हिन्दी | Epaper
EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత

Robert Vadra: భూ కుంభకోణం కేసులో రాబర్ట్ వాద్రాకు షాక్

Vanipushpa
Robert Vadra: భూ కుంభకోణం కేసులో రాబర్ట్ వాద్రాకు షాక్

కాంగ్రెస్ పార్టీ ఎంపీ ప్రియాంక గాంధీ(Priyanka Gandhi) భర్త, ప్రముఖ వ్యాపారవేత్త రాబర్ట్ వాద్రా(Robert Vadra)కు షికోహ్‌పూర్ భూ ఒప్పందాల కేసుకు సంబంధించి ఢిల్లీ కోర్టు(Delhi Court) నోటీసులు జారీ చేసింది. ఈ వ్యవహారంలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దాఖలు చేసిన ఛార్జిషీట్‌ను రౌస్ అవెన్యూ కోర్టు శనివారం విచారణకు స్వీకరించింది. ఈ మనీలాండరింగ్ కేసులో రాబర్ట్ వాద్రాతో పాటు మొత్తం 11 మందికి కోర్టు నోటీసులు పంపింది. తదుపరి విచారణను ఆగస్టు 28వ తేదీకి వాయిదా వేసింది. ఆ రోజున వాద్రా తన వాదనలను కోర్టు ముందు వినిపించాల్సి ఉంటుంది.

Robert Vadra: భూ కుంభకోణం కేసులో రాబర్ట్ వాద్రాకు షాక్
Robert Vadra: భూ కుంభకోణం కేసులో రాబర్ట్ వాద్రాకు షాక్

రాబర్ట్ వాద్రా సహా పలువురిపై ఈడీ ఛార్జిషీట్ దాఖలు
గురుగ్రామ్‌లోని షికోహ్‌పూర్ గ్రామంలో 3.53 ఎకరాల భూమిని అక్రమ మార్గాల్లో కొనుగోలు చేశారనే ఆరోపణలపై రాబర్ట్ వాద్రా సహా పలువురిపై ఈడీ ఛార్జిషీట్ దాఖలు చేసింది. ఈ లావాదేవీల ద్వారా వచ్చిన నేరపూరిత ఆదాయాన్ని వాద్రా నియంత్రణలో ఉన్న పలు కంపెనీల ద్వారా మళ్లించినట్లు దర్యాప్తు సంస్థ ఆరోపిస్తోంది. ఈ కేసు విచారణలో భాగంగా, వాద్రాకు చెందిన మెసర్స్ స్కై లైట్ హాస్పిటాలిటీ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీతో పాటు ఇతర ఆస్తులను ఈడీ ఇప్పటికే అటాచ్ చేసింది. వాటి మొత్తం విలువ రూ. 37.64 కోట్లుగా పేర్కొంది.
తీవ్ర వివాదానికి దారితీసిన భూమి
ఈ కేసుకు మూలం 2008లో గురుగ్రామ్ పోలీసులు నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్. మెసర్స్ ఓంకారేశ్వర్ ప్రాపర్టీస్ ప్రైవేట్ లిమిటెడ్ నుంచి వాద్రా కంపెనీ తప్పుడు ధ్రువపత్రాలతో రూ. 7.5 కోట్లకు భూమిని కొనుగోలు చేసిందని పోలీసులు కేసు నమోదు చేశారు. ఆ తర్వాత 2012లో, అదే భూమిని ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థ డీఎల్‌ఎఫ్‌కు రూ. 58 కోట్లకు విక్రయించడం తీవ్ర వివాదానికి దారితీసింది. అప్పట్లో హర్యానాలో ల్యాండ్ కన్సాలిడేషన్ డైరెక్టర్ జనరల్‌గా ఉన్న అశోక్ ఖేమ్కా, రాష్ట్ర నిబంధనలను ఉల్లంఘించారని పేర్కొంటూ ఈ భూమి మ్యుటేషన్‌ను రద్దు చేశారు. ఆయన నిర్ణయం అప్పట్లో పెద్ద రాజకీయ దుమారాన్ని రేపింది. అప్పటి నుంచి ఈ భూ ఒప్పందంపై న్యాయపరమైన, పరిపాలనపరమైన దర్యాప్తు కొనసాగుతోంది. తాజా పరిణామంతో ఈ కేసు మళ్లీ వార్తల్లోకి ఎక్కింది .

