Republic Day 2026: పద్మ పురస్కారాలను ప్రకటించిన కేంద్రం.. 

Read Time:  1 min
Republic Day 2026: పద్మ పురస్కారాలను ప్రకటించిన కేంద్రం.. 
FONT SIZE
GET APP

గణతంత్ర దినోత్సవాన్ని (Republic Day 2026) పురస్కరించుకుని కేంద్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకమైన ‘పద్మ’ పురస్కారాలను ప్రకటించింది. వివిధ రంగాల్లో విశేష సేవలు అందించిన 45 మంది ప్రముఖులకు పద్మశ్రీ అవార్డులు ప్రకటించింది. సైన్స్, వ్యవసాయం, కళలు, సామాజిక సేవా రంగాల్లో విశేష కృషి చేసిన వ్యక్తులకు ఈ జాబితాలో పెద్దపీట వేశారు. ఈ జాబితాలో తెలంగాణకు చెందిన మామిడి రామారెడ్డి (పాడి, పశు సంవర్దక విభాగంలో సేవలు), సీసీఎంబీ శాస్త్రవేత్త డాక్టర్ కుమారస్వామి తంగరాజ్‌‌ (తమిళనాడు)ను జన్యసంబంధిత పరిశోధనలకు గానూ పద్మశ్రీ అవార్డులు వరించాయి.

Read Also: AP: అనంతపురంపై ప్రధాని మోదీ ప్రశంసలు.. హర్షం వ్యక్తం చేసిన చంద్రబాబు

Republic Day 2026: Center announces Padma awards..
Republic Day 2026: Center announces Padma awards..

సర్వత్రా హర్షం

అంకె గౌడ (సాహిత్యం- కర్ణాటక), భగవాన్ దాస్ రాయికర్ (మధ్యప్రదేశ్), ఆర్మిడ్ ఫెర్నాండేజ్ (మహారాష్ట్ర), శ్యామ్ సుందర్, చిరంజిలాల్ యాదవ్ (ఉత్తర్ ప్రదేశ్), రఘుపతి సింగ్, బ్రిజ్‌లాల్ భట్ (జమ్మూ కశ్మీర్), రామచంద్ర, సీమాంచల్ పాత్రో, తేచీ గుబిన్, కేమ్ రాజ్ సుందర్, ఇంద్రజీత్ సింగ్, ఆర్. క్రిష్ణన్, షఫీ షౌక్, పున్‌మూర్తి కాటేసన్,పంజివేల్, కళ్లాష్ చంద్ర, భగవాన్ దాస్ రాయికర్, ఎస్. జే. సుశీలమ్మ, భికల్యా లడక్యా ధిండా, బుధ్రి తాటి (ఛత్తీస్‌గఢ్), చరన్ హెమాంబ్రమ్, ధర్మిక్లాల్ ఛునియలాల్ పాండ్య, గఫ్రూద్దీన్ మేవాత్ జోగి, హల్యా వార్, కైలాష్ చంద్ర పంత్, ఖేమ్ రాజ్ సుందర్యాల్, కొలక్యిల్ దేవకి అమ్మ, మహేంద్ర కుమార్ మిశ్రా,

మిర్ హజ్‌బాయ్ కసంభాయ్, మోహన్ నగర్, నరేశ్ చంద్ర దేవ్ వర్మ, నిలేష్ వినోద్‌చంద్ర మాండ్లేవాలా, నూరుద్దీన్ అహ్మద్, ఒథువర్ తిరుత్తణి స్వామినాథన్, పద్మ గుర్మీత్, పోఖిలా లేక్తిపీ, రఘువీర్ తుకారామ్ ఖేడ్కర్ (మహారాష్ట్ర), రాజసత్పతి కలియప్ప గౌండర్, రామచంద్ర గోడ్బెల్-సునీత్ గోడ్బెల్, సంగ్‌‌యుసంగ్ ఎస్ పొంగేనేర్, షఫీ షౌక్, శ్రీరంగ దేవబ లాడ్, సురేశ్ హనంగ్‌వడి, తాగా రామ్ భీమ్, తైచీ గుబిన్, తిరువరూర్ భక్తవత్సలం, విశ్వ బంధు, యుమ్నామ్ జత్రా సింగ్ తదితరులు ఉన్నారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

Anusha

రచయిత గురించి

Anusha

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.