📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత

Manipur: కొత్త ప్ర‌భుత్వ ఏర్పాటుకు సిద్ధం: బీజేపీ నేత

Author Icon By Vanipushpa
Updated: May 28, 2025 • 5:07 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

వ‌ర్గ పోరు సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్న మ‌ణిపూర్‌(Manipur)లో కొత్త ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు సిద్ధంగా ఉన్న‌ట్లు బీజేపీ నేత తోక్చ‌మ్ రాధేశ్యామ్ సింగ్(Radheshyam) తెలిపారు. ఇవాళ ఈ నేప‌థ్యంలో ఆయ‌న గ‌వ‌ర్న‌ర్ అజ‌య్ కుమార్ భ‌ల్లా(Ajaykumar Balla)ను క‌లిశారు. మ‌రో 9 మంది పార్టీ ఎమ్మెల్యేల‌తో క‌లిసి వెళ్లి రాజ్‌భ‌వ‌న్‌లో గ‌వ‌ర్న‌ర్‌(Governor)తో ప్ర‌భుత్వ ఏర్పాటుపై మాట్లాడారు. ప్ర‌జ‌ల ఆకాంక్ష‌ల మేర‌కు ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు 44 మంది ఎమ్మెల్యేలు సిద్ధంగా ఉన్న‌ట‌ల్ఉ ఆయ‌న చెప్పారు. గ‌వ‌ర్న‌ర్‌కు ఇదే విష‌యాన్ని చేర‌వేసిన‌ట్లు తెలిపారు. ప్ర‌స్తుతం మ‌ణిపూర్‌లో ఫిబ్ర‌వ‌రి నుంచి రాష్ట్ర‌ప‌తి పాల‌న అమ‌లులో ఉన్న విష‌యం తెలిసిందే. అయితే ప్ర‌భుత్వ ఏర్పాటు అంశంలో బీజేపీ కేంద్ర నాయ‌క‌త్వం తుది నిర్ణ‌యం తీసుకుంటుంద‌న్నారు.

Manipur: కొత్త ప్ర‌భుత్వ ఏర్పాటుకు సిద్ధం: బీజేపీ నేత

మైతీలు, కుక్కీల మధ్య గొడవలు
స్పీక‌ర్ స‌త్య‌బ్ర‌త వ్యక్తిగ‌తంగా 44 మంది ఎమ్మెల్యేల‌ను క‌లిశార‌ని, కొత్త ప్ర‌భుత్వ ఏర్పాటును ఎవ‌రూ వ్య‌తిరేకించ‌డం లేద‌న్నారు. ప్ర‌జ‌లు తీవ్ర స‌మ‌స్య‌లు ఎదుర్కొంటున్నార‌ని, గ‌త ప్ర‌భుత్వ పాల‌న‌లో రెండేళ్లు కోవిడ్‌కు వెళ్లాయ‌ని, మ‌రో రెండేళ్లు వ‌ర్గ హింస చోటుచేసుకున్న‌ట్లు చెప్పారు. మైతీలు, కుక్కీలు కొట్టుకోవ‌డంతో.. మాజీ బీజేపీ నేత ఎన్ బిరేన్ సింగ్ త‌న సీఎం ప‌ద‌వికి రాజీనామా చేశారు. రెండు తెగ‌ల మ‌ధ్య జ‌రిగిన పోరును ఆప‌లేక‌పోయిన‌ట్లు ఆయ‌న‌పై ఆరోప‌ణ‌లు ఉన్నాయి.
మ‌ణిపూర్ అసెంబ్లీ 60 మంది ఎమ్మెల్యేలు
మ‌ణిపూర్ అసెంబ్లీ సామ‌ర్థ్యం 60 మంది ఎమ్మెల్యేలు మాత్ర‌మే. ప్ర‌స్తుతం ఓ ఎమ్మెల్యే మ‌ర‌ణించ‌డం వ‌ల్ల 59 మాత్ర‌మే ఉన్నారు. బీజేపీ కూట‌మిలో 32 మంది మైయితీ తెగ‌ ఎమ్మెల్యేలు, ముగ్గురు మ‌ణిపురి ముస్లిం ఎమ్మెల్యేలు, 9 మంది నాగా వ‌ర్గ ఎమ్మెల్యేలు ఉన్నారు. వీరి మొత్తం సంఖ్య 44గా ఉంది. ఇక కాంగ్రెస్ పార్టీలో అయిదుగురు ఎమ్మెల్యేలు ఉన్నారు. వారంతా మైయితీ తెగువ‌కు చెందిన‌వారే.

Read Also: Visa Free: భారతీయులకు ఫిలిప్పీన్స్‌‌ వీసా ఫ్రీ ఎంట్రీ

#telugu News Ap News in Telugu BJP leader Breaking News in Telugu Google News in Telugu Latest News in Telugu new government Paper Telugu News Ready to form Telugu News online Telugu News Paper Telugu News Today

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.