

https://vaartha.com/bihar-elections-nda-to-contest-against-you-or-me-mahaghat-bandhan/national/550254/

Sudha

రచయిత గురించి

Sudha

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.