ఈ రాబర్ట్ వాద్రా ఎవరు?
ఆయన వయనాడ్ ఎంపీ ప్రియాంక గాంధీ భర్త. ఆయన భారత మాజీ ప్రధానులు రాజీవ్ గాంధీ మరియు సోనియా గాంధీల అల్లుడు మరియు రాహుల్ గాంధీకి బావమరిది.

Read hindi news: hindi.vaartha.com

Read also

https://vaartha.com/madhya-pradesh-13-year-old-boy-commits-suicide-after-losing-rs-2800-in-online-game/crime/524815/

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

రెపో రేటును 0.25 శాతం తగ్గించిన ఆర్‌బీఐ

రెపో రేటును 0.25 శాతం తగ్గించిన ఆర్‌బీఐ

టోల్ ప్లాజాల వద్ద ఆగాల్సిన అవసరం లేదు..నితిన్ గడ్కరీ

టోల్ ప్లాజాల వద్ద ఆగాల్సిన అవసరం లేదు..నితిన్ గడ్కరీ

హిడ్మా, శంకర్ వి బూటకపు ఎన్ కౌంటర్లే

హిడ్మా, శంకర్ వి బూటకపు ఎన్ కౌంటర్లే

పుతిన్‌కు భగవద్గీతను అందించిన ప్రధాని మోదీ

పుతిన్‌కు భగవద్గీతను అందించిన ప్రధాని మోదీ

130వ రాజ్యాంగ సవరణపై JPC తొలి సమావేశం…

130వ రాజ్యాంగ సవరణపై JPC తొలి సమావేశం…

గుడ్ న్యూస్ భారీగా తగ్గిన బంగారం ధరలు | నేటి రేట్లు…

గుడ్ న్యూస్ భారీగా తగ్గిన బంగారం ధరలు | నేటి రేట్లు…

SIRపై సుప్రీంకోర్టు ఆదేశం: ఇబ్బందుల్లో BLOలను మార్చాలి…

SIRపై సుప్రీంకోర్టు ఆదేశం: ఇబ్బందుల్లో BLOలను మార్చాలి…

నేడు ఇండియా-రష్యా 23వ వార్షిక సమ్మిట్లో పాల్గొనబోతున్న పుతిన్

నేడు ఇండియా-రష్యా 23వ వార్షిక సమ్మిట్లో పాల్గొనబోతున్న పుతిన్

ఇండిగో ఫ్లైట్లు ఇంకా 2–3 రోజులు రద్దు..

ఇండిగో ఫ్లైట్లు ఇంకా 2–3 రోజులు రద్దు..

సిగరెట్ పన్నులు పెరిగేలా కొత్త చట్టం ఆమోదం…

సిగరెట్ పన్నులు పెరిగేలా కొత్త చట్టం ఆమోదం…

ఇండిగోకు షాక్ ఒక్కరోజే 550 ఫ్లైట్లు రద్దు, ఆపరేషన్లు…

ఇండిగోకు షాక్ ఒక్కరోజే 550 ఫ్లైట్లు రద్దు, ఆపరేషన్లు…

పుతిన్ పర్యటన: నేడు ఢిల్లీలో ట్రాఫిక్ ఆంక్షలు, మార్గమళ్లింపులు…

పుతిన్ పర్యటన: నేడు ఢిల్లీలో ట్రాఫిక్ ఆంక్షలు, మార్గమళ్లింపులు…

📢 For Advertisement Booking: 98481 12870